ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి
కాకినాడ: ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుకుదురులో ఈ విషాద ఘటన జరిగింది. పలువురు విద్యార్థులు ఈత కొట్టేందుకు కెఎంజి కాలువ వద్దకు వెళ్లారు.
విద్యార్థులు అందరూ ఈతకొట్టేందుకు కాలువలో దిగారు. వారిలో ముగ్గురు నీటిలో మునిగిపోయి దుర్మరణం చెందారు. ఆరుగురు విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతులు కాకినాడ జైరామారావుపేటకు చెందినవారిగా గుర్తించారు.