-
మదర్ థెరిసా వ్యక్తిగత వైద్యుడు.. రిచెస్ట్ డాక్టర్
బిలీనియర్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వ్యాపారవేత్తలే, కానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒక డాక్టర్ కూడా చోటు సంపాదించుకున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఆయన సంపాదన ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డాక్టర్ దేవి శెట్టి (Dr. Devi Shetty) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 'నారాయణ హృదయాల' మాత్రం దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. 1984లో మదర్ థెరిసాకి మొదటి సారి గుండెపోటు వచ్చినప్పుడు ఆమెను సంప్రదించిన డాక్టర్ దేవి శెట్టి ఆ తరువాత దాదాపు ఐదు సంవత్సరాలు ఆమె వ్యక్తిగత వైద్యుడిగానే ఉన్నారు. ప్రముఖ కార్డియాక్ సర్జన్ అయిన దేవి శెట్టి బిలినియర్ మాత్రమే కాదు పరులకు ఉపకారం చేసే పరోపకారి కూడా. ఈయన 2001లో నారాయణ హృదయాలయను స్థాపించారు. ఆ తరువాత ఇది నారాయణ్ హెల్త్గా మారింది. ప్రస్తుతం ఇది 47 హెల్త్కేర్ సెంటర్లతో, రూ. 15,000 కోట్ల మార్కెట్ క్యాప్తో భారతదేశంలోని అతిపెద్ద హాస్పిటల్ చెయిన్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 'నారాయణ హృదయాల స్థాపించడం వెనుక మదర్ థెరిసా ఒక స్పూర్తిదాయకమైన శక్తి' అని ఒక కాలమ్లో రాసుకున్నట్లు సమాచారం. ఆమె పేద ప్రజలకు ఎలా సేవ చేసేదో అది చూసి తాను కూడా తన వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఈ హాస్పిటల్ ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఒక గ్రామంలో జన్మించిన డాక్టర్ శెట్టి చిన్నతనంలోనే హార్ట్ సర్జన్ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే ఈ దిశవైపు అడుగులు వేస్తూ అనుకున్నది సాధించి 'హార్ట్ సర్జన్' అయ్యాడు. నిరంతర కృషితో దేశంలో ఆరోగ్య సంరక్షణకు గణనీయమైన కృషి చేసిన డాక్టర్ శెట్టి ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగాడు. (ఇదీ చదవండి: కియా నుంచి మరో నయా కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?) డాక్టర్ శెట్టి మణిపాల్లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి ఆ తరువాత యూకే, అమెరికాలో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ విధానంలో గొప్ప అనుభవం పొందాడు. చదువు పూర్తయిన తర్వాత కార్డియాక్ సర్జన్గా ఉద్యోగం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ఈ రంగంపై ఆయనకున్న ఆసక్తి కారణంగా మరింత రాణించాడు. (ఇదీ చదవండి: విడుదలకు ముందే బుకింగ్స్ షురూ.. లాంచ్ అయితే రచ్చ.. రచ్చే!) ప్రస్తుతం భారతదేశంలో 30 కంటే ఎక్కువ ఆసుపత్రులతో 7,000 పడకలను కలిగి ఉన్న నారాయణ హృదయాల పేదలకు సరసమైన ధరలలోనే సేవలు అందిస్తూ తరిస్తోంది. భారతదేశంలో ఉన్న అతి గొప్ప డాక్టర్లలో ఒకరైన డాక్టర్ శెట్టి ఆస్తుల విలువ సుమారు రూ. 9,800 కోట్లు అని సమాచారం. ఈయన భారతదేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్ కైవసం చేసుకున్నాడు. అంతే కాకుండా టైమ్ మ్యాగజైన్ చేత ఆరోగ్య సంరక్షణలో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తులలో ఒకడుగా రికార్డు బద్దలు కొట్టాడు. -
నేటి నుంచి నారాయణ హృదయాలయ ఐపీఓ
- ప్రైస్బాండ్ రూ.245-250 రేంజ్లో న్యూఢిల్లీ: నారాయణ హృదయాలయ ఐపీఓ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.613 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ నెల 21న (వచ్చే సోమవారం) ముగిసే ఈ ఐపీఓకు రూ. 245-250 ధరల శ్రేణిని ప్రైస్బాండ్గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా 14 శాతం వాటాకు సమానమైన 2.45 కోట్ల షేర్లను జారీ చేస్తారు. కాగా 15 మంది యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.184 కోట్లు సమీకరించామని తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement