విద్యుద్ఘాతంతో ఆటో డ్రైవర్ మృతి
గుంటూరు(తెనాలి): మండలంలోని ఐత్నగర్లో విద్యుద్ఘాతంతో వెంకయ్య(38) అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు..ఐత్నగర్లోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద అనాథ శవం పడి ఉంది. ఆ శవాన్ని మున్సిపాలిటీ అధికారులకు అప్పగించడానికి వచ్చిన వెంకయ్య తల ప్రమాదవశాత్తూ టాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ప్యూజ్కు తగిలింది. పక్కనే ఉన్న స్ధానికులు కర్రతో కొట్టడంతో షాక్ నుంచి బయటపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న వెంకయ్యను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. చేర్చిన పావుగంటకి ప్రాణాలొదిలాడు.