-
విద్యార్థులను సతాయించొద్దు
త్వరలోనే ఫీజురీరుుంబర్స్మెంటు విడుదల చేస్తాం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భీమారం : ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విషయంలో విద్యార్థులను సతాయించొద్దని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కళాశాల యూజమాన్యాలకు సూచించారు. నగర పరిధిలోని తులసి గార్డెన్లో ఆదివారం ఇంటర్మీడియట్ విద్యపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కొన్ని కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు చేస్తున్నాయని, ఇలాంటి వారు తమ పద్ధతులు మార్చుకోవాలన్నారు. 2014-2015కు సంబంధించి ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. 2015-16కు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ సైతం జనవరి నెలాఖరు వరకు విడుదల చేస్తామన్నారు. ఇంటర్మీడియట్ బోర్డును ఆన్లైన్ చేస్తున్నామని, తద్వారా అవినీతికి తావుండదన్నారు. ప్రభుత్వ కళాశాల్లో విద్యార్థుల నమోదు శాతం పడిపోతోందని, అరుుతే, ప్రైవేటు కళాశాలలకు ధీటు గా ఇందులో విద్య అందిస్తామన్నారు. ప్రైవేట్ కళాశాలల అప్లియేషన్ను ఐదేళ్లకు పెంచే విషయంపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.వరదారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు నర్సింహారావుతోపాటు రాష్ర్టంలోని పది జిల్లాలకు చెందిన జూనియర్ కళాశాల యాజమాన్య వర్గ సభ్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే నాణ్యమైన విద్య తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశబుూలల మేనేజ్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరదారెడ్డి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్బోర్డులో పైసలు లేకుండా పనిజరగడంలేదన్నారు. స్పందించిన కడియం.. ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరుగుతున్న మాట వాస్తమమేనని అంగీకరించారు. కానీ, తెలంగాణ విద్యార్థులు నిట్, ఐఐటీలో అత్యధిక సీట్లు సాధించడమే ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుందనడానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇంటర్బోర్డు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే నిలదీయాలని సూచించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారుు. -
సారూ కాల్మొక్తాం.. సర్టిఫికెట్లివ్వండి!
రంగారెడ్డి జిల్లా: ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆదిలాబాద్కు చెందిన లింగస్వామి 2014-15లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్లో చేరాడు. కానీ, రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కోర్సును వదిలేశాడు. డైట్సెట్లో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని ఇంజినీరింగ్ కాలేజీని సంప్రదించగా ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇంతలో అటుగా వస్తున్న కళాశాల చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి కాళ్లపై పడి సర్టిఫికెట్లు ఇప్పించాలని లింగస్వామి, తల్లిదండ్రులు వేడుకున్నారు. చైర్మన్ జోక్యంతో కొద్దిమొత్తం చెల్లించి లింగస్వామి సర్టిఫికెట్లు పొందాడు. -
రీయింబర్స్మెంట్ నిధుల స్తంభన
8 ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల నగదు జమ ఎప్పటికో 8కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు చేతికి రాక విద్యార్థుల ఇబ్బందులు మచిలీపట్నం : ప్రభుత్వం విద్యార్థులతో ఆటలాడుకుంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేసినట్లే చేసి విద్యార్థుల ఖాతాల్లో జమ కాకుండా ఫ్రీజింగ్ విధించింది. దీంతో కోర్సు పూర్తయినా ఫీజు చెల్లించని కారణంగా పలువురు విద్యార్థుల చేతికి సర్టిఫికెట్లు రాని పరిస్థితి నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు జమ అయ్యే వరకు సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి.పై చదువులకు వెళ్లాల్సిన విద్యార్థులకు సర్టిఫికెట్లు లేకుంటే ఇబ్బందే. ప్రభుత్వం తీరుతో విద్యార్థుల భవిష్యత్తుపై అయోమయం నెలకొంది. ఒకపక్క ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లకు సంబంధించి తాము జాబితాలు పంపామని బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించి నగదు మంజూరైనట్లు ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు.బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థుల వివరాలను సోమవారమే ఇచ్చారని, వాటిని పరిశీలించేందుకు మరికొంత సమయం పడుతుందని వారంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా వచ్చిన జాబితాల్లో విద్యార్థుల వివరాలు సక్రమంగా నమోదు కాలేదనే కారణం చూపి కొంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నగదును జమ చేయని పరిస్థితి ఉంది. ఏ తరహా నగదు జమలపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందో తమకే తెలియదని చెప్పి ట్రెజరీ అధికారులు తప్పించుకుంటున్నారు. ట్రెజరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు జిల్లాలో ఉన్న పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపకపోవటం గమనార్హం. నిధులున్నా ఉపయోగం లేదు బీసీ సంక్షేమ శాఖ ద్వారా వివిధ కళాశాలల్లో చదివే 46,312 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ రూపేణా రూ.16.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొంతమంది విద్యార్థుల ఖాతాల్లో సగం మొత్తం మాత్రమే నగదు జమ అయ్యింది. బీసీ విద్యార్థులకు 38,512 మందికి ఫీజు రీయింబర్స్మెంట్గా రూ.31.93 కోట్ల నిధులు విడుదల కాగా సోమవారమే దీనికి సంబంధించిన జాబితాలను ఈ శాఖ అధికారులు ట్రెజరీకి పంపారు. 17,421 మంది ఈబీసీ విద్యార్థులకు సంబంధించి రూ.23.36 కోట్లు మంజూరు కాగా ఎంత మంది విద్యార్థులకు ఈ నిధులను అందజేశారో తెలియని పరిస్థితి నెలకొంది. గిరిజన సంక్షేమశాఖలో 4525 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 3323 మందికి నగదు అందజేశారు. మిగిలిన 1202 మందికి ఫీజు రీయింబర్స్మెంట్ అందని పరిస్థితి నెలకొంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 36,032 మంది విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్గా రూ.70.80 కోట్లు, స్కాలర్షిప్గా రూ.19.83 కోట్లు మొత్తం రూ.90.63 కోట్లు మంజూరు చేశారు. దీనిలో ఫీజు రీయింబర్స్మెంట్గా రూ.67.87 కోట్లు, స్కాలర్షిప్గా రూ.18.01 కోట్లు కలిపి మొత్తంగా రూ.85.88 కోట్లు ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. అయినప్పటికీ చాలా మంది ఖాతాల్లో స్కాలర్షిప్ నగదు సగం మాత్రమే జమ అయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు నేరుగా ప్రిన్సిపాల్ ఖాతాలో జమ అవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదని, దీంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నగదు వెంటనే విద్యార్థుల ఖాతాలో జమ అయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
పదిరోజుల్లోగా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం: కృష్ణయ్య హైదరాబాద్: రూ.850 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఈ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయపార్టీలు, విద్యార్థి, యువజన, బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రాష్ట్ర బంద్, కళాశాలల బహిష్కరణ, తదితర రూపాల్లో ఆందోళన తీవ్రతర ం చేస్తామని హెచ్చరించాయి. ఫీజు బకాయిలు చె ల్లించాలని, ఈ ఏడాది దరఖాస్తులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు మల్లు రవి, రమ్య, సీపీఐ నేత రాంనర్సింహారావు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఉదయం ఆర్.కృష్ణయ్యకు బీసీ హాస్టల్ విద్యార్థి వెంకటేష్ పూలమాల వేసి దీక్షను ప్రారంభించగా, సాయంత్రం పొన్నాల లక్ష్మయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆర్ .కృష్ణయ్య మాట్లాడుతూ వారం, పదిరోజుల్లో ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రావాలి: పొన్నాల రాజకీయాలకు అతీతంగా పేదల పక్షాన పోరాడేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రె డ్డి మాట్లాడుతూ ఫీజుల విషయంలో ఏ ముఖ్యమంత్రీ వ్యవహరించని విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరి దీక్షకైనా మద్దతిస్తాం: వైఎస్సార్సీపీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు కోసం ఎవరు దీక్ష చేసినా పార్టీలకతీతంగా తమ పార్టీ మద్దతిస్తుందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.ఫీజు బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నీరుగార్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పుడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. -
రెన్యూవల్ కష్టాలు
ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యూవల్ దరఖాస్తుకు నేడు ఆఖరు లేనిపోని నిబంధనలు, తక్కువ గడువు ఇచ్చిన ప్రభుత్వం దరఖాస్తుకు దూరమైన వేలాదిమంది విద్యార్థులు బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్కు రెన్యూవల్ చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ ఆఖరు కావడంతో విద్యార్థులు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాల కోసం అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్కు ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రాల్లో కనీసం 15 రోజుల సమయం పడుతుంది. కాగా ప్రభుత్వం ఇచ్చిన సమయం కేవలం 14 రోజులు మాత్రమే. ఈ 14 రోజుల్లోనూ రెండు ఆదివారాలు, ఒక రెండో శనివారం, మొహర్రం పండుగ సెలవులు వచ్చాయి. ఇక మిగిలిన పది రోజుల్లో విద్యార్థులు ప్రభుత్వం కోరిన విధంగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది సందిగ్ధం. అలాగే ఫీజురీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులంతా జూన్ 2 తర్వాత మీ సేవా కేంద్రాల్లో పొందిన కుల, ఆదాయ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. విద్యార్థుల ఆధార్తో పాటు తల్లిదండ్రుల ఆధార్కార్డులనూ అప్లోడ్ చేయాలనే నిబంధనా ఉంది. దీంతో అనేక మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోలేక దూరం కానున్నారు. రీయింబర్స్మెంట్ తేదీల ప్రతిపాదనలను గత నెల 27న ప్రభుత్వం అన్ని కళాశాలలకు పంపించింది. ఈ పాస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అయితేఈ నోటీసులను సరైన సమయంలో విద్యార్థుల దృష్టికి తీసుకుపోవడంలో అనేక కళాశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం 64,172 మంది రెన్యూవల్ విద్యార్థులకుగాను ఇప్పటి వరకు 12,661 మంది మాత్రమే రెన్యూవల్కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాస్త గడువు పెంచి, నిబంధనలు సడలిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. గడువు పెంచాలి ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యూవల్ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచాలి. దరఖాస్తు చేసుకునేందుకు అనేక నిబంధనలు విధించి అతి తక్కువ సమయం ఇస్తే ఎలా. విద్యార్థులకు అన్యాయం చేసేందుకే ప్రభుత్వం ఈ విధమైన కుట్రలను పన్నుతోంది. - మహ్మద్ఫ్రీ బీటెక్, ద్వితీయ సంవత్సరం ఉన్నత విద్యను దూరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు ఇలాంటి ప్లాన్లు చేస్తోంది. అతి తక్కువ వ్యవధిలో దరఖాస్తు చేసుకోమంటే ఎలా సాధ్యమవుతుంది. అనేక మందికి ఆధార్కార్డులు లేక పోయినా, ఫీజుకు ఆధార్ లింకు పెట్టడం బాధాకరం. - జీవీ నాగేంద్ర, బీటెక్ ఫైనలియర్ నిబంధనలను సడలించాలి ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను సడలించాలి. ముఖ్యంగా ఫీజుకు ఆధార్ లింకును తొలగించాలి. అలాగే జూన్ 2 తర్వాత మీ సేవా కేంద్రాల్లో తీసుకున్న కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలి. - జీ శివశంకర్, బీటెక్ ఫైనలియర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement