breaking news
modernaization
-
ఆశ్రమాల్లో ‘స్మార్ట్ కిచెన్’
ఉట్నూర్(ఖానాపూర్) : గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో వంటశాలల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కట్టెల పొయ్యిలు, గ్యాస్స్టౌవ్ల స్థానంలో స్టీమ్కుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇంధనభారం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణహిత పద్ధతిలో వంట చేసేందుకుగాను స్మార్ట్ కిచెన్ వైపు గిరిజన సంక్షేమ శాఖ దృష్టి సారించింది. ఈ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 40వేలకు పైగా గిరిజన విద్యార్థులు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో 127ఆశ్రమ పాఠశాలల్లో 39,123 మంది, ఏడు వసతిగృహాల్లో 1,254 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తూన్నారు. వీరందరికీ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా విద్య, భోజన, ఇతర మౌలిక వసతులు కల్పిస్తోంది. ఒక్కో ఆశ్రమ పాఠశాలలో 600కుపైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికి నిర్దేశిత మెనూ ప్రకారం రోజుకు మూడు పూటల భోజనం అందించేందుకు నిరంతరం దాదాపు 350 మంది నాల్గోతరగతి ఉద్యోగులు, 900మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆశ్రమ పాఠశాలలు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో ఉండటం అక్కడ గ్యాస్ సరఫరాలో సమస్యల నేపథ్యంలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగ ఎక్కువగా వెలువడటం, సిబ్బంది అనారోగ్యం పాలవడంతో పాటు వంట రుచిలో తేడాలొస్తున్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం 2016లో ప్రతి ఆశ్రమ పాఠశాలలో వంట తయారీ కోసం గ్యాస్ స్టౌవ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో రూ.30.60లక్షల వ్యయంతో 450 గ్యాస్ స్టౌవ్లను ఆశ్రమ పాఠశాలలకు అందించినా గ్యాస్ తిప్పలతో ఆశించిన ఫలితాలు కానరాలేదు. ఈ క్రమంలో వంట సమస్యలను అధిగమిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించేందుకు స్టీమ్ కుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈడబ్ల్యూఐడీసీకి బాధ్యతలు... ఆశ్రమపాఠశాలల్లో స్టీమ్ కుకింగ్ పరికరాలు, వంట సామగ్రి కొనుగోలు చేసే బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ ఈడబ్ల్యూఐడీసీ (ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కు అప్పగించింది. ఈ మేరకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకు గాను త్వరలో టెండర్లు పిలువడంతో పాటు వేసవి సెలవుల్లోగా ప్రతి ఆశ్రమ పాఠశాలల్లో స్టీమ్ కుకింగ్ విధానం అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు వేగవంతం చేస్తోంది. -
మహర్దశ
మహబూబ్నగర్ క్రీడలు : జిల్లా స్టేడియంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్కు మహర్దశ కలగనుంది. స్టేడియంలో ఆధునీకరణ పనుల కోసం రూ.2కోట్ల 50లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికే స్టేడియం మైదానంలో లేవలింగ్ పను లను ముమ్మరంగా చేపడుతున్నారు. దా దాపు రూ.70లక్షల నిధులతో స్విమ్మింగ్పూల్ ఆధునీకరణ చేపట్టనున్నారు. రెండు రోజుల నుంచి పూల్లో మరమ్మతులు పనులు జరుగుతున్నాయి. అన్ని సౌకర్యాలకు ప్రణాళికలు స్విమ్మింగ్పూల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి జిల్లా క్రీడాశాఖ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పూల్లోని స్నానపు, మూత్రలశాలలు గదుల మరమ్మతులు, ఫ్లోరింగ్, పాత జిమ్సెంటర్లో డీఎస్ఏ కార్యాలయం ఏర్పాటుతోపాటు బేబిపూల్, ఓపెన్ షవర్లు, పంప్రూం, భవన మరమ్మతులు చేపట్టనున్నారు. నూతనంగా స్టోర్ రూం నిర్మించనున్నారు. పూల్లో ఆధునీకరణ పనులు జరుగుతుండడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో అన్ని సౌకర్యాలు వేసవి సెలవుల్లో స్విమ్మింగ్పూల్కు అన్ని వయస్సుల వారు ఎక్కువగా వస్తారు. పూల్లో వారికి అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. వేసవి వచ్చేలోపు పూల్లో ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం. – టీవీఎల్ సత్యవాణి, డీవైఎస్ఓ -
అయినా.. మనిషి మార(టం) లేదు!
సమకాలీనం ఈ విలయం కోటి మందిని కకావికలం చేసింది. సముద్రతీర నగరం శోక సంద్రమైంది. ఇది కేవలం ప్రకృతి విపత్తేనా? మానవ ప్రమేయం ఎంత? ఇది కోటి రూకల ప్రశ్న! ఈ విలయానికి హేతువైన వాతావరణ మార్పులకు, అడ్డదిడ్డపు నగరీకరణకు మనమే కారణం. ఈ అనర్థాల పర్యవసానమే నేటి చెన్నై దుస్థితి. నాలుగువందల ఏళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన హైదరాబాదు (తెలంగాణ), ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అమరావతి (ఆంధ్రప్రదేశ్)- రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు ఇదొక హెచ్చరిక. 'పారిస్పై దాడి జరిపిన ఉగ్రవాదుల తుపాకీ చప్పుళ్లు వినిపించినంతగా... ఉపద్రవంలో క్షతగాత్రులైనవారి మౌనరోదనలు మనలో ప్రతిధ్వనించ లేదు... వాతావరణ మార్పు దుష్పరిణామాల గురించి ఆందోళన చెందు తున్న గొంతుల తీవ్రతను పరిగణనలోకి తీసుకోవడంలో ఇక ఏ మాత్రం ఆలస్యం కూడదు' అని పారిస్లోనే జరుగుతున్న పర్యావరణ సదస్సుకు, ఆతిథ్య దేశం ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ సందేశమిచ్చారు. పాల్గొన్న 150కి పైగా దేశాల ప్రతినిధుల్లో ఎందరు ఈ సూక్ష్మార్థాన్ని గ్రహించారో కాని, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై ఇందుకు ఓ పాఠమే. వాతావరణ మార్పుల ఫలితంగా అకాల, అసాధారణ వర్షాలకు మనం, మన పాలకుల రూపంలో మానవ తప్పిదం తోడైంది. భళ్లున వర్షం కురిసినట్టే, చెన్నై రోదన మిన్నంటింది. తక్షణ సహాయం అందించడానికి కూడా వీల్లేనంత అతలాకుతలమైంది. ఈ విలయం కోటి మందిని కకావికలం చేసింది. సముద్ర తీర నగరం శోక సంద్రమైంది. ఇది కేవలం ప్రకృతి విపత్తేనా? మానవ ప్రమేయం ఎంత? ఇది కోటి రూకల ప్రశ్న! ఈ విలయానికి హేతువైన వాతావరణ మార్పులకు, అడ్డదిడ్డపు నగరీకరణకు మనమే కారణం. ఈ అనర్థాల పర్యవసానమే నేటి చెన్నై దుస్థితి. నాలుగువందల ఏళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన హైదరాబాదు (తెలంగాణ), ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అమరావతి (ఆంధ్రప్రదేశ్)- రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు ఇదొక హెచ్చరిక. కష్టాల్లో ఉన్న సాటివారిని ఆదుకునేందుకు చూపుతున్న మానవత్వంలో నాలుగో వంతు శ్రద్ధయినా ముందు జాగ్రత్తల విషయంలో తీసుకుంటే ఇలాంటి ఉపద్రవాల్ని అరికట్టడం, లేదా తీవ్రత తగ్గించడం చేయవచ్చని నిపుణులు అభిప్రాయం. హెచ్చరికల్ని బేఖాతరన్నందుకే! వాతావరణ విభాగం లెక్కల ప్రకారం చెన్నై తీవ్ర వరద ప్రమాద ప్రాంత మేమీ కాదు. తూర్పున బంగాళాఖాతమున్న ఈ నగరం సగటు సముద్ర మట్టానికి అయిదారు మీటర్ల ఎత్తునుంది. కానీ, చెన్నైలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు కనీస సముద్ర మట్టం కన్నా 27 అంగుళాల ఎత్తులోనే ఉన్నాయి! ఇక్కడ డ్రైనేజీ నిర్వహణ కొంత కష్టం. చెన్నైలో తరచూ అక్టోబర్-డిసెంబర్ లోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. 1200 మి.మీ నుంచి 1300 మి.మీ సగటు వర్షపాతం కురిసేది, క్రమంగా పెరుగుతోంది. అల్పపీడనం, తుపానుల వల్ల 1976, 1985, 1996, 1998, 2005, 2008, 2010లో, మళ్లీ ఇప్పుడు కుంభవృష్టి కురిసి భారీ నష్టం సంభవించింది. 1901 తర్వాత, అంటే 114 సంవత్సరాల్లో నమోదైన అతి పెద్ద వర్షపాతం ఇదే. గత అనుభ వాల దృష్ట్యా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడటానికి, ముందు జాగ్రత్త చర్యలకు అవకాశమున్నా పాలకులు నిర్లక్ష్యం చేశారు. చెరువులు-కుంటల పరిరక్షణలో, మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో, ఘనవ్యర్థాల్ని నగరం బయటకు తరలించ డంలో విఫలమయ్యారు. స్పృహ కొరవడ్డ పౌరుల సహకారం కూడా అంతంతే! స్థానిక విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్కిటెక్ట్ కె.లావణ్య జరిపిన అధ్యయనంలో చాలా విషయాలు వెలుగు చూశాయి. చెన్నైలో ఒకప్పుడు 650 చెరువులుండేవి. ఇప్పుడు 40కి లోపే మిగిలాయి. చిత్తడి ప్రాంతాలన్నింటా నిర్మాణాలొచ్చాయి. నగరంలో ప్రవహించే మూడు నదులు కుపుం, అడ యార్, కోనసత్తలయార్ పరీవాహక ప్రాంతాలన్నీ అక్రమణలకు గురయ్యా యి. నగరం నుంచి వచ్చే వాననీటిని గ్రహిస్తూ ప్రవహించే బకింగ్హామ్ కాలువ దాదాపు మూసుకుపోయింది. అక్కడక్కడ మిగిలిపోయిన కుంటలు, బహిరంగ లోతట్టు ప్రాంతాల్లో చెత్త, చెదారం వేస్తూ ఘనవ్యర్థాలతో నింపు తున్నారు. దేశంలో మరే నగరంలో లేనంత అత్యధిక తలసరి ఘన వ్యర్థాల్ని (0.6 కి.గ్రా/రోజు) ఉత్పత్తి చేస్తున్న నగరమిది. హై'డర్'బాదూ సురక్షితమేం కాదు! నిన్నటి చెన్నై వర్షం మన చారిత్రక హైదరాబాద్ నగరంలో కురిస్తే... అన్న ఊహ చాలా మందిని గగుర్పాటుకు గురిచేసింది. 2000 సంవత్సరంలో భారీ వర్షం జంటనగరాలను అతలాకుతలం చేసింది. నగరం నడిమధ్యన ప్రవ హించే మూసీ పోటెత్తింది. నాటి వర్షం దాదాపు 20 సెంటీ మీటర్లే! నిన్నటి వర్షం ఏకంగా 49 సెంటీ మీటర్లు! మన నగరంలో తాగునీటి సరఫరా- మురుగునీటి వ్యవస్థకు కాలం చెల్లింది. దురాక్రమణల వల్ల చెరువులు- కుంటలు కనుమరుగయ్యాయి. ఆదర్శ ప్రణాళిక అటకెక్కి, ముందు చూపు కొరవడటంతో చిన్నపాటి వర్షానికే మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. దాదాపు నూరేళ్ల కింద మూసీ వరదల్ని నియంత్రించడం, నగర తాగునీటి అవసరాలు తీర్చడం, హుస్సేన్సాగర్ పరిరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ అంకురార్పణ కోసం విశ్వ విఖ్యాత ఇంజినీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాస్టర్ప్లాన్ సిద్ధంచేశారు. నియంత నిజాం రాజైనా కొంత అమలు చేశాడు కానీ, ప్రజాస్వామ్య పాలకులై ఉండీ, దీన్ని దశలవారీగా అమలుచేయడంలో గ్రేటర్ విభాగాలు దారుణంగా విఫలమౌతున్నాయి. నగర జనాభా నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నపుడు నిజాం వినతి మేరకు విశ్వేశ్వరయ్య పూనిక వహిం చారు. ఇప్పుడు... గ్రేటర్ జనాభా 80 లక్షలకు చేరువైంది. గృహసముదాయాలు సుమారు 20 లక్షలున్నాయి. 35 లక్షల మందికి మురుగు కష్టాలు నిత్యనరకం చూపుతున్నాయి. నగరంలోకి తాగునీరు తెప్పించేందుకు చేసే కృషిలో నాలుగో వంతు కూడా వాడిన నీటిని బయటికి పంపడంపై పాల కులకు శ్రద్ద లేదు. రోజువారీగా జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు రెండువేల మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమౌతోంది. ఇది సాఫీగా వె ళ్లేందుకు కనీసం 4500 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అవసరం. అందుబాటులో ఉన్నది 3,000 కిలోమీటర్లే. మేల్కొంటేనే సరైన నిద్ర! ఒక్క చెన్నై, హైదరాబాద్ ఘోష కాదిది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగ రాల పరిస్థితీ ఇదే! మేఘాలావర్తించి వర్షం మొదలైతే.... నగరాల వాసు లకిక నిద్రలేని రాత్రులే! కలకత్తాకూ లోగడ కష్టాలు తప్పలేదు. 2005 నాటి వర్షాలకు ముంబై ముద్దయింది. 24 గంటల్లో కురిసిన 944 మి.మీ వర్షం, పొంగి ప్రవహించిన మురుగునీటితో కలిసి నగరాన్ని ముంచెత్తింది. కృష్ణా తీరంలో ఇప్పుడు నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరికను కాదని జరుపుతున్న నిర్మాణమని మరచిపోవద్దు. వందేళ్ల చరిత్ర సృష్టించిన వర్షం తమిళనాడులో కురిస్తే... పక్క తెలుగు రాష్ట్రాల్లో జీవనదులు, కృష్ణా-గోదావరి నూరేళ్లలో లేనంత ఎండిపోయి తీర నగరాలు-పట్టణాల్ని దప్పికతో అల్లాడిస్తు న్నాయి. నగరాలు నాగరికత చిహ్నాలంటారు. అది అవునో... కాదో? కానీ, నరకానికి నకళ్లు మాత్రం కాకూడదు. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి, ఈ మెయిల్: dileepreddy@sakshi.com