breaking news
RFID-chips
-
కొత్త ఈ-పాస్ పోర్ట్లను హ్యాక్ చేస్తే ఇక అంతే సంగతులు..!
న్యూఢిల్లీ: రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) చిప్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ-పాస్ పోర్ట్లను త్వరలో జారీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడి వ్యక్తిగత వివరాలు పాస్ పోర్ట్ బుక్ లెట్'లో పొందుపరిచిన చిప్లో డిజిటల్ రూపంలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం ఈ- పాస్ పోర్ట్లను జారీ చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. "దేశ పౌరులకు అధునాతన భద్రతా లక్షణాలతో కూడిన చిప్ ఆధారిత ఈ- పాస్ పోర్ట్లను జారీ చేయాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ పాస్ పోర్ట్ లో కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్ టెక్నాలజీ ఉంటుంది. పాస్ పోర్ట్ ముందు లేదా వెనుక కవర్ లేదా పేజీలో పొందుపరిచిన ఎంబెడెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) చిప్ కూడా ఉంటుంది"అని ఈ- పాస్ పోర్ట్లపై అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆయన తెలిపారు. ఇందులో ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థ అయిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఎఒ) మార్గదర్శకాలకు అనుగుణంగా "చిప్ లక్షణాలు" ఉన్నాయని ఆయన అన్నారు. "దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు చిప్లో డిజిటల్ రూపంలో నిల్వ చేస్తారు. ఈ చీప్ భౌతిక పాస్ పోర్ట్ బుక్ లెట్ ఉంటుంది" అని మంత్రి తెలిపారు. "ఒకవేళ ఎవరైనా చిప్లను హ్యాక్ చేసినట్లయితే, కేంద్రం దగ్గర ఉన్న సీస్టమ్ దానిని గుర్తిస్తుంది. ఫలితంగా ఆ పాస్ పోర్ట్ను రద్దు చేస్తారని" ఆయన అన్నారు. దీంతో మోసాలు, ట్యాంపరింగ్ నుంచి దేశ పౌరులకు రక్షణ లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో 93 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, 428 పోస్టాఫీసు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని మురళీధరన్ తెలిపారు. ఈ కొత్త సీస్టమ్ వల్ల విమానాశ్రయాల వద్ద చెకింగ్ టైమ్ కూడా తగ్గుతుంది అని తెలిపారు. (చదవండి: ఈ రూల్ ఫాలో కాకుంటే..! మీ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం..!) -
వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ చిప్లు
టోల్నాకాల వద్ద రుసుములు వసూలు చేసే ప్రక్రియను మరింత వేగవంతమయ్యేలా చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. టోల్నాకాల వద్ద వాహనాల కదలికలను గమనించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాన్ని (ఆర్ఎఫ్ఐడీ) అమర్చుతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ఇటీవల అంధేరీ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈ పరికరం అమర్చడం ద్వారా కలిగే లాభాలను కూడా వివరించారు. ఆర్ఎఫ్ఐడీ పరికరాన్ని అమర్చిన వాహనాల వేగాన్ని దూరం నుంచే నియంత్రించవచ్చన్నారు. ఓవర్ లోడింగ్ను కూడా నివారించవచ్చన్నారు. ఆర్ఎఫ్ఐడీలో వాహనాలకు సంబంధించిన మొత్తం వివరాలను పొందుపర్చుతారు. ఈ పరికరం అమర్చడంతో వాహనాల కదలికలను కూడా కంప్యూటర్లో గమనించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.వాహనాలకు ఈ పరికరం రీచార్జ్కార్డు వంటిదని, టోల్నాకా మీదుగా వాహనం వెళ్లగానే టోల్సెస్ మొత్తం అందులో నుంచి తగ్గి నాకా ఆపరేటర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇందులో బ్యాలెన్స్ అయిపోగానే రీచార్జ్ చేసుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్ఎఫ్ఐడీని స్టికర్ మాదిరిగా వాహనానికి ముందు భాగంలో ఉన్న అద్దానికి అంటిస్తారు. ఇది ఒక చిప్ను కలిగి ఉంటుంది. ఇందులో వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, యజమాని పేరు, ఫిట్నెస్ వివరాలు, పీయూసీ సర్టిఫికెట్తోపాటు రవాణా చేస్తున్న వస్తువుల పన్ను చెల్లింపు వివరాలను కూడా ఇందులో ఉంటాయి. ఈ పరికరం ట్రక్కులు, ట్యాంకర్ల వంటి భారీ వాహనాలకు బాగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి చవాన్ అన్నారు. అంతేగాకుండా 22 ఆటోమేటిక్ సరిహద్దు చెక్ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇందులో నాలుగు చెక్ పోస్టులను ఇది వరకే ప్రారంభించామనీ, మరో నాలుగు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయనీ వివరించారు. మిగతా చెక్పోస్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ స్టిక్కర్లను అంటించడానికి ఠాణే ఆర్టీవో ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి కొంత మేర తగ్గనుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.