breaking news
Nits College
-
గురువు కరువు!
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధించేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఈఆర్లు, సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు వివిధ రకాల ఉన్నత విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం... ఈ విద్యాసంస్థల్లో మొత్తం 18,940 టీచింగ్ పోస్టులు మంజూరు కాగా, 28.56 శాతం ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలలో 2,540 ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా, 56.18% ఖాళీగా ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది.బడ్జెట్లో 90శాతం జీతాలకే..⇒ జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థలతోపాటు సెంట్రల్ యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండటం అధ్యాపక–విద్యార్థి నిష్పత్తిని ప్రభావితం చేస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ఇది బోధన నాణ్యతను దెబ్బతీస్తోందని హెచ్చరించింది.⇒ కాంట్రాక్టు ఉద్యోగాలను దశలవారీగా తొలగించి, అర్హత కలిగిన అధ్యాపకులను శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలను ఇచ్చేలా విద్యా మంత్రిత్వశాఖ నిర్మాణాత్మక ప్రణాళికను రూపొందించాలని సూచించింది.⇒ విద్యార్థుల నమోదు నిష్పత్తికి తగ్గట్టుగా బోధన సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది.⇒ ముఖ్యంగా ఉన్నత విద్యకు కేటాయించిన బడ్జెట్లో 90శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతుండటంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకునేందుకు శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతులను అవలంబించడంతో వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరించింది. విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారని ప్రశ్నించింది.⇒ శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమించాలని సూచించింది. మెరిట్ ఆధారంగా, పారదర్శకంగా అధ్యాపక నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం నియామక ప్రక్రియలో ఆన్లైన్ దరఖాస్తులు, స్క్రీనింగ్, సమాచార మార్పిడి కోసం సాంకేతికతను పెంపొందించాలని, తద్వారా ఇతరుల జోక్యాలను తగ్గించవ్చని స్పష్టంచేసింది. -
అరుణ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
హైదరాబాద్: ప్రేమ పేరిట వంచనకు గురై, ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన నల్లగొండ జిల్లాకు చెందిన అరుణ కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాధితురాలి మృతికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో అరుణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితునిపై నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు. ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన విద్యార్థిని తలారి అరుణ ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన నిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థిని అరుణపై.. ఈనెల 17వ తేదీన నకిరేకంటి సైదులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే.