-
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 12.5 శాతం పెరిగి రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో వసూలైన రూ.1.50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల వసూళ్లు రూ. 1.67 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఈ మొత్తం గత ఏడాది కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.9.57 లక్షల కోట్లను వసూలు చేయాలని కేంద్రం లక్క్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. -
ఆంధ్రప్రదేశ్లో నూతన సంస్కరణలతో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పట్టాలెక్కని హక్కు.. ఏళ్ల తరబడి అసైన్డ్ పట్టాదారుల నిరీక్షణ
హద్దుల సమస్యే అడ్డంకి.. రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పలు ప్రాంతాల్లోని ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అసైన్డ్ భూములు ఫారెస్ట్ పరిధిలోకి వస్తున్నాయని ఆ శాఖ అధికారులు దిమ్మలు ఏర్పాటు చేసి కందకాలు తవ్వారు. దీంతో చాలా చోట్ల రైతులు, అటవీ సిబ్బంది మధ్య గొడవలు చోటుచేసుకోగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో సైతం కేసులు నడుస్తున్నాయి. ఈ విషయాల్లో రెవెన్యూ శాఖ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంది. జిల్లాలో అటవీ, రెవెన్యూ భూమికి సంబంధించి పక్కా హద్దులు లేకపోవడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దుల్లోని సర్వే నంబర్లలో ఇచ్చిన అసైన్డ్ పట్టా భూములకు సంబంధించి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఈ సమస్య పరిష్కారానికి ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయని.. ప్రస్తుతం ఆ మాటే మరిచాయని అసైన్డ్ పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యపై దృష్టి సారించి.. తమకు హక్కులు కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 38,770 ఎకరాల్లో అసైన్డ్ భూములు.. జిల్లాలోని 11 మండలాలు 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 66,901.05 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 1,630 మంది రైతులు 3,195.68 ఎకరాల్లో ఆక్రమణలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ప్రభుత్వ భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్కు కేటాయించిన భూమి పోను.. మిగతా దాంట్లో కొంత మేర పేద రైతులకు అసైన్డ్ కింద పట్టాలు అందజేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 48,320 ఎకరాల భూమిని అసైన్డ్ పట్టా కింద పేదలకు ఇవ్వగా.. ఇందులో అటవీ పరివాహక గ్రామాలున్న 11 మండలాల్లో అసైన్డ్ పట్టా భూములు దాదాపు 38,770 ఎకరాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు.. నాకు చిన్నదర్పల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 16లో మూడు ఎకరాల విస్తీర్ణంలో లావణిపట్టా భూమి ఉంది. సుమారు 50 ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఈ సీజన్లో పంట వేసేందుకు భూమిని చదును చేస్తుంటే అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో హన్వాడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మా భూమిలో పంటలు వేసుకోనివ్వాలని వేడుకున్నా. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఇప్పుడు పంటలు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. – వడ్డె తిరుమలయ్య, చిన్నదర్పల్లి, హన్వాడ -
తీగ లాగితే ‘రెవెన్యూ’ డొంక కదులుతోంది
సాక్షి, గుంటూరు(చేబ్రోలు): ప్రభుత్వం పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కొంత మంది అవినీతి అధికారుల కారణంగా చెడ్డపేరు వస్తోంది. చేబ్రోలు తహసీల్దారు కార్యాలయ అధికారి, సిబ్బంది చేతివాటంపై తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా రెండు రోజులుగా చేబ్రోలులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి ఈ నెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంతో 4వ తేదీన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చేబ్రోలు తహసీల్దారు బీపీ ప్రభాకర్ను సస్పెండ్ చేశారు. చేబ్రోలు తహసీల్దారుగా పనిచేస్తున్న బీపీ ప్రభాకర్ మహిళా వలంటీర్ని రాత్రి సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడం, ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు, భూములు ఆన్లైన్ నమోదులో అక్రమాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తహసీల్దారును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణకు తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా నలుగురు తహసీల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో జరిపిన రికార్డుల పరిశీలనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ►రెవెన్యూ నిబంధనల ప్రకారం క్వారీ గోతులకు సాగు భూములుగా అనుమతులు ఇవ్వకూడదు. సస్పెండ్ అధికారి మాత్రం చేబ్రోలు, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల్లో 80ఎకరాల్లోని క్వారీ భూములకు సాగు భూములుగా ఆన్లైన్లో నమోదు చేసి వాటికి పాసు పుస్తకాలను కూడా అందజేసి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. సుద్దపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 135,136, 139లలో ఆవుల హరిబాబు, ఝాన్సీ, నవీన్, సుబ్బారావు, సువేందుల కుటుంబానికి చెందిన 60 ఎకరాల భూమి దశాబ్ద కాలం క్రితమే క్వారీంయింగ్ జరిగి గోతులుగా ఉన్న భూమికి సస్పెండ్ అయిన రెవెన్యూ అ«ధికారి లక్షలాది రూపాయిలు జేబులో వేసుకొని కొద్ది నెలల క్రితం పాసుపుస్తకాలు అందజేసి ఆన్లైన్లో నమోదు చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేశారు... ►చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చేసి తమ ఘనతను చాటుకున్నారు. వడ్లమూడి గ్రామంలోని సర్వే నెంబరు 345/7లో 96 సెంట్ల భూమి రైతు పేరున ఉంది. దాని పక్కనే ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కలిపి 1.96 ఎకరాల భూమిని ఆన్లైన్లో ఆ రైతు పేరున నమోదు చేయటం వెనుక లక్షల రూపాయిల సొమ్మును స్థానిక ఆర్ఐ, వీఆర్వో, కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో సస్పెండ్ అధికారి పూర్తి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ►చేబ్రోలులోని సర్వే నంబరు 709లో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో గత 20 ఏళ్లుగా పాసుపుస్తకం జారీకి నోచుకోలేదు. సస్పెండ్ అధికారితో పాటు అతడి అనుచరులు కలిపి పక్కాగా ఆన్లైన్లో నమోదు చేసి పాసుపుస్తకాన్ని అందజేయటంతో లక్షల రూపాయిలు స్వాహా చేసినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పక్కదారి పట్టించిన సస్పెండ్ అధికారి అతడి సోదరుడు, అతడి ముఖ్య అనుచరులపై విచారణ జరిపి వారిని కూడా సస్పెండ్ చేసి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఇళ్ల స్థలాల పంపిణీలో రెవెన్యూ అధికారి లీలలు.. చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, వేజండ్ల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించి అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు స్థానికులు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కూడా వివిధ గ్రామాల నుంచి తహసీల్దారుపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎమ్మెల్యే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. నారాకోడూరు మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయించి ఎటువంటి విచారణ లేకుండా ఇళ్ల స్థలాలు అందజేసినట్లు గుర్తించారు. తహసీల్దారు 150 మంది వరకు అనర్హులకు ఇళ్ల పట్టాలు, పది నుంచి 20 వేలు వరకు డబ్బులు తీసుకొని అందజేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల విచారణలో కూడా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
రెవెన్యూలో బయోమెట్రిక్..
