breaking news
Mobile Handsets sales
-
99.2 శాతం దేశంలో తయారైన మొబైళ్లే!
మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. తాజా నివేదికల ప్రకారం ఇండియాలో ఉపయోగించే మొబైల్ హ్యాండ్ సెట్లలో 99.2% దేశీయంగా తయారైనవేనని పేర్కొన్నారు. 2014లో భారత్లో విక్రయించిన మొబైల్ ఫోన్లలో 74 శాతం దిగుమతులపైనే ఆధారపడినట్లు చెప్పారు. గడిచిన పదేళ్లలో ఈ రంగం భారీగా వృద్ధి చెందినట్లు వివరించారు.తయారీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం (స్పెక్స్) వంటి వివిధ కార్యక్రమాలు ఇందుకు ఎంతో తోడ్పడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ రూ.1,90,366 కోట్లుగా ఉంటే అది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,52,000 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు. ఇది 17% కంటే ఎక్కువ సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను సూచిస్తుంది. దాంతో పదేళ్ల కాలంలో మొబైల్ ఫోన్ల ప్రధాన దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా దేశం ఎదిగిందన్నారు.ఇదీ చదవండి: యూట్యూబ్లో థంబ్నేల్స్ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!ఎలక్ట్రానిక్స్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని ప్రసాద పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కోసం రూ.76,000 కోట్ల పెట్టుబడితో ఇటీవల ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. దేశంలో సెమీకండక్టర్, డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పునరుద్ఘాటించారు. -
క్యూ3లో మొబైల్స్ విక్రయాలు @ 7.5 కోట్లు!
సీఎంఆర్ అంచనా న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ3) మొబైల్ హ్యాండ్సెట్స్ విక్రయాలు 7.5 కోట్ల యూనిట్లుగా ఉండొచ్చని రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ అంచనా వేసింది. పండుగల సీజన్, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, సానుకూల రుతుపవనాలు, ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల అమలు వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు దోహదపడొచ్చని తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్ (క్యూ2)లో మొబైల్ ఫోన్ల విక్రయాలు 6.59 కోట్ల యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 24% వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ఇందులో ఫీచర్ ఫోన్ల వాటా 3.73 కోట్లుగా, స్మార్ట్ఫోన్స్ వాటా 2.87 కోట్లుగా ఉందని తెలిపింది. శాంసంగ్ టాప్: క్యూ2లో మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్లో 25.5% వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో ఉంది. దీని వాటా స్మార్ట్ఫోన్స్ విభాగంలో 29.7%, ఫీచర్ ఫోన్స్ విభాగంలో 22.3% ఉందని సీఎంఆర్ పేర్కొంది. ఇక 13.6% మార్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ రెండో స్థానంలో ఉంది. ఇది స్మార్ట్ఫోన్స్ విభాగంలో 14.8% వాటాను, ఫీచర్ ఫోన్స్ విభాగంలో 12.6 శాతం వాటాను ఆక్రమించింది. మైక్రోమ్యాక్స్ తర్వాతి స్థానాల్లో ఇంటెక్స్ (10.4 %), కార్బన్ (9.6 శాతం), లావా (8 శాతం) ఉన్నాయి. పీసీ విక్రయాలు 2% డౌన్ న్యూఢిల్లీ: దేశంలో పీసీ విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2.2 శాతం తగ్గుదలతో 21.4 లక్షల యూనిట్లకు క్షీణించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో పీసీ అమ్మకాలు 21.9 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ క్వార్టర్లో పీసీ విక్రయాలు 7.2 శాతంమేర ఎగశాయి. కాగా, పీసీ మార్కెట్లో హెచ్పీ అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 28.4 శాతంగా ఉంది. ఇక దీని తర్వాత స్థానాల్లో డెల్ (22.2 శాతం), లెనొవొ (16.1 శాతం), ఏసర్ (14 శాతం) ఉన్నాయి.