breaking news
kunkumarchana
-
అమెరికాలో దుర్గమ్మకు కుంకుమార్చనలు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లకు అమెరికాలోని పలు నగరాల్లో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ప్రవాసాంధ్రుల కోసం ఏటా దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలో ఆర్జిత సేవలు జరిగేవి. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఈ సేవలను నిలిపివేశారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది నుంచి ఆర్జిత సేవలను పునఃప్రారంభించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దుర్గమ్మ దేవస్థానం నుంచి అమెరికాకు ఉత్సవమూర్తులను తీసుకెళ్లారు. అమ్మవారికి అలంకరించేందుకు ఆభరణాలను అమెరికాకు పంపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం శాన్హోస్లోని శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఆది దంపతులకు ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, చండీ హోమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఆలయంలో పూజలు జరుగనున్నాయి. 29 నుంచి లాస్ఏంజెల్స్లో.. ఈ నెల 29 నుంచి 31 వరకు లాస్ఏంజెల్స్లోని శ్రీ శివకామేశ్వరి దేవస్థానంలో, జూన్ 2 నుంచి 4 వరకు న్యూజెర్సీలోని సాయి దత్తపీఠం, శ్రీ శివవిష్ణు ఆలయాల్లో, జూన్ 5 నుంచి 7 వరకు బాల్టిమోర్లోని శ్రీ షిర్డీసాయి మందిర్తో పాటు మరికొన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. జూన్ 11న ఆలయ అర్చకులు దేవతా విగ్రహాలతో తిరిగి భారత్కు చేరుకుంటారు. -
శ్రీభ్రమరాంబదేవికి లక్షకుంకుమార్చన
శ్రీశైలం: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో అష్టాదశశక్తిపీఠమై వెలిసిన శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి ఆదివారం లక్ష కుంకుమార్చన పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చక, వేదపండితులు శ్రీఅమ్మవారికి నవావరణపూజ, విశేష కుంకుమార్చన తదితర పూజాదికాలను శాస్త్రోక్తంగా జరిపారు. దేవస్థానం నిర్వహిస్తోన్న మాసోత్సవాల్లో మూలానక్షత్రం, పౌర్ణమి రోజుల్లో శ్రీభ్రమరాంబదేవికి లోకకల్యాణార్థం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరపడం ఆనవాయితీగా వస్తుందని అధికారులు తెలిపారు. -
వరాల తల్లికి పూజలు
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి.