breaking news
The National Council for Teacher Education
-
టీచింగ్ ప్రాక్టీస్కే పెద్దపీట!
డీఎడ్లో ఇక నుంచి ప్రథమ సంవత్సరంలోనూ టీచింగ్ ప్రాక్టీస్ గ్రామీణ అధ్యయనం, ప్రజలతో మమేకానికి ప్రాధాన్యం రెండేళ్ల కోర్సులో టీచింగ్ {పాక్టీస్కు 550 మార్కులు ఈ ఏడాది నుంచే అమల్లోకి.. హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో టీచింగ్ ప్రాక్టీస్కు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల మేరకు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో భారీగా మార్పులు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ఈ కోర్సులో ప్రథమ సంవత్సరంలోనూ స్కూల్ ఇంటర్న్షిప్, బోధన అభ్యాసం (టీచింగ్ ప్రాక్టీస్), బోధన అభ్యసనకు సంసిద్ధత, రికార్డుల విధానాన్ని ప్రవేశపెడుతోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి ఈ అంశాలకే 800 మార్కులను కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఇందులో ఒక్క టీచింగ్ ప్రాక్టీస్కే 550 మార్కులు ఉండేలా మార్పులు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూలై నుంచి) అమల్లోకి తేనున్న ఈ మార్పులను ఇప్పటికే విద్యాశాఖ ఖరారు చేసింది. త్వరలోనే ప్రభుత్వ ఆమోదానికి పంపనుంది. ప్రస్తుతం ఉన్న విధానం.. డీఎడ్లో ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో ఐదు పేపర్లు, ద్వితీయ సంవత్సరంలో పది పేపర్ల విధానం ఉంది. అందులో ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున 1000 మార్కులు, రికార్డులకు 500 మార్కులు ఉంటాయి. ఇంటర్నల్స్కు, రికార్డులకు 500 కలిపి మొత్తంగా 2 వేల మార్కుల విధానం ఉంది. ఒక్కో సబ్జెక్టులో ఏడు పీరియడ్ల చొప్పున ఒక సబ్జెక్టులో 35 పీరియడ్ల టీచింగ్ ప్రాక్టీస్ ఉంది. ఇలా ఐదు సబ్జెక్టుల్లో మొత్తంగా 175 పీరియడ్ల టీచింగ్ ప్రాక్టీస్ విధానం ఉంది. అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు ఇవే.. ప్రథమ సంవత్సరంలో 10 సబ్జెక్టులు, ద్వితీయ సంవత్సరంలో 10 సబ్జెక్టులు ఉంటాయి. మొత్తంగా డీఎడ్లో ఇక 2,600 మార్కుల విధానం ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రాత పరీక్షలకు 1,800 మార్కులు (ఇందులో 16 సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టుకు 60 మార్కులకు రాత పరీక్ష ఉండనుండగా, ఒక్కో సబ్జెక్టులో మిగతా 40 మార్కులు ఇంటర్నల్ ్సకు ఉంటాయి. మరో నాలుగు సబ్జెక్టుల్లో ఒక్కో దానికి 30 మార్కుల చొప్పున రాత పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్టులో మిగతా 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయి) ఇవ్వనుంది. వీటికి అదనంగా స్కూల్ ఇంటర్న్షిప్, టీచింగ్ ప్రాక్టీస్, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధత, రికార్డులకు 800 మార్కులు ఉంటాయి. ప్రథమ సంవత్సరంలో... ప్రథమ సంవత్సరంలో స్కూల్ ఇంటర్న్షిప్, టీచింగ్ ప్రాక్టీస్, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధత, రికార్డులకు 350 మార్కులు ఉంటాయి. ఇందులో స్కూల్ ఇంటర్న్షిప్, టీచింగ్ ప్రాక్టీస్కు 250 మార్కులు ఇవ్వనుండగా, రికార్డులు, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతకు 100 మార్కులు కేటాయిస్తారు. టీచింగ్ ప్రాక్టీస్కు సంసిద్ధతలో భాగంగా గ్రామీణ అధ్యయనం, వివిధ సంస్థల సందర్శన, పాఠశాల అభివృద్ధి, రికార్డులకు ఒక్కో అంశానికి 25 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ద్వితీయ సంవత్సరంలో.. ద్వితీయ సంవత్సరంలో ఇంటర్నల్స్కు 450 మార్కులు ఉంటాయి. ఇందులో స్కూల్ ఇంటర్న్షిప్, టీచింగ్ప్రాక్టీస్కు 300 మార్కులు ఇవ్వనుండగా, రికార్డులు, టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతకు 150 మార్కులు ఉంటాయి. టీచింగ్ ప్రాక్టీస్ సంసిద్ధతలో భాగంగా ప్రజలతో మమేకం కావడం, విద్యాహక్కు చట్టం అమలు, చైల్డ్ స్టడీ తదితర అంశాలు ఉంటాయి. డీఎడ్లో మార్కుల విధానమిదీ.. సంవత్సరం రాత పరీక్ష ఇంటర్న్షిప్, మొత్తం టీచింగ్ ప్రాక్టీస్ ప్రథమ 900 350 1,250 ద్వితీయ 900 450 1,350 మొత్తం 1,800 800 2,600 -
ఉపాధ్యాయ విద్యపై నిఘా
నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు డీఎడ్ కాలేజీల్లో వెబ్ ఆధారిత పర్యవేక్షణ, తనిఖీలు నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు ‘సాక్షి’తో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయుల్లో నాణ్యత తగ్గుతోంది. తూతూ మంత్రం చదువులతో టీచర్ పట్టాతో స్కూళ్లలోకి అడుగుపెడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు! ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో నాణ్యత లోపించ డం, నిబంధనలు పాటించకపోవడాన్ని ప్రాథమిక విద్యాశాఖ గుర్తించింది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రైవేటు కాలేజీల్లో తరగతులు జరక్కపోయినా ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేస్తున్నారు. ప్రాక్టికల్ తరగతులు నిర్వహించకపోయినా బాగా బోధిస్తారంటూ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. దీంతో ముందు ఇక్కడి నుంచి సంస్కరించడం ప్రారంభించాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎడ్ ప్రైవేటు కాలేజీల్లో పక్కా బోధన అందించేందుకు ప్రత్యేక నిఘావంటి పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా వెబ్ ఆధారిత పర్యవేక్షణ చేపట్టనున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘సాక్షి’తో చెప్పారు. అలాగే, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఇప్పటికే 600 వరకు ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) రాశామని చెప్పారు. డీఎడ్ కాలేజీల్లో పర్యవేక్షణ ఇలా.. ప్రత్యేక వెబ్సైట్లో విద్యార్థులు, అధ్యాపకుల ఫొటోలతో వివరాలు రోజువారీ హాజరు వివరాలను ప్రతినెలా ఆ సైట్లో అప్లోడ్ చేయాలి. పాఠ్యాంశాల వివరాలను కూడా పొందుపరచాలి. అధిక ఫీజులు డిమాండ్ చేస్తే విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులు వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీలు ప్రతి నెలా కాలేజీలను తనిఖీలు చేస్తాయి. సంబంధిత కాలేజీ అనుబంధ స్కూళ్లలో ప్రాక్టికల్స్ జరిగాయా? లేదా? పరిశీలిస్తాయి. టీచర్ల హాజరు, పాఠ్యాంశాల బోధనపై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలిస్తాయి. ఈ చర్యల ద్వారా పాఠశాల విద్య నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. ఏప్రిల్లోనే ‘టెన్త్’ పాఠ్యపుస్తకాల పంపిణీ పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, పాఠశాలలకు చివరి పని దినమైన ఏప్రిల్ 23కే పదో తరగతికి వెళ్లే 12 లక్షల మంది విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తామని పూనం మాలకొండయ్య చెప్పారు. సెలవుల్లో ముందుగానే చదువుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామన్నారు. ఇతర తరగతులకు చెందిన 64 లక్షల మందికి జూన్ 12న స్కూళ్లు తెరిచే రోజున ఉచిత పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.