president candidate
-
తేలని తెలంగాణ బీజేపీ గమనం
కాంగ్రెస్ను ‘కప్పల తక్కెడ’ అని విమర్శించే బీజేపీ (BJP), తెలంగాణ (Telangana) విభాగం పార్టీ అంతర్గత వివాదాల్లో కాంగ్రెస్ను మించింది. కమలంలో ఎన్ని పువ్వు రేఖలున్నాయో అంత కన్నా ఎక్కువ గ్రూపులున్నా యని పార్టీ వర్గాలే నర్మగర్భ వ్యాఖ్య చేస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి! ఉన్న ఎని మిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో... అత్యధికులు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి పోటీ పడేవారే! వీరిలో ఒకరంటే మరొకరికి పడదు.పార్టీ జాతీయ బాధ్యులు కుదించిన రెండు, మూడు పేర్ల జాబితాల్ని అధిష్ఠానానికి సమర్పించినట్టు సమాచారం. పోయినసారి ఎన్నికల్లోనే వెనుకబడిన వర్గాల (బీసీ) వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం, అదే ఒరవడిలో బలమైన బీసీ సామా జికవర్గాలను మచ్చిక చేసుకునే ‘సోషల్ ఇంజినీరింగ్’కు యత్నిస్తోంది. ముది రాజ్, మున్నూరు కాపు (బీసీ), మాదిగ (ఎస్సీ) సామాజికవర్గాలకు ప్రాధాన్యంతో ‘త్రీ–ఎమ్ ఫార్ములా’ను ముందుకు తోస్తోంది. మల్కాజ్గిరిఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ (కరీంనగర్) పేర్లను అధినాయకత్వం సీరి యస్గా పరిశీలిస్తోందని అంటున్నారు. ఒకరు ముది రాజ్ సామాజికవర్గానికి చెందితే మరొకరు మున్నూరు కాపు సామాజికవర్గం వారు. బండి సంజయ్ ఇది వరకు అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నందున ఈటల రాజేందర్ వైపు అధినాయకత్వం కొంత మొగ్గింది. పార్టీలో తరచూ రగిలే పాత (తొలి నుంచి పార్టీలో ఉన్న), కొత్త (ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన) నాయకుల మధ్య ఉండే స్పర్థ ఒక అడ్డంకిగా మారింది. పార్టీ పాత నాయకులు పలువురు ఈ ఆలోచనను వ్యతిరేకించారు. దానికి తోడు పార్టీ నియమావళి ప్రకారం పదిసార్లకు తగ్గకుండా సాధా రణ సభ్యుడిగా, కనీసం మూడు పర్యాయాలు క్రియా శీల సభ్యుడిగా ఉన్న వారిని మాత్రమే అధ్యక్షుడిగా నియమించాలని ఉంది. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్య క్షుడిగా అన్నామలైని నియమించే విషయంలో లోగడ ఇటువంటి అడ్డంకే వచ్చింది. ఆయన 2017లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. పార్టీ నియమావళిని సడలించడం, పాత నాయకులకు నచ్చ జెప్పడం ద్వారా అధిష్ఠానం ఒక నిర్ణయం చేయవచ్చు. అలా చేస్తుందా? అన్నది ప్రశ్న. పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ (సంస్థా గత వ్యవహారాలు), సునీల్ బన్సల్ (రాష్ట్ర ఇంచార్జీ) వారివైన నివేదికలు పై వారికి (మోదీ–షా ద్వయం) ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, ఒక్క రాష్ట్రాధ్యక్ష ఎన్నిక మినహా దాదాపు పూర్తయింది. మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు ఎన్నికై రెండు, మూడు మాసాలవుతున్నా... రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో ముడివడి ఉండటం వల్ల జిల్లా కమిటీలు ఏర్పాటు కాలేదు.మండల స్థాయి కమిటీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే సంస్థా గతంగా బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు పార్టీని పటిçష్ఠపరచి, స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడా నికి వీలవుతుంది. అన్ని స్థాయిల్లో మూడోవంతు మహిళలుండాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమి టీల్లోనూ ‘త్రీ ఎమ్ ఫార్ములా’కు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రాధ్యక్ష నియామకపు చిక్కుముడి వీడితే ఈ అన్నీ ఓ కొలిక్కివస్తాయి.అంచనాల స్థాయిలో బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజు కోవట్లేదని భావిస్తున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్నాయి. నిజంగానే ప్రజలు ఆ దిశలో ఆలోచించినా... ఆ పరిస్థితిని సానుకూలంగా మలచుకునే స్థితిలో పార్టీ లేదని బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ‘త్రీ ఎమ్ ఫార్ములా’లో భాగమైన మాదిగలను ఆకట్టుకో వడానికి గత ఎన్నికల్లోనే మంద కృష్ణ మాది గను అక్కున చేర్చుకొని ప్రధాని మోదీ ఎస్సీ వర్గీక రణకు సానుకూలత ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, సదరు బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో ఆ మేర చట్టం తీసుకురావడం జరిగిపోయాయి.పార్టీని గెలిపిస్తే బీసీని సీఎంగా చేస్తామని ఎన్ని కల ప్రకటన చేస్తూ, సరిగ్గా ఎన్నికల ముందు బీసీ రాష్ట్రాధ్యక్షుడిని కారణం చెప్పకుండా అధిష్ఠానం పక్కకు తప్పించడాన్ని ఇప్పటికీ తప్పుబట్టేవారు పార్టీలో ఉన్నారు. అదే సమయంలో, నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీని నివారించి బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి, ఏడాది తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ముఖాముఖి తలపడి ఆధిక్యత తీసుకోవడం పార్టీ వ్యూహమని,అందుకే అలా చేశారని చెప్పేవాళ్లూ ఉన్నారు. వ్యూహాలు ఎత్తుగడల సంగతెలా ఉన్నా... ఢిల్లీ నాయ కత్వం స్థాయిలో రాష్ట్ర పార్టీ పని చేయటం లేదనే భావన బలంగా ఉంది. పార్లమెంటు కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం పెట్టి ప్రధాని మోదీ మందలించిన తర్వాత రాష్ట్ర ఇంచార్జీ బన్సల్ మందలించింది కూడా అందుకే! ‘గోడమీద రాతల నుంచి చిన్న పోస్టర్ అతికించడం వరకు... అన్నీ డబ్బుమయం అయిపోయాయి తప్ప తెలంగాణలో ఆశించన ఫలితాలు రావట్లేద’ని ఆయన మండిపడటం వెనుక ఎంత నిజముందో పార్టీ రాష్ట్ర నాయకత్వం బేరీజు వేసుకోవాలి.-దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
పొలిటికల్ రీఎంట్రీపై యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. దీంతో విపక్షాల తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పొలిటికల్ రీఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజాసేవలో ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపైనా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు సిన్హా. ‘నేను స్వతంత్రంగానే ఉంటాను. ఏ ఇతర పార్టీలో చేరను. నాతో ఎవరూ మాట్లాడలేదు. నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే.. వ్యక్తిగత కారణాలతో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఓ నేతతో మాట్లాడాను. ప్రజా సేవలో ఏ పాత్ర పోషించాలనేది తేల్చాల్సి ఉంది. ఇప్పుడు నాకు 84 ఏళ్లు. దాని వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. నేను ఎన్నిరోజులు ప్రజా జీవితంలో కొనసాగుతోనో చూడాలి.’ అని పేర్కొన్నారు యశ్వంత్ సిన్హా. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం 2021, మార్చిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటే చేసే క్రమంలో టీఎంసీకి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: Draupadi Murmu: ద్రౌపది ముర్ముకు యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు -
వైఎస్ఆర్ సీపీ మద్దతు కోరనున్న ద్రౌపది ముర్ము
-
రాష్ట్రపతి ఎన్నికలు: మరి ఆయన మద్దతు ఎవరికో?
న్యూఢిల్లీ: మొత్తానికి రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో.. అధికార, విపక్షాలు ఒక కొలిక్కి వచ్చాయి. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, సుమారు 22 పార్టీల మద్ధతుతో ప్రతిపక్షాల సంయుక్త అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్లు వేయనున్నారు. అయితే.. కుటుంబమా? లేదంటే రాజకీయమా? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా నడుస్తోంది. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా తండ్రి యశ్వంత్ సిన్హా.. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల బరిలో, అదీ ప్రత్యర్థి వర్గం నుంచి ఉన్నారు. అదే సమయంలో పార్టీ బలపరుస్తున్న ద్రౌపది ముర్ముకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు. పేద, వెనుకబడిన వర్గాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు. అందుకోసమే ఆమెకు ఈ గౌరవం దక్కింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు.’’ అలాగే.. ఎన్నికల బరిలో నా తండ్రి(యశ్వంత్ సిన్హా) కూడా ఉన్నారు. అలాగని.. ఈ వ్యవహారాన్ని కుటుంబ వ్యవహారంగా చూడొద్దని కోరుతున్నారు ఆయన. ఒక బీజేపీ కార్యకర్తగా, పార్లమెంటేరియన్గా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటా అని తెలిపారాయన. -
రాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాల తీరుపై శివసేన అసహనం
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ తరుణంలో శివసేన పార్టీ.. విపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికలను ఇకనైనా సీరియస్గా తీసుకోవాలంటూ సూచించింది. బలమైన రాష్ట్రపతినే ఎంపిక చేయడంలో తడబడితే.. రాబోయే రోజుల్లో ప్రధానికి సమర్థవంతమైన అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారంటూ విపక్షాలకు శివసేన సూటి ప్రశ్న సంధించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. పవార్ కాకపోతే.. ఇంకెవరు?. అభ్యర్థి విషయంలో కనీసం ఆరు నెలల ముందు నుంచైనా మంతనాలు జరపాల్సింది. ఇప్పుడు చర్చించడం వల్ల ఈ ఎన్నికలను తేలికగా తీసుకున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపించినట్లయ్యింది. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఇంత చర్చలు జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని అభ్యర్థిగా.. అది సమర్థుడిని ఎలా నిలబెడతారు? అని ప్రజలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. గోపాకృష్ణగాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా.. ఇలా రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎప్పటిలా వినిపించే పేర్లే ఈసారి వినిపిస్తున్నాయి. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరూ కనిపించడం లేదా అని విపక్షాలను పశ్నించింది శివసేన. అదే సమయంలో బలమైన అభ్యర్థి కోసం కేంద్రం కూడా పెద్దగా ఆలోచన చేయడం లేదని అనిపిస్తోంది. ఐదేళ్ల కిందట.. రామ్నాథ్ కోవింద్ పేరును ఇద్దరు ముగ్గురు మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఈసారి కూడా అలాగే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని విపక్షాలకు సూచించింది శివసేన. -
కౌన్ బనేగా రాష్ట్రపతి
-
కేసీఆర్ నీకు దండం పెడతా: సర్వే
హైదరాబాద్: సోనియా గాంధీకి దళితులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలంటే ప్రేమ అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. మీరా కుమారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఆనందకరం.. ఆమెకు అన్ని అర్హతలు, సమర్ధత, అనుభవాలు ఉన్నాయన్నారు. ఎన్డీఏ అభ్యర్థి కోవింద్ కన్నా మీరాకుమార్ గొప్ప అభ్యర్ధని తెలిపారు. ఇందిరా హయాంలో వీవీ గిరి గెలిచినట్టుగా.. మీరా కుమార్ గెలిచే అవకాశం ఉందని.. యూపీఏ కూటమిలో ఉన్న నితీష్ సొంత నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ అంశంపై నితీష్ పునరాలోచించుకోవాలన్నారు. కేసీఆర్ మోదీ మాయలో పడ్డారని.. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ.. మీరా కుమార్ స్పీకర్గా ఉన్నప్పుడే తెలంగాణ బిల్పాస్ అయింది. కేసీఆర్కు దండం పెట్టి అడుగుతున్నా యూపీఏ అభ్యర్థికే మద్దతివ్వాలన్నారు. కేసీఆర్ కాబినెట్ లో దళితుడు లేడు, మహిళ లేదు. రాష్ట్రం వస్తే దళితుడిని సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్పై ఇప్పటికే దళిత వ్యతిరేకని అనే ముద్ర పడిందన్నారు. యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఆర్ఎస్ఎస్ నామినేట్ చేసిన వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. -
రామ్నాథ్కే దినకరన్ మద్దతు
చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే ఓటు వేయాలని అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వర్గం నిర్ణయించింది. అన్నా డీఎంకేలో రెండు చీలిక వర్గాలైన సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్సెల్వం వర్గాలు రామ్నాథ్ కోవింద్కే తమ మద్దతను ఇప్పటికే ప్రకటించాయి. వారిద్దరితో విభేదించే దినకరన్ ఆలోచనలో పడ్డారు. అంతేగాక ఓటు కోసం బీజేపీ నుంచి తనను ఎవరైనా కలుస్తారేమోనని ఎదురుచూసి నిరాశ చెంది చివరకు తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లనే అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు ఎన్డీఏ అభ్యర్థివైపు నిలిచాయని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించారు. -
దళితులను మోసం చేస్తూ ఎన్డీయేకు మద్దతా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి దళితుడని మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పడం పచ్చి వంచన అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. ఏఐసీసీ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్తో కలిసి గాంధీభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని ఆ పదవిలో కూర్చున్న కేసీఆర్ వారికి ఇస్తానన్న మూడెకరాల భూమిని కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, విద్యార్థులకు ఫీజును రీయింబర్స్ బకాయిలు చెల్లించకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ను గెలిపించడానికి డిల్లీకి వెళ్లిన కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్న తర్వాతనే హైదరాబాద్కు తిరిగిరావాలని డిమాండ్ చేశారు. మతతత్వ రిజర్వేషన్లను వ్యతిరేకించిన బీజేపీ అభ్యర్థికి ఆయన ఎలా మద్దతును ఇస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. -
కొత్త ‘రాష్ట్రపతి’ గతంలో రెండుసార్లు ఓడారు
న్యూఢిల్లీ: ఎవ్వరూ ఊహించని విధంగా బిహార్ గవర్నర్, దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఎన్డీయే అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. మత విషయాలకంటే తమ జాతి ప్రయోజనాలకోసం, బడుగు వర్గాల సాధికారతకోసమే పనిచేశారు. ఓసారి కేంద్రం ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక చట్టం తెచ్చినప్పుడు ఉద్యమంలో గట్టిగానే పాల్గొన్నారు. ప్రచార ఆర్భాటమూ తక్కువ. సౌమ్యమనస్తత్వం కలిగి ఉండటంతోపాటు పార్టీ అధిష్టానంతో కూడా ఆయనకు మంచి పేరుంది. ఈయన కేంద్ర హోమంత్రి రాజ్నాథ్సింగ్కు సన్నిహితుడు కూడా. అయితే, కోవింద్ గతంలో రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. తమ పార్టీలో చేరిన రామ్నాథ్ను తొలిసారి బీజేపీ 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఘాటంపూర్ నుంచి పోటీచేసి కోవింద్ తొలిసారి ఓడిపోయారు. తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 12 ఏళ్లు ఎంపీగా పనిచేసి మరుసటి ఏడాది 2007లో తన సొంత జిల్లాలోని భోగినీపూర్ స్థానం నుంచి యూపీ అసెంబ్లీకి పోటీచేసినా ఓటమిని చవిచూశారు. అయితే, ఆయనకు ఉన్న సంస్థ నిర్వహణా, పరిపాలన నైపుణ్యాలను గమనించిన పార్టీ మాత్రం ఆయనను పక్కన పెట్టలేదు. దీంతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనను బిహార్ గవర్నర్గా నియమించింది. దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల్లో గవర్నర్లకు ముఖ్యమంత్రులకు విభేదాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు రామ్నాథ్కు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు మధ్య ఒక్క విభేదంగానీ, వాదులాట, వివాదంగానీ తలెత్తలేదంటే ఆయన పరిపాలన నైపుణ్యాలేమిటో అంచనావేసుకోవచ్చు. -
