-
మరో థ్రిల్లర్తో...
‘విరూపాక్ష’ సినిమాతో ఘనవిజయం అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించారు. ‘విరూపాక్ష’ నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ ప్రీ లుక్ ΄ోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘విరూపాక్ష’ను మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందించిన కార్తీక్ దండు తన తదుపరి చిత్రాన్ని మిథికల్ థ్రిల్లర్ జానర్లో తీయబోతున్నాడు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు వెలిగిస్తే మంచిది..!
చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం... నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర ద్రవ్యాలలోనూ, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసి ని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తత.. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నరకుడు చస్తే పండుగ ఎందుకు? నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేరాజై ఉండి కూడా అసూయతో దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు. లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది. దీపావళి నాడు ఏం చేయాలి? ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందట. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, వీలైనంత అందంగా అలంకరించాలి. చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం. లక్ష్మీపూజ ఇలా చేయాలి... ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలను, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఎన్నో కథలు... మరెన్నో కారణాలు.. లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. జ్ఞానప్రదాత. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దీపావళి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుందాం. – డి.వి.ఆర్.భాస్కర్ చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! -
పౌరాణిక కథతో...
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘వైవస్వత’. మోక్ష శ్రీమయి సమర్పణలో సింహవాహిని చలనచిత్ర పతాకంపై ఎస్. నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విసు రెడ్డి, షామిన్ మన్నన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వరుణ్వంశీ బలభద్రపాత్రుని-కార్తికేయ వరపర్ల దర్శకులుగా పరిచయమవుతున్నారు. పౌరాణిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామనీ, సాంకేతికంగా భారతీయ చలన చిత్రసీమ ఆశ్చర్యపోయే రీతిలో ఈ చిత్రం ఉంటుందని దర్శకులు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘విదేశాల్లోని దీవుల్లో, దట్టమైన అడవుల్లో ఎక్కువ శాతం చిత్రీకరిస్తాం. పౌరాణిక కథల్లో ఇప్పటివరకూ రాని కథతో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రకథా విశేషాలను తెలియజేసే ‘గ్రాఫిక్ బుక్’ని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. బంగారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.ఎన్. మహేంద్రబాబు. -
మీ ఎదుట కథ
పాడనా తెనుగు పాట అంటూ.. ఓ అమెరికా అమ్మాయి రాగం అందుకుంటే.. పరవశించి విన్నాం. అదే ఒరవడిని కాస్త మార్చి మన పౌరాణిక కథను, చారిత్రక గాథలను కళ్లకు కట్టేలా చెబుతున్నారు ఓ విదేశీ వనిత. ఆమె రామాయణం చెబితే.. రాముడి పదహారు గుణాలను అభినయించి చూపిస్తారు. సీతమ్మ హృదయాన్ని అంతే హృద్యంగా ఆవిష్కరిస్తారు. ప్రహ్లాద చరిత విడమరచి చెప్పేటప్పుడు బాలభక్తుడిగా, నారసింహిగా మారిపోతారు. తన మాటకు హావభావాలు జోడించి పురాణ కాలక్షేపం చేస్తున్న ఆ మహిళ పేరు ఏమిలీ ఫర్రీష్, బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలోని బ్రిటిష్ లైబ్రరీలో ఆదివారం జరిగిన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో పలు కథలు వినిపించిన ఆమెను ‘సిటీప్లస్’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ..:: వాంకె శ్రీనివాస్ పుట్టింది, పెరిగింది ఇంగ్లండ్లోనే. చిన్నప్పటి నుంచే నాటికలంటే ఎంతో ఇష్టం. ఈ ఆసక్తితోనే కెంట్ యూనివర్సిటీలో డ్రామా కోర్స్లో చేరాను. ఇదే టైంలో ఇండియాకు చెందిన స్టోరీటెల్లర్ వాయునాయుడు కథలు నన్ను కదిలించాయి. కథలతో ఎందరిలోనో మార్పు తీసుకురావొచ్చని అర్థమైంది. గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే వాయునాయుడు కంపెనీలోనే ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేరాను. భారతదేశానికి చెందిన జానపద కళారూపం పండ్వాణి ప్రదర్శకురాలు రితూవర్మ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. తర్వాత ‘స్టోరీ కలెక్టర్’ పరిశోధనలో భాగంగా ప్రపంచాన్ని చుట్టొచ్చాను. మైండ్లో ఫిక్స్.. కథ, కథనం గురించి తెలుసుకోవడానికి భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది నెలలు పర్యటించాను. తమిళనాడులోని కట్టైకుట్టు స్కూల్ విద్యార్థులతో ఎక్కువ కాలం పనిచేశాను. ఈ థియేటర్ స్కూల్లో మ్యూజిక్, డ్యాన్స్, పాటల ద్వారా రామాయణ, మహాభారతాలు నేర్పిస్తారు. ప్రస్తుతం యూకేలో స్కాండల్ మోంగర్స్ (స్టోరీటెల్లింగ్ థియేటర్ కంపెనీ) డెరైక్టర్గా వ్యవహరిస్తున్నా. విద్యార్థులకు కథలు చెబుతుంటాను. మనం చెప్పే కథలు పిల్లల మస్తిష్కాల్లో చిరకాలం నిలిచి పోవాలంటే కథనంలో హావభావాలు చూపించగలగాలి, సందర్భోచితంగా కంఠ స్వరం మార్చాలి, ఐ కాంటాక్ట్ ముఖ్యం. అప్పుడే కథలు వారి మైండ్లో ఫిక్సవుతాయి. చిన్నప్పడు పౌరాణిక కథలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. మంచి చెడూ తెలుస్తాయి. ఊహించే శక్తి పెరుగుతుంది. ఇతరుల మనస్తత్వాన్ని పసిగట్టగలరు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. మరింత ఆదరించాలి.. భారతీయ సంస్కృతి, ఇక్కడి ఆచార వ్యవహారాలు ఎంతో ఇష్టం. హిందూ దేవుళ్ల గురించి కూడా తెలుసుకున్నాను. రామాయణ, భారతాల్లోని అంశాలను తీసుకుని కథలు చెబుతుంటా. ఇంతకు ముందు దిల్లీ, ముంబైలలో స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించాను. హైదరాబాద్కు రావడం ఇదే తొలిసారి. గోల్కొండ, చార్మినార్ తెగ నచ్చేశాయి. ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళారూపాలైన బుర్రకథ, హరికథ ఇంకా ప్రాచుర్యంలో ఉన్నాయని తెలిసి సంతోషపడ్డాను. భారతీయత ప్రాభవానికి ఇవే మూలాలు. వీటికి ఆదరణ కల్పించాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో స్టోరీటెల్లింగ్ ట్రెండ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!
ఆ నొప్పి నరకం : ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టరా?
వేడుకగా చెన్నకేశవస్వామి కల్యాణం
రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్కు గాయాలు
ప్రజలకు తాటిపర్తి కృతజ్ఞతలు
విజయ మనదే.. ధీమాగా ఉండండి
ఓటర్లకు ఎమ్మెల్యే కేపీ కృతజ్ఞతలు
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఇంకొక్కటి.. అలా అయితే టాప్-2లో సన్రైజర్స్! నేరుగా..
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement