breaking news
Narsa rao peta
-
ప్రతీకారం
గుంటూరు రూరల్ : ప్రేమను తిరస్కరించారనే కారణంతో యువతులపై జరిగిన యాసిడ్ దాడులు చూశాం. ఇందుకు విరుద్ధంగా ఓ యువతి ప్రేమ పేరుతో తన జీవితంతో చెలగాటమాడిన అధ్యాపకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల వద్ద శనివారం జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. వివరాలు.. నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన గింజుపల్లి సుబ్బారావు మూడో కుమార్తె సౌజన్య స్థానిక పాలడుగు నాగేశ్వరరావు డిగ్రీ కళాశాలలో 2009లో డిగ్రీ చదివింది. ఆ సమయంలో అక్కడ గణిత అధ్యాపకుడిగా ఉన్న నగరం మండలం పరసాయపాలేనికి చెందిన పి.వెంకటరమణకు ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం సౌజన్య వైజాగ్లోని ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. వెంకటరమణ నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలక బదిలీ అయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహరం నడుస్తోంది. పెళ్లికి వెంకటరమణ కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఈ ఏడాది ఆగస్టులో అనూష అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ వెంకటరమణ తనకు ఎలాంటి వివాహం జరగలేదని ఎమ్మెస్సీ పూర్తి అయ్యాక వివాహం చేసుకుందామని సౌజన్యకు చెప్పాడు. దీంతో ఆమె ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. వెంకటరమణకు పెళ్లయినట్లు తెలుసుకున్న సౌజన్య ఫోన్ చేసి వెంకటరమణను నిలదీసింది. అప్పటి నుంచి ఆమె ఫోన్ నంబరు కూడా వెంకటరమణ తీసి వేశాడు. దీంతో సౌజన్య తనను మోసగించినవాడిని హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. వైజాగ్లో ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి సల్ఫూరిక్ యాసిడ్ను కొనుగోలు చేసి శనివారం మధ్యాహ్నం గుంటూరు చేరుకుంది. 1.35 గంటల సమయంలో నల్లపాడు కళాశాల వద్ద కాపు కాసింది. భోజన సమయంలో బయటకు వచ్చిన వెంకటరమణపై ముందుగానే జగ్గులో సిద్ధంగా ఉంచుకున్న యాసిడ్తో దాడి చేసింది. వెంకటరమణ శరీరంపై ఉన్న దుస్తులతో పాటు ముఖం అంతా కాలిపోయింది. దాడి సమయంలో జగ్గును వెనక్కు నెట్టడంతో సౌజన్య మోఖం, చేతుల పైన స్వల్ప గాయాలు అయ్యాయి. కళాశాల సిబ్బంది వెంకటరమణను ఆసుపత్రికి తరలించారు. రూరల్ సీఐ అజయ్కుమార్ సిబ్బందితో వచ్చి సౌజన్యను స్టేషన్కు తరలించారు. ఆమెకు కూడా గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోదామనుకున్నా.. ఐదేళ్లుగా ప్రేమించి వివాహం చేసుకుంటానంటూ వెంకటరమణ తన జీవితంతో ఆడుకున్నాడని సౌజన్య కన్నీటి పర్యంతమయింది. మరొకరిని వివాహం చేసుకుని మోసగించిన అతడిని హతమార్చి తాను కూడా చనిపోదామని నిశ్చయించుకున్నానంది. అధ్యాపకుడిపై యాసిడ్ దాడి చేసిన సౌజన్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పసుపు విత్తన విక్రయూల జోరు
రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పసుపు పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో పసుపు విత్తన మార్కెట్గా ప్రసిద్ధి చెందిన తూములూరులో విక్రయూలు జోరందుకున్నారుు. ఆదివారం ఒక్క రోజే 750 పుట్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. ఇక్కడి విత్తనాలను ఒడిశా రాష్ట్ర రైతులూ పెద్దఎత్తున కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి 10 వేల పుట్ల విత్తనాలను ఎగుమతి చేశారు. కొల్లిపర: రెండు రోజులుగా వర్షాలు పడుతుండటంతో పసుపు సాగుకు వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో పసుపు విత్తనాల కేంద్రంగా ప్రసిద్ధి చెందిన తూములూరులో విక్రయూలు జోరందుకున్నారుు. ఆదివారం ఒక్కరోజే 750 పుట్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.22.50 లక్షలు. ఒక పుట్టి పసుపు విత్తనాల బరువు 225 కిలోలు కాగా ధర రూ.3000 పలికింది. తెనాలి డివిజన్లోని మండలాలతోపాటు సత్తెనపల్లి, నర్సారావుపేట, పిడుగురాళ్ల, మాచర్ల, కృష్ణా జిల్లా నూజివీడు, నందిగామ తదితర ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రానికి చెందిన రైతులు విత్తనాలను కొనుగోలు చేశారని వ్యాపారులు చెప్పారు. పసుపు విత్తనాలకు ఒడిశా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటంతో అక్కడి రైతులు పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి 10 వేల పుట్ల విత్తనాలను ఎగుమతి చేశామని వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా నుంచి విత్తనాల రాక వైఎస్ఆర్ జిల్లాలోని కడప, మైదుకూరు, బద్వేలు తదితర ప్రాంతాలకు చెందిన రైతులు ఏటా పసుపు విత్తనాలను తూములూరు తీసుకొచ్చి విక్రరుుంచటం ఆనవారుుతీ. ఇప్పటివరకు వారు 17,500 పుట్ల విత్తనాలను తీసుకువచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో ఇంకా 7,500 పుట్ల విత్తనాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నారుు. పసుపు విత్తనాల్లో రకాలు పసుపు విత్తనాల్లో పలు రకాలు ఉన్నాయి. సుగంధ, టేకూరుపేట, బాక్రాపేట, సేలం, కడప, ప్రగడవరం వంటి రకాలు ఇక్కడకు దిగుమతి అవుతాయి. సుగంధ రకం ఎక్కువగా గుంటూరు జిల్లాలోని పల్నాడు, కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతాలకు ఎగుమతి ఆవుతుంది. సేలం రకాన్ని లంక గ్రామాలతోపాటు కొల్లిపర మండల పరిసర ప్రాంతాల్లో విస్తారంగా పండిస్తారు. ప్రగ డవరం రకం ఏలూరు, ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాలకు వెళుతుంది. సాగు పనులు ప్రారంభం.. వాస్తవానికి పసుపు సాగు పనులు ఈసరికే పూర్తికావాలి. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడంతో జాప్యం జరిగింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులకు రైతులు శ్రీకారం చుడుతున్నారు. కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు మండలాల పరిధిలోని రైతులు విద్యుత్ మోటార్ల సాయంతో సాగు పనులను వారం కిందటే ప్రారంభించారు. ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లోనూ సాగు పనులు ప్రారంభమయ్యూరుు. ఎకరానికి 8 పుట్ల విత్తనాలు అవసరం. దీంతో రైతులు భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దిగుబడులు బాగుంటేనే రైతుల కష్టానికి తగిన ప్రయోజనం దక్కుతుంది.