breaking news
Kothagudem municipality
-
అ‘పరిష్కృతే’ !
పాల్వంచ: ప్రభుత్వం అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రవేశపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)దరఖాస్తులు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా మున్సిపాలిటీల ఆదాయం గణనీయంగా పెంచుకునేందుకు ఈ స్కీం ఉపయోగ పడుతుంది. జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఇది వర్తించకపోగా, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. వెల్లువలా దరఖాస్తులు.. ఎల్ఆర్ఎస్ స్కీం ద్వారా పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. 2015లో ప్రవేశపెట్టిన ఈ స్కీం గడువు తేదీని ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. చివరిసారిగా గత అక్టోబర్ 30 వరకు కొనసాగించారు. పాల్వంచ మున్సిపాలిటీలో 2700 దరఖాస్తులు రాగా, 1700 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయ్యాయి. మరో 1000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. సర్వే నంబర్ 817లో గత రెండున్నర సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో 500 దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయి. మరికొన్ని సకాలంలో డబ్బు చెల్లించక పరిష్కారం కాలేదని తెలుస్తోంది. కొత్తగూడెం సింగరేణి పరిధిలో ఉన్నప్పటికీ కొంత వరకు ప్రైవేట్ భూములు ఉండడంతో 120 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే ఇందులో 89 పరిష్కారం అయ్యాయి. 13 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించగా, మిగతా 18 పెండింగ్లో ఉన్నాయి. ఇల్లెందు. మణుగూరులో నిల్.. మణుగూరు మున్సిపాలిటీ 1 /70 యాక్ట్లో ఉండటంతో అక్కడ దరఖాస్తులు స్వీకరించలేదు. ఇల్లెందు మున్సిపాలిటీ సింగరేణి కాలరీస్ సంస్థకు చెందిన భూముల పరిధిలో ఉండడంతో అక్కడ కూడా దరఖాస్తుల స్వీకరణకు అనర్హం. దీంతో ఈ రెండు మున్సిపాలిటీల్లో దరఖాస్తులు లేకపోవడంతో ఆదాయం లభించలేదు. పాల్వంచ మున్సిపాలిటీలో ఎల్ఆర్ స్కీం ద్వారా సుమారు రూ.12 కోట్ల వరకు ఆదాయం లభించి ప్రథమ స్థానంలో ఉండగా, కొత్తగూడెంలో రూ.70 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ మున్సిపాలిటీల్లో పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించాలని లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా «సకాలంలో చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. త్వరలోనే పరిష్కరిస్తాం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఎన్నికల పనుల్లో నిమగ్నం కావడంతో కొంత ఆలస్యం అవుతున్నాయి. పాల్వంచకు సుమారు రూ.12కోట్ల వరకు ఆదాయం లభించి ప్రథమ స్థానంలో ఉంది. ఇల్లెందు సింగరేణి, మణుగూరు 1 /70 యాక్ట్ల వల్ల అక్కడ దరఖాస్తులు స్వీకరించే అవకాశం లేదు.--శ్రీనివాస్, టీపీఓ -
కుర్చీపోరు
కొత్తగూడెం, న్యూస్లైన్: కొత్తగూడెం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి విషయంలో ఆ పార్టీ పన్నిన వ్యూహం బెడిసికొట్టేలా ఉంది. చైర్పర్సన్ పదవి కోసం ఈ సారి ఎక్కువ మంది పోటీ పడ్డారు. ఏం చేయాలో పాలుపోని నేతలు కాస్తా తర్వాత దీనికి టెండ‘రింగ్’ పెట్టేందుకు ముందుగా వారిని వార్డుల్లో పోటీకి దింపారు. ప్రధానంగా ముగ్గురు ఆశావహులు బరిలో ఉండటంతో ఇప్పుడు ఆ పార్టీ వ్యూహం కాస్త రివర్స్ అయ్యేలా ఉంది. చైర్పర్సన్గా బరిలోకి దిగిన అభ్యర్థినులు ఎత్తుకు పైఎత్తు వేస్తూ తమ పదవికి అడ్డువచ్చే సొంతపార్టీ అభ్యర్థినులను ఓడించేందుకు సిద్ధమయ్యారని ప్రచారం. కొత్తగూడెం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థినిగా ముగ్గురు పోటీలో ఉన్నారు. తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాసుల ఉమారాణి 31వ వార్డు నుంచి బరిలో నిలిచారు. పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పులి మోహన్రావు కోడలు పులి గీత తొమ్మిదో వార్డు నుంచి, మరో యువ నాయకురాలు, తాజా మాజీ కౌన్సిలర్ తోట దేవీప్రసన్న 15వ వార్డు నుంచి బరిలో నిలిచారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో వీరి మధ్య పోటీ పెరగడం, బేరసారాలకు సైతం దిగడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన కాంగ్రెస్ నియోజకవర్గ పెద్దలు అందరూ పోటీకి దిగండని సలహా ఇచ్చారు. అది కాస్తా ఇప్పుడు నేతలకు తలనొప్పిగా మారింది. ఒకరిపై మరొక్కరి వ్యూహాలు.. ముగ్గురు అభ్యర్థినులు ఆర్థికంగా నిలదొక్కుకున్నవారు కావడంతో సొంతపార్టీలో తమకు చైర్పర్సన్ పదవి దక్కకుండా అడ్డువచ్చే అభ్యర్థినులను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. శత్రుశేషం ఉండకూడదనే భావనతో వ్యూహాలు రూపొందిస్తున్నారని ప్రచారం. ఇందుకు భారీ గానే ఖర్చుచేస్తున్నారని సమాచారం. ఒకేపార్టీకి చెందినా అనూహ్యంగా ప్రత్యర్థులుగా మారా రు. ఈ ముగ్గురు అభ్యర్థినుల మధ్య ఆధిపత్య పోరులో ముగ్గురూ ఓటమి చవిచూస్తే పరిస్థితి ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.