breaking news
Lonely life
-
ఒంటరి జీవితం భరించలేక బలవన్మరణం
సాక్షి, రాయదుర్గంటౌన్: ఒంటరి జీవితం భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బళ్లారి జిల్లా రూపనగుడి గ్రామానికి చెందిన లింగన్న, పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. స్వగ్రామం నుంచి 25 ఏళ్ల క్రితమే రాయదుర్గం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. కోతిగుట్ట కాలనీలో నివాసముంటున్నారు. జ్యోతి తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం మృతి చెందారు. ఇద్దరు అక్కలకు వివాహం కాగా.. సోదరుడు స్వగ్రామానికి వెళ్లి పొలం పనులు చేసుకుంటున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న జ్యోతి స్వగ్రామానికి వెళ్లలేక రాయదుర్గంలోనే ఓ కంప్యూటర్ ఇన్స్టిట్ట్యూట్లో ఆపరేటర్గా పనిచేస్తూ జీవిస్తోంది. నెల రోజుల నుంచి పనికి కూడా వెళ్లడం లేదు. అక్కలు, సోదరుడు ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై.. ఒంటరి జీవితం భరించలేక మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒంటరి
‘ఒంటరితనాన్ని అణచిపెట్టినా, నిర్లక్ష్యం చేసినా.. ఆ భావన తాలూకు బాధ, సమస్య అలాగే ఉంటాయి’అంటారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. యువతీ యవకుల్లో 40% మంది ఆ ఒంటరితనం బారినపడుతున్నారని, పెద్దల (27%)తో పోలిస్తే సమాజంతో వేరుపడిపోతున్న యువత సంఖ్య పెరుగుతోందని బీబీసీ ఇటీవల జరిపిన సర్వే చెబుతోంది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన 55,000 మంది (16 – 99 వయస్కులు) ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 66% మంది స్త్రీలు. ‘ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. ప్రపంచం నన్ను పక్కకు నెట్టేసినట్టు, ప్రపంచం నుంచి వేరుపడినట్లు అనిపిస్తుంది. ఈ కారణంగాదిగులుగా వుంటుంది’అని ఒంటరితనం గురించి సర్వేలో పాల్గొన్న వారు ఇచ్చిన వివరణ ఇది.మన దేశంలో జరిగిన కొన్ని అధ్యయనాలు కూడా ఇవే విషయాలు వెల్లడించాయి. 30% మంది యువతీ యువకులు ఒంటరితనానికి లోనవుతున్నట్టు 2016లో లోక్నీతి– సీఎస్డీఎస్ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసై టీస్) జరిపిన శాంపిల్ సర్వే తెలిపింది. యువకుల (29%) కంటే యువతుల్లో (33%), పట్టణ యువత (29%) కంటే గ్రామీణ యువతలో (33%) ఒంటరితనం బాధితులు ఎక్కువని తేల్చింది. బీబీసీ సర్వేలో తేలిన అంశాలు 16 – 24 వయసున్న యువతీయువకుల్లో 40% మందిని ఒంటరితనం వెంటాడుతోంది. ఒంటరితనం ఒక్కోసారి తమకు మంచి అనుభవాలనే పంచిందని 41% మంది చెప్పారు. నిరుద్యోగుల్ని (వయసుతో నిమిత్తం లేకుండా) ఒంటరితనం మరింత బాధిస్తోంది. పూర్తిగా, పాక్షికంగా కంటిచూపు లేని వారిలోనూ, వివక్షకు గురువుతున్న వారిలోని ఒంటరితనపు యాతన ఎక్కువే. సామాజికంగా – ఆర్థికంగా వెనుకబడిన వారు, గేలు.. వివక్ష ఎదురైన సందర్భాల్లో తమకు ఎవ్వరూ లేరనే వేదనలో కూరుకుపోతున్నారు. ఏం చేయాలి? ‘ఏదైనా చదవండి లేదా పనిలో మునిగిపోండి. స్నేహితులు, కుటుంబంతో తరుచుగా మాట్లాడుతూ మీ ఆలోచనల్ని పంచుకోండి. మీరు కలిసే వ్యక్తుల్లో మంచినే చూడటం నేర్చుకోండి. ముందు ఒంటరితనం వెనుకున్న కారణాలు గ్రహించి అటువైపు ఆలోచించండి. మనసుకు నచ్చిన వారికి మీ వేదన చెప్పండి’అని ఒంటరితనం నుంచి బయటపడేందుకు బీబీసీ సర్వే నిర్వాహకులు ఇచ్చిన సలహాలివి. ఆధునిక జీవితంలో ‘ఒంటరితనం’ఓ విషాద వాస్తవమంటున్నారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే. ఆ దేశం ‘ఒంటరితనం’తాలూకు ప్రమాదకర పరిణామాల నుంచి ప్రజల్ని రక్షించే ఉద్దేశంతో ఒక మంత్రిత్వశాఖ (మినిస్టర్ ఫర్ లోన్లీనెస్)ను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకిలా? యవ్వన దశలో జీవితంలో అనేక మార్పులొస్తాయి. చదువు, పనుల కోసం ఇంటికి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. కొత్త వారితో మసలుకోవాల్సి ఉంటుంది. సహజంగానే ఇవి కొంతవరకు ఒంటరితనానికి కారణమవుతాయి. అయితే చుట్టూ ఉన్న వాతావరణం తమ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు అందులో ఇమడలేనప్పుడు.. ఆ ఒంటరితనం మరింత బాధిస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. విద్యా సంస్థల్లో మంచి గ్రేడ్ సంపాదించకపోవడమనేది కొన్ని సందర్భాల్లో ఇతరులతో వేరుపడిపోయేందుకు, ఆపైన డిప్రెషన్లోకి జారుకునేందుకు దారి తీస్తుంటుందని వారు వివరిస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న టెక్నాలజీ వాడకం, సోషల్ మీడియాలో గడపటం ఒంటరితనానికి కారణమవుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
నలుగురితో కలిసి బతకండీ... చాలాకాలం జీవించండి!
కొత్త పరిశోధన ఒంటరిగా ఉండేవాళ్లతో పోలిస్తే అందరితో కలుపుగోలుగా ఉంటూ, నలుగురితో కలిసి ఉండేవారు ఎక్కువకాలం జీవిస్తారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పైగా ఒంటరిగా ఉండేవారు డిప్రెషన్ వంటి రుగ్మతలకు తేలిగ్గా గురవుతారని అధ్యయనవేత్తలు తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 44 లక్షల మందిపై నిర్వహించిన 70 వేర్వేరు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనంలో పరిశోధకులు మూడు రకాల ఒంటరి జీవితాలపై అధ్యయనం చేశారు. కొందరు నలుగురితోపాటూ కలిసి ఉన్నా మానసికంగా ఒంటరిగానే ఉంటారు. ఎవ్వరితోనూ కలిసి గడపలేరు. వీరిది సబ్జెక్టివ్ లోన్లీనెస్గా పేర్కొన్నారు. అలాగే కొందరికి బంధువులు, స్నేహితులు ఉన్నా కావాలనే ఎవ్వరితోనూ కలవకుండా తమంతట తామే ఒంటరితనంలో కూరుకుపోతారు. వీరిని ఆబ్జెక్టివ్ లోన్లీనెస్గా అభివర్ణించారు. ఇక మూడో వర్గం వారికి నిజంగానే ఎవరూ ఉండరు. తప్పనిసరిగా ఒంటరిగా ఉంటారు. ఈ మూడువర్గాల ఒంటరి జీవితాలను ఏడేళ్ల పాటు పరిశీలించిన అధ్యయనవేత్తలు మొదటివర్గం వారిలో 26 శాతం మంది, రెండో వర్గం వారిలో 29 శాతం మంది, మూడో వర్గం వారిలో 32 శాతం మంది 65 ఏళ్లు దాటకముందే మరణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలను ‘పరస్పెక్టివ్స్ ఆన్ సైకలాజికల్ సైన్స్’ అనే జర్నల్లో పొందుపరిచారు.