breaking news
RFP
-
ఎల్ఐసీ ఐపీవోకు న్యాయ సంస్థల సేవలు కావాలి
న్యూఢిల్లీ: ఎల్ఐసీ భారీ ఐపీవో విషయంలో న్యాయసేవలు అందించే సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. న్యాయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించడం ఇది రెండో పర్యాయం కావడం గమనార్హం. తొలుత జూలై 15న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ/ప్రతిపాదనలు) విడుదల చేసి ఆగస్ట్ 6వరకు గడువు ఇచి్చంది. తగినంత స్పందన రాకపోవడంతో పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) మరో విడత న్యాయ సేవల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహా్వనం పలుకుతూ గురువారం ఆర్ఎఫ్పీని విడుదల చేసింది. మొదటి విడత తగినంత స్పందన రాలేదని స్పష్టం చేసింది. ఐపీవో, క్యాపిటల్ మార్కెట్ల చట్టాల విషయంలో తగినంత అనుభవం కలిగిన ప్రముఖ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహా్వనించింది. ఎల్ఐసీ ఐపీవో కోసం గత వారమే 10 మంది మర్చంట్ బ్యాంకర్లను దీపమ్ ఎంపిక చేయడం గమనార్హం. దేశ చరిత్రలోనే అతిపెద్ద నిధుల సమీకరణగా ఎల్ఐసీ ఐపీవో రికార్డు సృష్టించనుందని అంచనా. -
2022కల్లా కొత్త పార్లమెంట్!
న్యూఢిల్లీ: 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన లేదా ఉన్న భవనాలకే ఆధునిక హంగులద్దిన పార్లమెంట్లో జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది. కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఫ్లోటింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదా ! ఇప్పుడున్న భవన సముదాయం 1927లో నిర్మితమైందని, ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఆఫీసు కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా రూ. 1,000 కోట్లు ఖర్చువుతోంది. కొత్తవాటిని నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
పలు మార్గాల్లో ఏసీ బస్సులు
- ఆర్ఎఫ్పీలను ఆహ్వానించిన ఎమ్మెమ్మార్డీయే - తొలుత కుర్లా, బాంద్రా, సైన్ ప్రాంతాల మధ్య.. - 25 బస్సుల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం - వివిధ బస్సు తయారీ కంపెనీలకు లేఖ సాక్షి, ముంబై: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటి (ఎమ్మెమ్మార్డీఏ) పలు మార్గాల మధ్య ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తోంది. ఏసీ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా ఎమ్మెమ్మార్డీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానించింది. ఈ బస్సులను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్యలో అదేవిధంగా కుర్లా, బాంద్రా, సైన్ ప్రాంతాల మధ్య వీలైనంత త్వరగా నడిపేందుకు యోచిస్తోంది. ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల మధ్య రోజు ఉద్యోగ రీత్యా ప్రయాణించే వారికి మరింత మెరుగైన కనెక్టివిటీ ఇచ్చేందుకు ఈ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. అయితే 10 ఏళ్ల కోసం వివిధ నమూనాలు గల 25 బస్సులను ఈ మార్గాల మధ్య నడిపేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. దీంతో తాము అర్హత గల ఆర్ఎఫ్పీలను ఆహ్వానించామన్నారు. పేరొందిన జాతీయ అంతర్జాతీయ బస్సు ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. గతేడాది ఎమ్మెమ్మార్డీఏ టాటా మోటార్స్, వోల్వోలకు ఈ బస్సుల కొనుగోలు నిర్వహణ విషయమై ఓ లేఖ రాసింది. అయితే వీరి నుంచి స్పందన కరువవడంతో ఎమ్మెమ్మార్డీ ఆర్ఎఫ్పీని ఆహ్వానించేందుకు నిర్ణయించింది. బెస్ట్ అయితే బాంద్రా, కుర్లా, సైన్ల మధ్య కనెక్టివిటి సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయనీ ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ మార్గాల మధ్య సరైన కనెక్టివిటీ లేకపోవడంతో ఆటోలు, ట్యాక్సీలకు అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందన్నారు. ప్రయాణికులు బస్సు ద్వారా బీకేసీ వెళ్లాలంటే సమీప బస్టాపుకు కనీసం కిలో మీటర్ మేర నడవాల్సి వస్తోందని, వారికార్యాలయాలు మెయిన్ రోడ్ నుంచి చాలా దూరంలో ఉన్నాయయని చెప్పారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్లు వెలువెత్తుతుండడంతో ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తున్నామని అధికారి వెల్లడించారు. ఇదిలా వుండగా, 2012లో బీకేసీ మధ్య కనెక్టివిటీపెంచేందుకు దాదాపు 15 నుంచి 20 బస్సులను బెస్ట్కు అందజేసేందుకు ఎమ్మెమ్మార్డీఏ నిర్ణయించింది. అయితే ఈ బస్సులను నడిపేందుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు వరకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ బస్సుల చార్జీలు బెస్ట్ బస్సుల కంటే కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే అలా చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.