breaking news
justice dipak mishra
-
‘స్వలింగ సంపర్కం’ నేరమా? కాదా?
న్యూఢిల్లీ : భారతదేశంలో స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అనే విషయంపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పు చెప్పనుంది. స్వలింగ సంపర్కంపై భారత్లో బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి నిషేధం ఉంది. బ్రిటిష్ వారు 1861లో రూపొందించిన క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(సీఆర్పీసీ) సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు. అయితే, 2013లో స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ సందర్భంగా కొత్త చట్టాలు రూపొందించడం పార్లమెంటు పని అని పేర్కొంది. అప్పటివరకూ స్వలింగ సంపర్కం నేరమేనంటూ తీర్పునిచ్చింది. 2013లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని భావిస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ సోమవారం పేర్కొంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ.. ప్రకృతికి విరుద్ధంగా సంపర్కం జరపడాన్ని నేరంగా పరిగణిస్తున్న సీఆర్పీసీలోని సెక్షన్ 377ను సమీక్షించాలని విస్తృత ధర్మాసనంలోని జడ్జిలను కోరింది. కేవలం లింగ పరమైన కారణాలతో ఓ వ్యక్తి తన జీవితాన్ని భయంతో గడపాలా? అనే ప్రశ్నను బెంచ్ లేవనెత్తింది. ‘ఒకరికి సహజంగా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చ’ని ఈ సందర్భంగా ముగ్గురు జడ్జిల బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం పట్ల ధోరణి మారుతుండటంతో గే సెక్స్ను నేరంగా పరిగణించాలని ప్రభుత్వం కూడా భావించడం లేదని సమాచారం. -
మెమన్ కేసులో తీర్పిచ్చిన జడ్జికి బెదిరింపు
చంపుతామంటూ ఆగంతకుల లేఖ.. జడ్జి ఇంటి వద్ద భద్రత పెంపు న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒకరైన జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో జడ్జి ఇంటి వెనుక ద్వారం గుండా ఆగంతకులు బెదిరింపు లేఖను వదిలివెళ్లారు. జడ్జిని చంపుతామంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు జస్టిస్ మిశ్రా ఇంటి వద్ద పోలీసుబలగాలను పెంచి భద్రత కట్టుదిట్టం చేశారు. అక్కడ పారామిలటరీ బలగాలనూ మోహరించి, మరిన్ని సీసీటీవీలను ఏర్పాటు చేశారు. తనిఖీలూ చేపట్టారు. ఉగ్రవాద నిరోధక భద్రతా బలగాలు కవాతు నిర్వహించాయి. 1993 ముంబై బాంబుదాడుల కేసులో మెమన్కు ఉరిశిక్షను అమలు చేయడం తెలిసిందే. బెదిరింపు లేఖ వదిలివెళ్లే ముందు జస్టిస్ మిశ్రా ఇంటి వద్ద ఆగంతకులు రెక్కీ చేసి ఉంటారని భావిస్తున్నారు. జడ్జి ఇంటి వెనుక దట్టమైన చెట్లు ఉండడంతో ఆగంతకుల ఛాయాచిత్రాలు సీసీటీవీల్లో రికార్డు కాలేదని చెబుతున్నారు. జస్టిస్ మిశ్రాకు గట్టి భద్రత కల్పించాలని సుప్రీం చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు అధికారులను ఆదేశించారు. -
మెమన్ ఉరితీత ఉత్తర్వులిచ్చిన జడ్జికి బెదిరింపు లేఖ