kvr degree college
-
‘కేవీఆర్’ అభివృద్ధికి సహకరించండి
కర్నూలు సిటీ: రాయలసీమలోనే అతి పెద్ద మహిళా డిగ్రీ కాలేజీగా గుర్తింపు పొందిన కేవీఆర్ కాలేజీ అబివృద్ధికి దాతలు సహకరించాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ రాజేశ్వరి కోరారు. శనివారం ఆ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. కాలేజీలో 1200 మంది విద్యార్థినులు ఉన్నారని.. వసతుల కోసం రూ. 3 కోట్లతో ప్రతిపాదనలు పంపినా అతీగతీ లేదన్నారు. వంద మంది విద్యార్థుల కోసం నిర్మించిన హస్టల్లో 1200 మంది ఉండాల్సి వస్తోదన్నారు. ఈ నెల 2 నుంచి8వ తేదీ వరకు కెవీఆర్ కాలేజీలో నాయకత్వ విద్య– నైపుణ్యం, సవాల్ అనే అంశంపై జాతీయ సెమినార్ జరుగుతుందన్నారు. కాలేజీ అకడమిక్ కమిటీ సభ్యులు విజయ్కూమార్రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ వీరాచారి, శ్రీదేవి, ఇందిరాశాంతి, సుబ్బరాజ్యమ్మ, వింద్యావతి, స్వప్నశ్రీ, డా.ఫామిదాబేగం, డా.జి అనిత తదితరులు పాల్గొన్నారు. -
కళాశాల స్థలాన్ని రక్షించాలని ధర్నా
కర్నూలు(న్యూసిటీ) : రోడ్డు విస్తరణ పనుల పేరుతో కేవీఆర్ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఆ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు హెచ్చరించారు. గురువారం సాయంత్రం కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ విద్యార్థినులు, అధ్యాపకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంటనే కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వచ్చి కళాశాల స్థలం ఆక్రమణకు గురి కాకుండా కాపాడుతానని హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. రోడ్డు విస్తరణ కోసం 12 మీటర్లను తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, కొందరు షాపింగ్ కాంప్లెక్స్ కోసం 28 మీటర్ల స్థలాన్ని తీసుకొని ఆట స్థలం లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని అధ్యాపకురాలు ఇందిరాశాంతి ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళాశాల స్థలాన్ని కాపాడతామని, అవసరమైతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో హైకోర్టులో కేసు వేయిస్తామని హెచ్చరించారు. మునిసిపల్ అధికారులు రాజకీయ నాయకులకు అనుకూలంగా ప్రభుత్వ స్థలాలను వారికి అప్పజేప్పేందుకు చర్యలు తీసుకోవడం సిగ్గుచేటని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.