breaking news
purana pool
-
హైదరాబాద్: టైర్ల గోదాంలో ఎగిసి పడుతున్న మంటలు
-
400 సంవత్సరాల చరిత్ర.. కులీకుత్బ్షా, భాగమతి ప్రేమకు చిహ్నం..
సాక్షి, జియాగూడ: ప్రపంచంలోనే ఏకైక ప్రేమికుల వారధిగా పురానాపూల్ వంతెన ప్రేమకు సాక్షిగా నిలిచింది. ఇక్కడి నుంచే భాగ్యనగర నిర్మాణానికి పునాది పడింది. ఎన్నో విశేషాలతో నిర్మించిన ఈ చారిత్రక వారధి నిర్లక్ష్యానికి గురవుతోది. కట్టడానికి ఎలాంటి భద్రత లేదు. ప్రేమికుల వారధిగా గుర్తింపు పొందిన ఈ వారిదిపై ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని పలువురు కోరుతున్నారు. కులీకుత్బ్షా, భాగమతి ప్రేమకు చిహ్నం.. గోల్కొండ యువరాజు మహ్మద్ కులీకుత్బ్షా పరవళ్లు తొక్కుతున్న మూసీనది అవతలి ఒడ్డన్న నివసించే భాగమతి ప్రేమలో పడ్డాడు. తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుత్బ్షా వీరి ప్రేమను గుర్తించి వీరి ప్రేమకు చిహ్నంగా పురానాపూల్ను ప్యారానాపూల్గా నామకరణం చేసి నిర్మించాడు. వీరి ప్రేమకు సాక్షిగా వంతెన, భాగ్యనగరం అంచెలంచెలుగా వెలిసింది. చారిత్రాత్మకమైన వంతెన.... పురానాపూల్ వంతెన కుతుబ్షాహీలు నిర్మించిన అద్భుత నిర్మాణాల్లో ఒకటి. అంతేకాదు హైదరాబాద్ నగరంలో నిర్మించిన మొదటి వంతెన కూడా ఇదే. ఈ వంతెన నిర్మాణం క్రీ.శ.1578లో ఇబ్రహీం కులీకుత్బ్షా నిర్మించారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ మీదుగా పాతబస్తీకి వెళ్లేందుకు ఈ వంతెనను నిర్మించారు. విదేశీయులు సందర్శన.. ఆసఫ్జాహీల కాలంలో హైదరాబాద్ను సందర్శించిన ఫ్రెంచి బాటసారి టావెర్నియర్ వంతెన నిర్మాణ శైలిని చూసి ముగ్దుడయ్యాడు. దీనిని ప్యారిస్లోని ఫౌంట్ న్యూప్తో పోల్చాడు. ఎన్నో విశేషాలతో కూడిన ఈ వంతెనను ప్రభుత్వం గుర్తించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర టూరీజం శాఖ కిషన్రెడ్డి, తెలంగాణ టూరీజం మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, తెలంగాణ టూరీజం డెవలప్మెంట్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వంత్తెనను సందర్శించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలెన్నో.. 400 ఏళ్ల నాటి ఈ నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. రెండు మూడు సార్లు భారీ వరదలకు కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ నిజాం పాలకులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం వంతెనపై కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. పలు చోట్ల వంతెన ప్రహరీ కూడా కూలిపోయింది. వంతెన పైనే వ్యాపారులు షెడ్లు వేసుకునేందుకు ఇనుప పైపులు పాతుతున్నారు. దీంతో వంతెనకు ప్రమాదం ఏర్పడుతోంది. అలాగే వంతెన దిగువన మూసీ మురుగునీరు నిలిచి ఉండడంతో వంతెన బీటలు వారుతోంది. వంతెనపై కూరగాయల మార్కెట్ -
ప్రేమ పునాదులపై భాగ్యనగరం
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ పునాదిపై వెలసిన మహాసౌధం భాగ్యనగరం. ఈ అందమైన ప్రేమకావ్యంలో ప్రతి అక్షరం కమనీయం. తొలిచూపులోనే విరిసిన వలపులు ఆ ఇద్దరినీ ఏకం చేశాయి. భాగమతీ–కులీకుతుబ్ల ప్రేమఘట్టం ఆద్యంతం ఆసక్తిదాయకం. ఈ జంటలాగే నిజాం కాలం నాటి రెసిడెంట్ కిర్క్పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమఘట్టం కూడా ఒక అద్భుత కావ్యంగానే నిలుస్తుంది. కులీ, భాగమతిలను ఏకం చేసేందుకు మూసీనదిపై ఏకంగా ఒక ప్రేమ వంతెన (పురానాఫూల్) వెలసింది. కిర్క్,ఖైరున్నీసాల ప్రేమకు సాక్షంగా అద్భుత కళాఖండం లాంటి బ్రిటిష్ రెసిడెన్సీ నిలిచింది. అజరామరమైన వారి ప్రేమ ఘట్టాలు ఇప్పటికీ ఆదర్శప్రాయం. వాలెంటైన్స్డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. సూర్యుడి నునులేత కిరణాలతో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంది. ఆకులపై పరుచుకున్న మంచుబిందువులు సూర్యకిరణాలతో తళుకులీనుతున్నాయి. హరివిల్లులై æ ప్రతిఫలిస్తున్నాయి. మరోవైపు మూసీ పరవళ్లు తొక్కుతోంది. కువకువలతో పక్షులు స్వాగతం చెబుతున్నాయి. అప్పుడప్పుడే మేల్కొన్న ‘చిచలం’ దినచర్యకు ఉపక్రమించింది. సరిగ్గా అదే సమయంలో కాలి పట్టాల చిరుసవ్వడిలో ఆమె వడివడిగా అడుగులు వేస్తూ పల్లె పొలిమేరలో ఉన్న ఆలయానికి వెళ్తోంది. ఆ సమయంలో అటుగా వస్తోన్న యువరాజు ఆమెను చూశాడు. ఆ ముగ్ధమోహన సౌందర్యరాశిని చూసి అప్రతిభుడయ్యాడు. గుర్రంపై ఆసీనుడై ఉన్న ఆయన మంత్రం వేసినట్టుగా ఆగిపోయాడు. ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆమె కొద్దిగా తలెత్తి అతన్ని చూసింది. ఇద్దరి చూపులు కలిశాయి. దేవకాంతలా ఉన్న ఆమె రూపం, మోములోని అమాయకత్వం నిజంగానే ఆయనను ముగ్ధున్ని చేశాయి. ఆ ఉదయం వారి తొలిప్రేమకు సంకేతం. ఆయనే గోల్కొండ యువరాజు కులీ కుతుబ్షా. ఆమె భాగమతి. అద్భుత ప్రేమ కావ్యంలో నాయకానాయికలు వాళ్లు. ఆమె సాధారణ యువతి...అతను యువరాజు. ఆమెది హైందవ సంప్రదాయం...అతనిది మహ్మదీయ మతం...వారి ప్రేమ ముందు ఆ ఆంతర్యాలు నిలవలేదు. వారి నిజమైన ప్రేమను పెద్దలూ ఆశీర్వదించారు. పెళ్లి బంధంతో వారిని ఏకం చేశారు. ఈ గొప్ప నగరానికి ఆమె పేరుతో భాగ్యనగరంగా నామకరణం చేశారు. ఒక నగరం వెలసింది.... షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్మహల్ను కట్టించాడు. కానీ కులీకుతుబ్షా...ఒక మహానగరాన్నే నిర్మించాడు. బహుశా మానవ చరిత్రలోనే తొలి ప్రేమనగరం మన హైదరాబాద్. భాగమతి తన ప్రియుడి కోసం మతాన్నే వదులుకొంది. హైదర్బానుబేగంగా తన పేరును మార్చుకుంది. ఆమె పేరుతోనే ‘హైదరాబాద్’ఏర్పడింది. మహా భీకరంగా ప్రవహిస్తోన్న మూసీ నదిని సైతం లెక్క చేయకుండా తన ప్రియురాలు భాగమతి కోసం ‘చిచలం’కు పరుగులు తీశాడు కుతుబ్. నదిని దాటేందుకు యువరాజు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గోల్కొండ పట్టణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిచలం వెళ్లేందుకు ఇబ్రహీం కుతుబ్ షా పురానాపూల్ వంతెనను కట్టించాడు. అది ప్రేమ వంతెనగా ప్రజల హదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. మూసీనదికి ఉత్తరాన కుతుబ్ షా మొట్టమొదటిసారి బాగ్మతిని చూసిన ‘ చిచలం’ వద్ద అద్భుతమైన చారిత్రక కట్టడం చార్మినార్తో నగర నిర్మాణం పూర్తయింది. అప్పటికి ఆ ఊరు మహారణ్యంలో ఒక మూలన ఉన్న చిన్న పల్లె. నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో మహ్మద్ కులీ కుతుబ్ షా ‘మేరా షహర్ లోగోసే మాముర్కర్ జో తూ దరియా మే మిన్ యా సమీ ’అని దైవాన్ని ప్రార్ధించాడు. అలా ఈ నగరం అనతి కాలంలోనే జనంతో నించిపోయింది. మహానగరంగా నిలిచింది. ఒకే నమూనాతో 1578లో పురానాపూల్, పాంట్న్యూహ్ వంతెనలు.... గోల్కొండ కోట నుంచి ‘చిచలం’ వెళ్లేక్రమంలో పరవళ్లు తొక్కే మూసీని దాటడం ఒక సవాల్గానే ఉండేది. భాగమతిని కలిసేందుకు కులీకుతుబ్షా ఆ నదిని దాటేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే మూసీ నదిని దాటేందుకు కుతుబ్షాహీ నిర్మించిన మొట్టమొదటి పురానాఫూల్ వంతెన చరిత్రలో ప్రేమ వంతెనగా స్థిరపడింది.అప్పట్లోనే అంతర్జాతీయ నిర్మాణశైలిలో దీన్ని కట్టించారు. 1578లో మూసీ నదిపై కట్టించిన ‘ నర్వ’(పురానాపూర్), పారిస్లోని సైని నదిపై నిర్మించిన బ్రిడ్జీలు ఒకే నమూనాలో ఉండడం విశేషం. బ్రిటీష్ రెసిడెన్సీ ఒక ప్రేమ సౌధం.... కులీకుతుబ్షా తరహాలో ఇంగ్లీష్ రెసిడెంట్ కిర్క్పాట్రిక్ తన సువిశాలమైనక్షేత్రంలో అద్భుతమైన కళాఖండంలా నిర్మించిన భవనం ఒక ప్రేమసౌధంగా చరిత్రలో నిలిచిపోయింది. అదే కోఠీలోని బ్రిటీష్ రెసిడెన్సీ (కోఠీ విమెన్స్ కాలేజ్). కిర్క్పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమనిలయంగా బ్రిటీష్ రెసిడెన్సీ చరిత్రలో నిలిచిపోయింది. ఆమె కోసమే ప్రత్యేకంగా కట్టించిన ‘రంగమహల్’లో వాస్తుశిల్ప నైపుణ్యం ఉట్టిపడుతుంది. -
పురానాపూల్లో భారీ బందోబస్తు
హైదరాబాద్: పురానాపూల్ డివిజన్లో రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు చేసినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ వెల్లడించారు. విధుల్లో 1500 మంది పోలీసులను మోహరించినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు శివకుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం7 గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది.