samaikyandhra people
-
కేంద్ర మంత్రి కోట్ల డౌన్ డౌన్
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలో సమైక్య సెగ తగిలింది. జిల్లాలోని డోన్ రైల్వే స్టేషన్లో శుక్రవారం తనిఖీకి వెళ్లిన ఆయన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. ఒకానొక సందర్భంలో కోట్ల డౌన్, డౌన్ అంటు ఆయన్ని నిలువరించారు. కేంద్ర మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్యవాదులు కోట్లను డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై గతేడాది జులై 30న కేంద్ర ప్రకటన వెలువడిన వెంటనే పదవికి రాజీనామా చేసి ఉంటే పరిస్థితి ఇంతదాక వచ్చేది కాదని వారు కోట్లను నిలదీశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎంపీలపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
మంత్రి కన్నా ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం టీ నోట్ ఆమోదించిన నేపథ్యంలో శుక్రవారం సమైక్యవాదులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నగరంలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. అందులోభాగంగా ఈ రోజు ఉదయం నగరంలోని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. అయితే అప్పటికే మంత్రి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దాంతో పోలీసులకు, సమైక్యవాదుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే శంకర విలాస్ సెంటర్ సమీపంలోని బ్రిడ్జ్పై సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై బారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. -
విజయనగరంలో బొత్స ఇంటి వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయనగరం లోక్సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఇంటిని గురువారం ఉదయం సమైక్యవాదులు, ఏపీఎన్జీవోలు ముట్టడించారు. బొత్స ఝాన్సీ తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అయితే ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా అప్పటికే ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే సమైక్యవాదులు,పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఇరువైపులా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి యనని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రాష్ట్ర విభజనపై భగ్గుమన్న ప్రొద్దుటూరు