ఖానాపురం: చిన్నగా ఆఫీస్కు వెళుదామనుకునే రెవెన్యూ ఉద్యోగులకు ఇక కుదరదు. కార్యాలయానికి వెళ్లి కనబడి ఇతర పనులు చూసుకుందామనుకుంటే ఇక ఆ ఆటలు చెల్లవు.. సమయం పాటించని ఉద్యోగులకు బయోమెట్రిక్తో పరుగులు పెట్టించడానికి అధికారులు సమయాత్తమవుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో సమయపాలన పాటించేవిధంగా ప్రభుత్వం బయోమెట్రిక్ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.జిల్లా వ్యాప్తంగా 16 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు వీఆర్వో, వీఆర్ఏ, కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరై, సాయంత్రం 5 గంటలకు విధులు ముగించాల్సి ఉంటుంది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి మొదట 2012 నుంచి 2014 సంవత్సరం వరకు బయోమెట్రిక్ విధానాన్ని చేపట్టారు. నాడు ఉద్యోగులు ఆధార్ ఎన్రోల్మెంట్ సరిగ్గా చేయకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. ఆ తర్వాత బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల కాలంలో రెవెన్యూశాఖపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోసారి తహసీల్దార్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి కలెక్టర్ ముండ్రాతి హరిత, జేసీ రావుల మహేందర్రెడ్డిల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగే దానికంటే ముందే కలెక్టరేట్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాలు అమలు చేసి తహసీల్దార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే లక్ష్యంగా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రస్తుతం బయోమెట్రిక్ విధానాన్ని విజయవంతంగా సాగిస్తున్నారు. ఐదు రోజులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు కలెక్టర్ హరిత కా ర్యాలయ సిబ్బందికి సూచించారు. ఈ నెల 2 నుం చే అమలు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత వారం రోజులకు పైగా సిబ్బంది బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించుకోవడానికి ఆధార్ను ఎన్రోల్మెంట్ చేసుకోవ డం జరిగింది. ఆలస్యం చేయకుండా మంగళవా రం నుంచి తప్పకుండా ఉద్యోగులు బయోమెట్రిక్ను వినియోగించాలనే స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఉద్యోగులు ఆధార్ ఎన్రోల్ చేసుకుం టూనే విధుల హాజరును చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 191 మంది ఉద్యోగులు రి జిస్టర్ చేసుకోగా 180 మంది ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆక్టివేట్ కావడం జరిగింది. అలాగే జిల్లాలో మంగళవారం రోజున 59 మంది బయోమెట్రిక్ను ఉపయోగించినట్లు సమాచారం. తేలనున్న ఉద్యోగుల సంఖ్య బయోమెట్రిక్ విధానంతో జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ప్రజలకు న్యాయమైన సేవలు అందడంలేదు. కొన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఐదుగురు లోపు మాత్రమే ఉద్యోగులు ఉండడంతో ప్రజలకు కావాల్సిన సేవలు అందించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థి«తులు ఏర్పడుతున్నాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా పూర్తిస్థాయిలో ఉద్యోగుల సంఖ్య తెలిసే అవకాశం ఉండగా విధులకు ఎంత మంది హాజరవుతున్నారనే విషయం కలెక్టరేట్లో ఉన్నతాధికారులు ప్రతీ రోజు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సంఖ్య తేలిన తర్వాత కావాల్సిన ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టరేట్ అధికారులు సమయాత్తమవుతున్నారు. వీఆర్వోలకు మినహాయింపు బయోమెట్రిక్ విధానాన్ని తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు మాత్రమే వినియోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వీఆర్వోలు, వీఆర్ఏలకు బయోమెట్రిక్ను అనుసంధానం చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో వారికి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి బయోమెట్రిక్ చాలా ఉపయోగపడనుంది. బయోమెట్రిక్ను అందుబాటులోకి తీసుకువస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమలుకు శ్రీకారం చుట్టాం ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్కు శ్రీకారం చుట్టాం. ఈ నెల 2 నుంచి అమలు చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందుకున్నాం. ఇప్పటికే కలెక్టరేట్లో అమలు చేయడం జరుగుతుంది. ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభిస్తున్నం. – రాజేంద్రనాథ్, కలెక్టరేట్ ఏఓ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement