breaking news
railway tenders
-
బ్రేకింగ్: సీబీఐ విచారణకు లాలూ ప్రసాద్ యాదవ్
-
సీబీఐ విచారణకు లాలూ ప్రసాద్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. రైల్వే హోటళ్ల టెండర్ కేసులో అవినీతికి పాల్పడినట్టు లాలూ కుటుంబసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే లాలూ, ఆయన తనయుడు తేజస్వి సీబీఐ విచారణకు హాజరయ్యారు. గత నెల 10, 11 తేదీల్లో వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, ఈ కేసు విచారణలో మరింత వివరాలు రాబట్టేందుకు మరోసారి లాలూను సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. రైల్వే హోటళ్ల టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా లాలూ తనవారికి కట్టబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
రైల్వే టెండర్లలో అపశ్రుతి
సిండి కేట్ను విఫలం చేశాడని కాంట్రాక్టర్పై దాడి రైల్వేలో పనులకు నిర్వహించిన టెండర్లకు సంబంధించిన వ్యవహారం ఓ కాంట్రాక్టర్పై దాడికి దారితీసింది. సిండికెట్గా మారి తక్కువకు టెండర్ దక్కించుకోవాలని పలువురు కాంట్రాక్టర్లు వ్యూహం పన్నారు. అయితే ఓ కాంట్రాక్టర్ ఈ విషయం తెలియక విడిగా టెండ ర్ దాఖలు చేశారు. దీంతో మరికొందరు అదే బాట పట్టారు. తమ వ్యూహం దెబ్బతినడానికి కారణమయ్యాడని కొందరు ఆ కాంట్రాక్టర్పై దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కేసు నమోదు అయింది. గుంతకల్లు: గుంతకల్లు డివిజన్ పరిధిలోని రేణిగుంట రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం నం-01 నుంచి 05ల మధ్య క్లీనింగ్ పనులకు కోటి 91 లక్షల వ్యయ అంచనాలతో రెండేళ్ల కాలపరిమితితో టెండర్లు నిర్వహించారు. ఈ పనులకు హైదరాబాద్, గుంతకల్లు, కడప, రేణిగుంట, ఆదోని తదితర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు టెండరును దక్కించుకోవడానికి శతవిధాల యత్నించారు. ఈ క్రమంలోనే వీరంతా సిండికేట్గా ఏర్పడి గుడ్విల్ మాట్లాడుకున్నారు. అయితే హైదరాబాద్కు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ప్రతినిధి లక్ష్మీరెడి ఇదే పనికి షెడ్యూల్ దాఖలు చేశారు. సిండికేట్గా ఏర్పడిన కాంట్రాక్టర్లు ఈ విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఎవరికివారు తమ తమ షెడ్యూళ్లను దాఖలు చేశారు. దీంతో ఈ పనికి పోటీ ఏర్పడింది. సిండికేట్ యత్నం వీగడానికి కారణమైన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ప్రతినిధి లక్ష్మీరెడ్డిపై మధ్యాహ్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కాంట్రాక్టర్ లక్ష్మీరెడ్డి ముఖంపై రక్తగాయాలయ్యాయి. వన్టౌన్ ఎస్ఐ బీవీ నగేష్బాబు తమ సిబ్బందితో రైల్వే డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడు లక్ష్మీరెడ్డిని ఆరా తీయగా దాడి చేసిందెవరో తెలియదని, తనకు ఈ ప్రాంతం కొత్త అని సమాధానమిచ్చినట్లు ఎస్ఐ చెప్పారు. కాంట్రాక్టర్పై దాడి హేయం అని, ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఓబీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి, కాంట్రాక్టర్ గాలి మల్లికార్జున ఈ సందర్భంగా ఎస్ఐను కోరారు. బాధిత కాంట్రాక్టర్ లక్ష్మీరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. -
రైల్వే టెండర్ల ప్రక్రియలో సంస్కరణలు
న్యూఢిల్లీ: రైల్వేలో పారదర్శకతను పెంచేందుకు, టెండర్ల ప్రక్రియ వేగవంతమయ్యేందుకు ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్ల ప్రక్రియలో తన జోక్యం లేకుండా తప్పుకొన్నారు. వాటి ఖరారు బాధ్యతను రైల్వే జోన్లకు, ఉత్పత్తి విభాగాల అధిపతులకే అప్పగించారు. ప్రస్తుతం రైల్వే టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైల్వేల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ టెండర్ల ప్రక్రియను మంత్రి సులభతరం చేశారు. ప్రతి దాన్ని రైల్వే బోర్డు ఆమోదానికి పంపకుండా, సోర్స్ అండ్ వర్క్స్ విభాగ పనులకు టెండర్లను ఆమోదించే బాధ్యతను జోనల్ రైల్వేలకు, ఉత్పత్తి విభాగాలకు కట్టబెట్టారు. ఆయా విభాగాల జనరల్ మేనేజర్, డెరైక్టర్ జనరల్కే పూర్తి అధికారాలు ఉంటాయని శుక్రవారం రైల్వే శాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇకపై రూ. 500 కోట్లకంటే ఎక్కువ విలువ గల పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే బోర్డు స్థాయిలో ఆమోదిస్తారు.