-
క్యాష్ లెస్ అమలులో జిల్లా రికార్డు
విజయవాడ : నగదు రహిత లావాదేవీల నిర్వహణలో భారతదేశం మొత్తం మీద జిల్లా రికార్డు సాధించిందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగదు రహిత లావాదేవీల అమలులో జిల్లా ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకోనుందన్నారు. జిల్లాలో 10,21,977మంది తెల్ల రేషన్కార్డుదారులలో డిసెంబర్లో 4,76,032 కార్డుదారులు నగదు రహితంగా రేషన్ తీసుకున్నారని వివరించారు. జిల్లాలో 46.5శాతం క్యాష్లెస్ లావాదేవీలు జరిపి దేశంలోనే పెద్ద రికార్డు సాధించామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లక్ష కంటే ఎక్కువ క్యాష్లెస్ లావాదేవీలు జరగలేదన్నారు. కృష్ణాజిల్లాలో ఎప్పటినుంచే ఈ–పోస్ అమలులో ఉండటం వల్ల ఇది సాధ్యమైందన్నారు. రేషన్ డీలర్లతో బ్యాంకింగ్ కార్యకలాపాలు జిల్లాలో 993 గ్రామాల్లో 2,161 రేషన్ డీలర్లతో బ్యాంకింగ్ కార్యకలాపాలను జరిపించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వీరిని బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్లుగా మార్పు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 600 మందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. ఈనెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంటులుగా నియమిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. వ్యాపార సంస్థల్లో కూడా పాస్ డివైజర్లు పట్టణాలు, గ్రామాల్లో సైతం ఈ–పాస్ డివైజర్లు అన్ని షాపులలో ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 32వేల షాపులను ఎంపిక చేశామని చెప్పారు. వారిలో రూ. 5 లక్షల వ్యాపారం కంటే అధికంగా లావాదేవీలు జరిపే వ్యాపారులతో వాణిజ్యపన్నుల శాఖాధికారులు, గ్రామాల్లో చిన్నచిన్న వ్యాపారులతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాస్ డివైజర్లు ఏర్పాటు చేయిస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 32 వేల షాపులలో పాస్ డివైజర్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రానున్న 15 రోజుల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు. పోటో జెసీ 17 వీఐజీ 40ఏ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు -
24వ తేదీకి ప్రజాసాధికారిత సర్వే పూర్తి
విజయవాడ : జిల్లాలో ఈ నెల 24వ తేదీ నాటికి నూరుశాతం ప్రజాసాధికార సర్వే పూర్తిచేస్తామని సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనీల్ చంద్ర పునేఠకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ప్రజాసాధికార సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ ఆధికారులతో మంగళవారం ఉదయం అనీల్ చంద్రపునేఠ, సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ రంజిత్ పాషా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న ఇన్చార్జి కలెక్టర్ చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 85 శాతానికి పైగా ప్రజాసాధికార సర్వే పూర్తయిందన్నారు. అర్బన్ ప్రాంతంలో 51కి పైగా పూర్తిచేశామని వివరించారు. ఈ నెల 24వ తేదీ నాటికి నూరుశాతం పూర్తిచేసేలా చర్యలు చేపడ్తామని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థలో 4 లక్షల 36 వేల జనాభాకు 44 శాతం మంది వివరాలు నమోదు చేశామని తెలిపారు. దీనిని మరింత వేగవంతం చేసేందుకు నగరపాలక సంస్థకు అవసరమైన డివైజ్లు, ఎన్యూమరేటర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్తో సమన్వయపరచుకొని నూరుశాతం లక్ష్యం సాధిస్తామన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ డి.కె.బాలాజీ పాల్గొన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement