breaking news
no gambling
-
పేకాట సిగ్గుమాలిన పని కాదు
న్యూఢిల్లీ: పేకాట ఆడటం సిగ్గుమాలిన పని కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జూదం, గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితే మాత్రం నేరమని స్పష్టంచేసింది. ఎలాంటి గ్యాంబ్లింగ్, బెట్టింగ్తో సంబంధం లేకుండా, ఎలాంటి మోసంతో ప్రమేయం లేకుండా కేవలం వ్యక్తిగతంగా, సొంత వాళ్లతో సరదాగా ఆడితే తప్పుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్డు పక్కన ఆటవిడుపుగా పేకాట ఆడాడన్న కారణంతో కర్ణాటకలో ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డ్లో డైరెక్టర్ సభ్యత్వానికి దూరం చేయడం సబబుకాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కర్ణాటకలో గవర్నమెంట్ పోర్సలిన్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ హౌసింగ్ కో–ఆపరేటివ్ సొసైటీలో వైసీ హనుమంతరాయప్ప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు గెలిచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యత్వం సాధించారు. అయితే రోడ్డుపక్కన పేకాట ఆడారన్న కారణంగా ఆయనపై రూ.200 జరిమానా వేసి, సభ్యత్వాన్ని రద్దుచేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టగా మే 14వ తేదీన ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హౌసింగ్ సొసైటీలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ తీర్పు వెలువర్చింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ పేకాట అనేది నైతికంగా తప్పు కాదు. బెట్టింగ్, జూదం, గ్యాంబ్లింగ్లో భాగంగా ఆడితేనే నేరం. సరదాకి సొంత వాళ్లతో ఆడితే దానిని నేరంగా భావించొద్దు. ఈ కేసులో నిందితుడు హనుమంతరాయప్ప పేకాటకు బానిస కాదు. గ్యాంబ్లింగ్ చేయలేదు. కేవ లం విరామం, విశ్రాంతి వేళ మానసిక ప్రశాంతత కోసం పేకాట ఆడారు. 2020 ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి డైరెక్టర్ల మండలిలో స్థానం సంపాదించిన ఈయనను పేకాట ఆడాడన్న ఒకే ఒక్క కారణం చూపి శిక్షించడం సహేతుకం అనిపించుకోదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
అందాల కోళ్లు.. అదృష్ట దేవతలు
♦ వీటి పెంపకం హోదాకు చిహ్నం.. ♦ చూస్తే చాలనే స్థాయి వీటి సొంతం.. ♦ ఈ చరణాయుధాల కథే వేరు.. కోడి.. ఈ మాట వింటే (శాకాహారులను మినహాయిస్తే) నోరూరనిదెవ్వరికి? పండగల్లోనో, మరే పవిత్రమైన రోజుల్లోనో తప్పితే అమాంతం చప్పరించేయాలన్న ఆరాటం కలగనిదెవ్వరికి? కానీ మన మధ్యనే ఉన్న కొందరు మాత్రం ఈ ప్రత్యేకమైన కోళ్లు చూడడం అబ్బురంగా భావిస్తారు! ఈ ప్రాంతంలో పెద్దగా లభించని పొట్టి ముక్కు, పొడుగు తోక రకం కోళ్లను పెంచడమే ఓ స్టేటస్ సింబల్గా భావిస్తారు! వీటి ఖరీదులు వేలలో ఉన్నా మురిపెంగా కొనుక్కుంటారు. కొందరు వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఇంతా చేసి వీటిని పోటీలకు పంపరు.. కూరగా చేయరు! జస్ట్.. స్టేటస్ సింబల్గా ఇంటి ముందు పెరిగే ఈ కోళ్ల కథా కమామిషు ఇదీ.. మామూలుగా కోడి అంటే ఆహారంగానో, పండగ వేళ వినోదంగానో భావించే మనకు కొందరు కోళ్లకు హోదాకు చిహ్నంగా పెంచుతారంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కొన్నిదేశాలలో ఇంటి ముందు ఇటువంటి కోళ్లు పెరగడాన్ని స్టేటస్ సింబస్గా భావిస్తారు. చరణాలే( కాళ్లు) ఆయుధంగా పోరాటం చేస్తుంది కాబట్టి చరణాయుధంగా కూడా వ్యవహరిస్తారు.. వంపు తిరిగిన ముక్కుతో పాటు పొడుగాటి తోక ఉండే ఈ కోళ్లను ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. ఇంటి ముందు కట్టిఉంచిన కుక్కుటాన్ని ఆగిచూసి వెళ్లడం వీటిని గౌరవించడంగా భావిస్తారు. వీటిని పందేలకు పంపరు. ఆహారానికి చంపరు. మనసు కలతలకు దూరం కావడానికి సాధనంగా పరిగణిస్తారు. ఇక్కడివి కావు.. పొట్టి ముక్కు, పొడుగాటి తోక అందాలను బట్టి వీటి ధరలు కూడా అదురుతుంటాయి. తమిళనాడుకు చెందిన సేలం, దిండిగల్ పట్టణాలలో ఎంపికచేసిన వీటిని ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. దేశంలో వివిధ ప్రాంతాలకు రవాణా అవుతాయి. అక్కడ నుంచి విదేశాలకు కూడా వీటిని పంపిస్తారు. భీమిలి డివిజన్లోని ఈ మండలానికి చెందిన అమనాం పంచాయతీ, పద్మనాభం మండలంలోని రేవిడి పంచాయతీలో ఔత్సాహికులు వీటిని కొనుగోలుచేసి పునరుత్పత్తి అనంతరం విక్రయిస్తుంటారు. వీటిలో పుంజు రకాలలో పొడుగాటి తెల్లతోక కలిగిన రసంగి రకం రెండేళ్ల పక్షి రూ. 40 వేలకు, మూడేళ్లు వయసు కలిగిన నల్ల సవల రూ. 30 వేలకు, తొమ్మిది మాసాల వయసు గల డేగ రకానికి చెందిన పక్షి రూ.40 వేలకు అమ్ముడుపోతుంటాయి. వీటి తోకలు రెండుమీటర్ల వరకు ఉంటాయి. ఇలాంటి పక్షుల ధరలు తోక పొడవు బట్టి అత్యధికంగా రూ.80వేల నుంచి లక్ష వరకు పలుకుతుంటాయి. వంపు తిరిగిన ముక్కుల్లాంటి పెట్టలు కూడా ఒక్కొక్కటి రూ.8 వేల వరకు అమ్ముడుపోతున్నాయి. వీటిలో నల్ల కక్కెర, డేగపెట్ట, నల్ల సవల పెట్ట, రసంగి పెట్ట, కగర పెట్ట, తెల్ల సవల, ఎర్ర కక్కెర వంటి రకాలకు మంచి గిరాకీ ఉంటుంది. జూదానికి దూరం మామూలుగా సంక్రాంతి, దసరా వంటి పండగల కోసమే కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి పెంచేవారున్న గ్రామాలలో కూడా వీటిని ప్రత్యేకశ్రద్ధతో పెంచుతున్నారు. కానీ వీటిని పొరపాటున కూడా పందాలకు దించరు. అంతేకాకుండా కొన్ని పుంజులను పునరుత్పత్తికి కూడా వినియోగించరు. దీనివలన తోక ఈకలు ఊడిపోయి వీటి అందం తగ్గుతుందని అంటారు. పెట్టలను మాత్రం గుడ్లుపెట్టిన తరువాత పొదిగించి విక్రయిస్తుంటారు. ఇంత ఖరీదైన కోళ్లను ఆహారంగా తీసుకోవడానికి పెంపకందారులకు మనసొప్పదు. కొన్నిప్రాంతాలలో పండగ సమయాలలో వీటికి అందాల పోటీలు నిర్వహించడం విశేషం.