-
మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో సాక్షి
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బెలారస్లో శనివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం సెమీఫైనల్లో సాక్షి 6–2తో ఎల్మీరా గంబరోవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 7–2తో లైస్ న్యూన్స్ ఒలివీరా (బ్రెజిల్)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మరియానా సస్తిన్ (హంగేరి)తో సాక్షి తలపడుతుంది. -
అమిత్ కుమార్కు రజతం
అంతర్జాతీయ రెజ్లింగ్ యవనికపై మరో భారత రెజ్లర్ మెరిశాడు. లండన్ ఒలింపిక్స్లో సహచరులు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ మెరిస్తే... వారితో కలిసి సాధన చేసే యువ రెజ్లర్ అమిత్ కుమార్ ప్రపంచ చాంపియన్షిప్లో సత్తా చాటాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో ఈ హర్యానా రెజ్లర్ ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో భారత్కు రజత పతకాన్ని అందించాడు. బుడాపెస్ట్ (హంగేరి): అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత యువ రెజ్లర్ అమిత్ కుమార్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో 20 ఏళ్ల అమిత్ రన్నరప్గా నిలిచాడు. ఫైనల్లో ఈ ఆసియా చాంపియన్ అమిత్ 1-2 పాయింట్ల తేడాతో హసన్ ఫర్మాన్ రహీమి (ఇరాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. తొలి రోజున భారత్ నుంచి ముగ్గురు రెజ్లర్లు బరిలోకి దిగగా... అమిత్కు పతకం లభించింది. ఇతర రెజ్లర్లు అరుణ్ కుమార్ (66 కేజీలు), సత్యవర్త్ (96 కేజీలు) నిరాశపరిచారు. అరుణ్ తొలి రౌండ్లో ఓడిపోగా... సత్యవర్త్ రెండో రౌండ్లో పరాజయం పాలయ్యాడు. మొత్తం 34 మంది రెజ్లర్లు పాల్గొన్న 55 కేజీల విభాగంలో అమిత్ ఫైనల్ మినహా మిగతా అన్ని రౌండ్స్లో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. తొలి రౌండ్లో ఈ హర్యానా రెజ్లర్ 10-2తో యాసుహిరో ఇనాబా (జపాన్)పై గెలుపొందగా... రెండో రౌండ్లో 8-0తో జోహైర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమిత్ 6-0తో ఎంజెల్ ఎస్కొబెడో (అమెరికా)ను చిత్తు చేయగా... సెమీఫైనల్లో 8-0తో సెజార్ అక్గుల్ (టర్కీ)ను ఓడించి ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు. 1967 తర్వాత... తాజా ప్రదర్శనతో అమిత్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పతకం నెగ్గిన ఎనిమిదో భారత రెజ్లర్గా గుర్తింపు పొందాడు. 1967లో బిషంబర్ సింగ్ (57 కేజీలు) తర్వాత ఈ మెగా ఈవెంట్లో రజత పతకం సాధించిన తొలి రెజ్లర్గా అమిత్ నిలిచాడు. 2010 ఈవెంట్లో సుశీల్ కుమార్ (66 కేజీలు) స్వర్ణ పతకం సంపాదించగా... 2009 ఈవెంట్లో రమేశ్ కుమార్ (74 కేజీలు), 1961 ఈవెంట్లో ఉదయ్ చంద్ (67 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో 2012 ఈవెంట్లో గీత (55 కేజీలు), బబిత (51 కేజీలు), 2006 ఈవెంట్లో అల్కా తోమర్ (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement