breaking news
kpmg india partner
-
Fact Check: ఆ జీఎస్టీ వార్తలు తప్పు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: నివాస అద్దెలపై ఎటువంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్టీ కింద నమోదైతే నివాస గృహాల అద్దెలపైనా కిరాయిదారు 18 శాతం జీఎస్టీ చెల్లించాలంటూ వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంది. నివాస యూనిట్లను (ఇళ్లు, ఫ్లాట్లు) కార్యాలయం, వ్యాపార వినియోగానికి అద్దెకు ఇచ్చినప్పుడే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ‘‘ఒక వ్యక్తి నివాసం కోసం ఇల్లు అద్దెకు తీసుకుంటే దానిపై జీఎస్టీ లేదు. ఒక వ్యాపార సంస్థ యజమాని లేదా భాగస్వామి తన వ్యక్తిగత నివాసానికి అద్దెకు తీసుకున్నా జీఎస్టీ ఉండదు’’అని కేంద్ర సర్కారు ఓ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత జీఎస్టీ రిజిస్టర్డ్ వ్యాపారస్తులకు ఊరటనిస్తుందని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ అభిషేక్ జైన్ పేర్కొన్నారు. వారు తమ నివాస గృహాల అద్దెపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. Claim: 18% GST on house rent for tenants #PibFactCheck ▶️Renting of residential unit taxable only when it is rented to business entity ▶️No GST when it is rented to private person for personal use ▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP — PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022 -
నియామకాలకు ‘సోషల్’ రూట్
ముంబై: సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా కంపెనీలు ఉద్యోగాలివ్వడం పెరుగుతోంది. కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు సరైన అభ్యర్థులను ఫేస్బుక్, లింక్డిన్,ట్విటర్, గూగుల్ ప్లస్ తదితర సామాజిక వెబ్సైట్ల ద్వారానే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ పోకడ ఈ ఏడాది 50 శాతం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సునిల్ గోయల్(గ్లోబల్హంట్), ఆల్ఫ్ హారిస్ (మైకేల్ పేజ్). నిశ్చల్ సూరి(కేపీఎంజీ ఇండియా పార్ట్నర్)వంటి నిపుణుల అభిప్రాయాల ప్రకారం..., {పతి నిత్యం బిజీగా ఉంటున్న వ్యక్తులకు పరిశ్రమలో వస్తున్న తాజా మార్పులను తెలుసుకోవడానికి సోషల్ మీడియానే ఏకైక సాధనంగా ఉంటోంది. అంతేకాకుండా వీరంతా తమ తాజా స్టేటస్లను ఈ వెబ్సైట్లలోనే అప్డేట్ చేస్తున్నారు. 2010లో ప్రారంభమైన ఈ పోకడ ప్రతీ ఏడాది 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోంది. ఫలితంగా కంపెనీలు తమకు కావలసిన అభ్యర్ధులను తేలికగా పట్టుకోగలుగుతున్నాయి. జాబ్ పోర్టళ్ల ద్వారా, ఉద్యోగ నియామక ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందడం కంటే సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాలు పొందితేనే ఎక్కువ వేతనం డిమాండ్ చేయవచ్చని మధ్య, ఉన్నత స్థాయి మేనేజర్లు భావిస్తున్నారు. ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లోని కంపెనీలు వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలను సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ, తయారీ, విద్యుత్, ఇంధన, రిటైల్, ఆటోమొబైల్ రంగాల్లోని కంపెనీలు కూడా మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగాలను ఈ వెబ్సైట్ల ద్వారా కూడా భర్తీ చేసుకుంటున్నాయి. సరైన ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులకు, సరైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు సోషల్ వెబ్సైట్లు కీలకంగా మారాయి. నియామక ప్రక్రియలో ఇలాంటి వైబ్సైట్ల పాత్ర ఒక భాగమే. నియామక ప్రక్రియ నుంచి అభ్యర్థి సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో మాత్రం ఈ వెబ్సైట్ల పాత్ర పరిమితంగానే ఉంటోంది. దాదాపు 80 శాతం వరకూ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సామాజిక మీడియా వెబ్సైట్లను ఉపయోగించుకుంటున్నాయి. ఈ సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ఉద్యోగాలివ్వడమనేది ఫార్చ్యూన్ 500, అంతర్జాతీయ కంపెనీల్లో అధికంగా ఉంది.