breaking news
nabeel
-
సూటి పోటీ మాటలతో నన్ను వెన్నుపోటు పొడిచాడు..
-
తండ్రి మందలించాడని ఇద్దరు బాలికలు...
⇒ ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరు బాలికలు బహదూర్పురా: తండ్రి మందలించాడని మనస్తాపం చెందిన బాలికలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కూతుళ్ల కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రవిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. దూద్బౌలి ప్రాంతానికి చెందిన ఉస్మాన్ అలీ ఖాన్, మేరాజ్ బేగం దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో కలసి నివాసముంటున్నారు. పెద్ద కుమార్తె సమీహ 9వ తరగతి, చిన్న కుమార్తె నబీల్ 8వ తరగతి చదువుతున్నారు. చెప్పిన పని చేయలేదని ఈ నెల 4వ తేదీన కూతుళ్లను ఉస్మాన్ అలీఖాన్ మందలించాడు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వీరు రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మేరాజ్ బేగం తన కూతుళ్లు కనిపించడం లేదని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040-27854789, 9490616309 నంబర్లలో సమాచారం అందించాలని పోలీసులు, తల్లిదండ్రులు కోరారు. -
'పిడిగుద్దులు తగిలాక 30 సెకన్లలో చనిపోయాడు'
హైదరాబాద్: పాతబస్తీలో స్ట్రీట్ఫైట్ పేరిట సాగించిన ముష్టియుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన నబీల్.. పిడిగుద్దులు తగిలిన తర్వాత 30 సెకన్లలోనే మరణించాడని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. నబీల్ శరీరంపై తొమ్మిది చోట్ల గాయాలున్నట్టు గుర్తించారు. నబీల్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు నివేదికను సౌత్జోన్ డీసీపీకి అందజేశారు. గాయాల కారణంగా నబీల్ చనిపోయినట్టు పోస్ట్మార్టం నివేదికలో తేలింది. నబీల్ కేసులో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.