రాష్ట్రపతి ఎన్నికల బరిపై బీజేపీ 'రామ'బాణం
దళిత నేత రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసి ప్రతిపక్షాలకు సవాల్ - బిహార్ గవర్నర్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అనూహ్య నిర్ణయం - ఏకగ్రీవం కోసం సోనియా, మన్మోహన్లతో మాట్లాడిన మోదీ - ప్రాంతీయ పార్టీల అధినేతలకూ ఫోన్లు.. మద్దతు ప్రకటిస్తున్న ప్రాంతీయ పార్టీలు - బీజేపీ నిర్ణయం ఏక పక్షమని కాంగ్రెస్ విమర్శ న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠ. ప్రచారంలో ఉన్న జాబితాలో హేమా హేమీలున్నారు. వీరిలో ఒకరిని అదృష్టం వరిస్తుంది. కానీ ఎవరా వ్యక్తి అనేదానిపై సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతున్నంతసేపూ ఎడతెగని ఉత్సుకత నెలకొంది. అనూహ్య నిర్ణయాలతో ప్రత్యర్థుల ఊహకందకుండా వ్యవహరించటంలో దిట్టలైన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు మరోసారి యావద్భారతాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పెరుగుతున్న ఉత్కంఠకు సోమవారం తెరదించుతూ.. బిహార్ గవర్నర్, దళితనేత రామ్నాథ్ కోవింద్ (71) పేరును ప్రకటించారు. చివరి వరకూ పలువురు ప్రముఖుల పేర్లతో ప్రచారం.. విదేశాంగశాఖ కార్యాలయం ముందు సుష్మ కోసం మీడియా పడిగాపులు.. మరెన్నో ఊహాగానాలు తప్పని నిరూపించారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం రామ్నాథ్ పేరును అమిత్ షా అధికారికంగా వెల్లడించారు. ఎన్డీయే అభ్యర్థి గెలిచేందుకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ఆరెస్సెస్తో బలమైన సంబంధాలు ఉండటంతో పాటు దళిత నేత అయిన కోవింద్ పేరును ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరారు. రంగంలోకి మోదీ, అమిత్ షా దీంతో రెండోసారి దళితుడు రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించేందుకు.. కాంగ్రెస్ సహా విపక్ష, ఎన్డీయే పక్ష నేతలతో మోదీ, అమిత్ షా, బీజేపీ కీలక నేతలు మాట్లాడి అవసరైన మద్దతుకు కూడగడుతున్నారు. అనూహ్య నిర్ణయంతో అంతటా విస్మయం నెలకొని ఉండగానే.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి కోవింద్ అభ్యర్థిత్వాన్ని తెలిపి మోదీ మద్దతు కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తదితర నేతలతో మోదీ, షాలు ఫోన్లో మాట్లాడారు. ఏఐఏడీఎంకే, బీఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలతోనూ బీజేపీ కీలక నేతలు చర్చలు జరిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలనేతలోనూ చర్చలు జరుగుతున్నాయి. శివసేన మాత్రం ఇంతవరకు తన స్పందన వెల్లడించలేదు. ఏకాభిప్రాయంపై షా ఆశాభావం దళిత సమస్యలపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకే కేంద్రం అనూహ్యంగా కోవింద్ పేరును తెరపైకి తెచ్చింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ దళితనేత రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా రాజ్యాంగంపైనా అవగాహన ఉంది. ‘రామ్నాథ్ కోవింద్ పేద దళిత కుటుంబంలో పుట్టారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారు. పేదలు, దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారు. అందుకే కోవింద్ ఎంపికపై ఏకాభిప్రాయం వస్తుందని భావిస్తున్నాం’అని విలేకరుల సమావేశంలో అమిత్ షా తెలిపారు. పలువురు సభ్యులతో రూపొందించిన జాబితాను పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించారని.. అనంతరం కోవింద్ పేరును ఎంపికచేశామన్నారు. అయితే జాబితాలోని ఇతర సభ్యుల పేర్లను మాత్రం షా వెల్లడించలేదు. విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రధాని మోదీయే నేరుగా రంగంలోకి దిగారన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లతో మోదీ మాట్లాడినట్లు అమిత్ షా తెలిపారు. పలువురు బీజేపీ కీలక నేతలు కూడా ఎన్డీయే కూటమి పార్టీలతోపాటుగా ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ఆయా పార్టీల అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. జూన్ 23న రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కోవింద్ సరైన వ్యక్తి!: మోదీ రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి పదవికి సరైన అభ్యర్థి అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘పేదలు, అణగారిన వర్గాల తరఫున బలమైన గొంతుకను వినిపిస్తున్న కోవింద్ అత్యున్నత రాజ్యాంగ పదవిలోనూ.. తన వాణిని కొనసాగిస్తారు. ఆయన రాష్ట్రపతి పదవికి సరైన అభ్యర్థి’అని మోదీ ట్విటర్ ద్వారా ప్రశంసించారు. కోవింద్కు న్యాయరంగంలో అపారమైన అనుభవం, రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానం దేశానికి చాలా ఉపయోగకరమన్నారు. ‘ప్రజాసేవ, పేదలు, బడుగు బలహీన వర్గాలకు తన జీవితాన్ని అకితం చేశారు’అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఏకగ్రీవం అవకాశం లేదు: కాంగ్రెస్ రాష్ట్రపతి ఎన్నిక ఈసారి ఏకగ్రీవమయ్యే అవకాశమే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తమతో సంప్రదించకుండానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించిందనందున ఏకగ్రీవానికి సహకరించాలన్న వారి వినతిని తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. జూన్ 22న (గురువారం) జరిగే విపక్షాల సమావేశంలో ఎన్నికల బరిలో ఉండే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. ‘బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. రామ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంపై ప్రస్తుతానికి స్పందించం. జూన్ 22 నాటి సమావేశంలో విపక్షాలన్నీ చర్చించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటాయి’అని ఆజాద్ తెలిపారు. వెంకయ్య, రాజ్నాథ్లు సోనియాను కలిసిన సమయంలోనూ ఎవరిపేరూ చర్చించలేదన్నారు. బీజేపీ నిర్ణయం ఏకపక్షమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఫోన్లో కోవింద్ అభ్యర్థిత్వాన్ని తెలిపారన్నారు. జూన్ 22న విపక్ష పార్టీల సమావేశంలో చర్చించాక నిర్ణయం చెబుతామన్నారు. రామ్నాథ్ను ఎంపిక చేయటం ద్వారా ప్రధాని మోదీ రాజకీయ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని.. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు. దళితుల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుని ఏమీ చేయని పార్టీలకు ఇదో చెంపపెట్టులాంటి చారిత్రక నిర్ణయమన్నారు. బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థికి తమ పూర్తి మద్దతుంటుందన్నారు. విపక్ష పార్టీలు కూడా కోవింద్కు మద్దతివ్వాలని.. లేదని బరిలో దిగాలని నిర్ణయిస్తే వారిని దళిత వ్యతిరేకులుగా చూడాల్సి ఉంటుందన్నారు. దళిత అభ్యర్థికే మా మద్దతు: బీఎస్పీ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా యూపీకి చెందిన దళితనేత రామ్నాథ్ కోవింద్ పేరును తాము వ్యతిరేకించదలచుకోలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. రాజకీయేతర దళిత నాయకుడిని బరిలో దించుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. దళిత అభ్యర్థికే తమ మద్దతుంటుందంటూనే.. కోవింద్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు. విపక్షాలు కూడా దళిత అభ్యర్థి పేరును ప్రకటించకపోతే కోవింద్కే తమ మద్దతుంటుందని సంకేతాలిచ్చారు. 2012 ఎన్నికల్లో మాయావతికి వ్యతిరేకంగా బీజేపీ తరపున రామ్నాథ్ ప్రచారం చేయటం గమనార్హం. ఇంకా చాలా మంది ఉన్నారుగా: మమత గతంలో బీజేపీ దళితమోర్చా నాయకుడిగా పనిచేసినందుకే.. బిహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను బీజేపీ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిందని తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెననర్జీ విమర్శించారు. ‘దేశంలో చాలా మంది దళితనేతలున్నారు. కానీ బీజేపీ దళిత మోర్చాకు నాయకుడిగా పనిచేసినందుకే కోవింద్ పేరును ప్రకటించారు. రాష్ట్రపతి పదవి అత్యున్నత రాజ్యాంగ స్థానం. ప్రణబ్ ముఖర్జీ వంటి స్థాయి వ్యక్తి ఆ స్థానంలో ఉండాలి. సుష్మా స్వరాజ్, ఎల్కే అడ్వాణీల్లో ఒకరిని ప్రకటించి ఉంటే బాగుండేది. ఓ వ్యక్తికి మద్దతివ్వాలంటే ఆయన గురించి మనకు తెలిసుండాలి. ఆ వ్యక్తి దేశానికి ఉపయోగపడేలా ఉండాలి. 22నాటి విపక్ష సమావేశంలో మా నిర్ణయం ప్రకటిస్తాం’అని మమత బెనర్జీ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా మద్దతివ్వండి: యోగి విపక్ష పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా దళితనేత రామ్నాథ్ కోవింద్కు రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతివ్వాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం దళిత సమాజానికి ఇచ్చిన అరుదైన గౌరవమన్నారు. ‘ఓ దళిత నాయకుడిని అత్యున్నత రాజ్యాంగ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించటం నయా సామాజిక జాగరూకతకు నిదర్శనం. ఇందుకోసం ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్షాకు రాష్ట్రప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 22 కోట్లమంది రాష్ట్ర ప్రజలకు ఇది గర్వకారణం’అని యోగి పేర్కొన్నారు. యూపీ ముద్దుబిడ్డను రాష్ట్రపతిని చేయటంలో పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలు సహకరించాలని కోరారు. ఉత్సుకత.. ఆ వెంటనే ఆశ్చర్యం! సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం అభ్యర్థి పేరును ప్రకటించేందుకు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. అప్పటికే పలువురి పేర్లతో భారీ ప్రచారం జరగటంతో ఈ జాబితాలోని వారిలో ఒకరుండొచ్చని అందరూ భావించారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచీ ఉత్కంఠ అంతకంతకూ పెరిగింది. అయితే.. అమిత్షా దీన్ని మరింతగా పెంచారు. అభ్యర్థి పేరును ప్రకటించే ముందు కొన్ని క్షణాలు ఆగారు. లైవ్లో చానెళ్లు, వీటిని చూస్తూ దేశవ్యాప్తంగా కోట్ల మందిలో మరింత ఉత్సుకత పెరిగింది. ఈ సమయంలో రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించటంతో ఉత్సుకత పోయి అయోమయం నెలకొంది. ఊహించని పేర్లేమీ లేకపోవటమే కాదు.. పెద్దగా సుపరిచితుడేమీ కాని రామ్నాథ్ కోవింద్ పేరు ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కోవింద్ వివరాలు తెలుసుకునేందుకు మీడియా సంస్థలతో సహా అందరూ గూగుల్ను ఆశ్రయించాల్సి వచ్చింది. అన్ని పార్టీల మద్దతు కోరతా: కోవింద్ రాష్ట్రపతి పదవి కోసం అందరికీ సమ్మతమైన అభ్యర్థిగా ముందుకొచ్చేందుకు అన్ని ప్రధాన పార్టీల నేతలను కలసి మద్దతు కోరతానని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థిగా తన పేరును ప్రకటించాక సాయంత్రం ఆయన పట్నా నుంచి ఢిల్లీ చేరుకుని మొదట బీజేపీ చీఫ్ అమిత్ షాతో, తర్వాత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమిత్ షా నివాసంలో గంటసేపు ఉన్న కోవింద్ను పార్టీ నేతలు అభినందించారు. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ గురించి షా, కోవింద్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద బాధ్యత అందుకున్న చిన్న పౌరుడినని కోవింద్ అన్నారు. ‘ఎలక్టోరల్ కాలేజీ సభ్యులందర్నీ.. ప్రధాన పార్టీల నేతలందర్నీ కలుసుకుని మద్దతు కోరతాను.. ప్రతి పౌరుడు నాకు మద్దతిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. తర్వాత ఆయన బిహార్ నివాస్కు వెళ్లారు. కోవింద్ ఈ నెల 23న నామినేషన్ వేసే అవకాశముంది. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవిని అధిష్టించిన రెండో దళితుడు అవుతారు. కాంగ్రెస్ రాష్ట్రపతి ఎన్నిక ఈసారి ఏకగ్రీవమయ్యే అవకాశమే లేదని, అభ్యర్థి ఎంపికపై బీజేపీ తమను సంప్రదించలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తృణమూల్ గతంలో బీజేపీ దళిత మోర్చా నాయకుడిగా పని చేసినందుకే.. రామ్నాథ్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. బీఎస్పీ దళితుడైన రామ్నాథ్ పేరును తాము వ్యతిరేకించదలచుకోలేదని బీఎస్పీ పేర్కొంది. వైఎస్సార్సీపీ దళిత సామాజిక వర్గానికి చెందిన కోవింద్ అభ్యర్థిత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. టీడీపీ.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్కు టీడీపీ మద్దతు ఇచ్చింది. సుదీర్ఘ చర్చల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. టీఆర్ఎస్.. ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు టీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటించింది. -
‘గుజరాత్ అల్లుడ్ని కాదా? రాష్ట్రపతిగా ఆమె బెస్ట్’
న్యూఢిల్లీ: ఈ మధ్య ఆకట్టుకునేలా ట్వీట్లు చేస్తూ కాస్తంత వివాదాలను కూడా మూటగట్టుకుంటున్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ జరగగా తాజాగా రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్నందున మరోసారి ఆ ఎన్నికల చుట్టూ ఆసక్తికరమైన ప్రకటనలు వస్తున్నాయి. తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాష్ట్రపతి అభ్యర్థికి తగినవారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆమె గుజరాతీ అయితే మాత్రం ఏంటని ప్రశ్నించారు. తాను మాత్రం గుజరాత్ అల్లుడిని కాదా అంటూ ఓ ట్వీట్ ట్వీటారు. అంతకుముందే శివసేన పార్టీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రెసిడెంట్ రేసులో లేనందున తాము ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు రాష్ట్రపతిగా మద్దతిస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జేడీయూ నితీశ్ కుమార్ను రాష్ట్రపతి అభ్యర్థిగా తగినవారంటూ పేర్కొంది. One of the best candidate for President is fmr Gujarat CM Anandibehn Patel. So what if she is Gujarati? I too am Gujarat's son in law. — Subramanian Swamy (@Swamy39) 25 April 2017 -
భగవత్ లేరుగా.. పవారే రాష్ట్రపతిగా..!
ముంబయి: నిత్యం ఏదో ఒక ఇరుకున పెట్టే బీజేపీ భాగస్వామ్య పార్టీ శివసేన అనూహ్య ప్రతిపాదన చేసింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలంటూ తాజాగా తెరమీదకు తెచ్చింది. తాము పవార్కు మద్దతు ఇస్తున్నామని, తమ భాగస్వామి అయిన బీజేపీ కూడా ఆయనకు మద్దతివ్వాలని కోరింది. శివసేన పార్టీ నేత సంజయ్ రావత్ దీనిపై మాట్లాడుతూ రాష్ట్రపతి పదవిని అలంకరించడానికి పవార్ తగిన వ్యక్తి అని, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, జేడీయూ తదితర పార్టీలు కూడా పవార్కు పరోక్షంగా మద్దతిస్తున్నాయని కూడా పేర్కొన్నారు. ప్రజా మద్దతు ఎక్కువగా ఉన్న తదుపరి నేత పవార్ మాత్రమేనని ఆయనకు మద్దతివ్వాలని వారంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రకటించనున్న రాష్ట్రపతి అభ్యర్థికి సవాలుగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో తమ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే పలు చర్చల్లో పాల్గొన్నప్పుడు పవార్కే చాలామంది మద్దతిచ్చారని, అలాగే, దేశంలో కూడా ప్రజా మద్దతు ఉన్న నాయకుడు పవార్ అని అన్నారు. అయితే, తొలి ప్రాధాన్యం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కేనని, తాను రేసులో లేనని ప్రకటించినందున తమ తదుపరి ప్రాధాన్యం పవార్కే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, దీనిపై ఇంకా పవార్, ఎన్సీపీ స్పందించాల్సి ఉంది.