breaking news
Katasani Ramreddy
-
Hyderabad: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్లోని హైటెక్స్లో కాటసాని కుమారుడు శివఓబుల్రెడ్డి వివాహం మేధాశ్రీతో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా, పెళ్లి కుమార్తె మేధాశ్రీ తండ్రి పెద్ది సాయిరెడ్డి హైదరాబాద్లో ప్రముఖ వ్యాపారవేత్త. ఈ వివాహ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చదవండి: (పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు) -
వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం : మంత్రి
సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ శాసనసభ మూడోరోజు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఆదిమూలపు సురేష్ సమాధానమిచ్చారు. కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్తో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాటసాని కోరగా.. కర్నులు జిల్లాలోని శకునాల గ్రామంలో సోలార్ పార్క్ కోసం భూసేకరణ పూర్తయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని చెప్పారు. క్లీనింగ్కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. త్వరలో ఈ విషయంపై చర్చించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. మంత్రుల కమిటీని నియమించాం.. ఎయిడెడ్ కాలేజీల్లోపనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. వారికి కనీసం రూ.20 వేల జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే విషయమై ముఖ్యమంత్రి మంత్రుల కమిటీని నియమించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్టూడెంట్స్, టీచర్స్ నిష్పత్తి కారణంగా నాణ్యతా ప్రమాణాలు తగ్గుతున్నాయని అన్నారు. త్వరలోనే వీటన్నింటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరుస్తామని మంత్రి చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. -
బనగానపల్లే ఎమ్మెల్యేపై మండిపడ్డ కాటసాని రాంరెడ్డి!
కర్నూలు: తన వర్గీయులపై బనగానపల్లే ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ఫిర్యాదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా తిరిగి ఫిర్యాదు చేయడాన్నిఎస్పీ రాఘురామిరెడ్డి దృష్టికి కాటసాని రామిరెడ్డి తీసుకువెళ్లారు. బీసీ జనార్ధనరెడ్డి ఫిర్యాదును పరిశిలీంచి తగిన విచారణ జరిపిస్తామని కాటసానికి ఎస్పీ రఘురామిరెడ్డి హామీ ఇచ్చారు. తను ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టేందుకు యత్నించారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ ఎంఎల్ఏ బీసీ జనార్దనరెడ్డి కర్నూలు జిల్లా బేతంచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. -
కాంగ్రెస్కు కాటసాని రాంరెడ్డి రాజీనామా