breaking news
international badminton
-
Paris Olympics 2024: ‘హ్యాట్రిక్’పై సింధు గురి
బ్యాడ్మింటన్ను 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో, ఆ తర్వాత 1988 సియోల్ ఒలింపిక్స్లలో ఎగ్జిబిషన్ / డెమాన్్రస్టేషన్ స్పోర్ట్గా ఆడించారు. అంటే పోటీలు జరిపి విజేతలను ప్రకటించినా...ఆ విజయాలను పతకాల జాబితాలో కలపరు. 1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్నుంచి అధికారికంగా బ్యాడ్మింటన్ ఒలింపిక్స్లో భాగమైంది. 1992 నుంచి 2008 వరకు భారత షట్లర్లు పోటీల్లో పాల్గొన్నా...ఈ ఐదు ప్రయత్నాల్లోనూ మనకు ఒక్క పతకం కూడా దక్కలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో చెప్పుకోదగ్గ విజయాలతో అప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్, మధుమిత బిష్త్, పీవీవీ లక్ష్మి, అపర్ణా పొపట్, అనూప్ శ్రీధర్లాంటి ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరడమే అప్పటి వరకు భారత అత్యుత్తమ ప్రదర్శన. వరుసగా మూడు సార్లు... 2012 లండన్ ఒలింపిక్స్లో భారత్ పరిస్థితి మారింది. అప్పటికే వరుస విజయాలు, సూపర్ సిరీస్ టైటిల్స్తో అద్భుత ఫామ్లో ఉన్న సైనా నెహా్వల్ భారత్కు బ్యాడ్మింటన్లో తొలి ఒలింపిక్ పతకాన్ని అందించింది. సెమీ ఫైనల్లో యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిన సైనా...ప్లే ఆఫ్ మ్యాచ్లో గ్జిన్ వాంగ్ (చైనా)పై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మరో వైపు పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ వరకు రాగలిగాడు. నాలుగేళ్ల తిరిగే సరికి షటిల్లో భారత్ పతకం మరింత మెరుగైంది. అంతర్జాతీయ యవనికపై దూసుకొచ్చిన 21 ఏళ్ల యువ తార పూసర్ల వెంకట (పీవీ) సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారత అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. పదునైన ఆటతో ఫైనల్ చేరిన సింధు...తుది పోరులో కరోలినా మరీన్ (స్పెయిన్) చేతిలో ఓడింది. ఈ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ వరకు చేరినా...చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి నిష్క్రమించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. ఈ సారి కూడా సింధునే పతకాన్ని గెలుచుకుంది. సెమీస్లో తై జు (తైపీ) చేతిలో ఓటమిపాలైన సింధు... ప్లే ఆఫ్ పోరులో బింగ్జియావో (చైనా)పై గెలిచి వరుసగా రెండో ఒలింపిక్ పతకాన్ని తన మెడలో వేసుకుంది. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీపై ఆ సమయంలో మంచి అంచనాలే ఉన్నా...దురదృష్టవశాత్తూ వాళ్లు గ్రూప్ దశకే పరిమితమయ్యారు. అనుకూలమైన ‘డ్రా’తో... ఒలింపిక్స్లో భారత్నుంచి వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. సుశీల్ కుమార్ (రెజ్లింగ్), సింధు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వరుసగా మూడో ఒలింపిక్స్లోనూ పతకం గెలిచి ఆల్టైమ్ గ్రేట్గా నిలిచే అవకాశం సింధు ముందుంది. ఊహించినట్లుగానే గ్రూప్ దశలో రెండు సునాయాస మ్యాచ్లు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా 2020లో కాంస్య పోరులో తాను ఓడించిన బింగ్జియావో, చెన్ యు ఫె, మరీన్లను దాటితే ఫైనల్ వరకు వెళ్లగలదు. గత కొంత కాలంగా గొప్ప ఫామ్లో లేకపోయినా...కీలక సమయంలో సత్తా చాటగల నైపుణ్యం సింధు సొంతం. అందుకే ఆమె పతకం గెలవడంపై అంచనాలున్నాయి. పురుషుల డబుల్స్లో కూడా సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టికి మంచి ‘డ్రా’నే లభించింది. గ్రూప్ ‘సి’లో విజేతగా ముందంజ వేస్తే ఈ జోడీకి నాకౌట్లోనూ తమకంటే బలహీన ప్రత్యర్థులే ఎదరు కావచ్చు. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ ఎంత వరకు వెళతాడనేది ఆసక్తికరం. జొనాథన్ క్రిస్టీలాంటి టాప్ ప్లేయర్ను ఓడిస్తే లక్ష్యసేన్ నాకౌట్కు వెళ్లే అవకాశం ఉంది. ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్, ప్రణయ్ ఎదురు కావచ్చు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టో జోడి గ్రూప్ దశను దాటి నాకౌట్కు చేరడం కష్టమే. ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో గత మూడు ఒలింపిక్స్లలో వరుసగా పతకాలు వచ్చాయి. 2012లో సైనా నెహా్వల్ కాంస్యంతో మెరవగా...2016లో పీవీ సింధు రజతం సాధించింది. 2020లోనూ తన జోరును కొనసాగిస్తూ సింధు కాంస్యాన్ని అందుకుంది. –సాక్షి క్రీడా విభాగం -
సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
కౌలాలంపూర్: గతేడాది అద్భుత ఆటతీరుతో ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–10లోనూ స్థానం సంపాదించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంటకు కొత్త ఏడాది కలిసి రాలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో ప్రస్తుత ప్రపంచ 12వ ర్యాంక్ జంట సాతి్వక్–చిరాగ్ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. ప్రపంచ 19వ ర్యాంక్ ద్వయం ఓంగ్ యెవ్ సిన్–తియో ఈ యి 21–15, 18–21, 21–15తో సాత్విక్ –చిరాగ్ జంటకు షాక్ ఇచ్చింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ తొలి గేమ్లో తడబడి రెండో గేమ్లో తేరుకుంది. నిర్ణాయక మూడో గేమ్లో స్కోరు 15–17 వద్ద భారత జంట వరుసగా నాలుగు పాయింట్లు సమరి్పంచుకొని ఓటమిని ఖాయం చేసు కుంది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో శుభాంకర్ (భారత్) 15–21, 15–21తో డారెన్ ల్యూ (మలేసియా) చేతిలో... లక్ష్య సేన్ (భారత్) 21–11, 18– 21, 14–21తో విటింగ్హస్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. నేడు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ల్లో కెంటో మొమోటా (జపాన్)తో కశ్యప్; చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్; వాంగ్చరోయెన్ (థాయ్లాండ్)తో సమీర్ వర్మ; సునెయామ (జపాన్)తో ప్రణయ్; రస్ముస్ జెమ్కె (డెన్మార్క్)తో సాయిప్రణీత్ ఆడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో లియాన్ తాన్ (బెల్జియం)తో సైనా; కొసెత్స్కాయ (రష్యా)తో పీవీ సింధు తలపడతారు. -
మొమోటా మెరిసె...
టోక్యో: రెండేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతూ పట్టుబడి... నిషేధం ఎదుర్కొని... గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో పునరాగమనం చేసిన జపాన్ యువ కెరటం కెంటో మొమోటా జోరు మీదున్నాడు. గత నెలలో పురుషుల సింగిల్స్లో ప్రపంచ చాంపియన్గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి జపాన్ ప్లేయర్గా గుర్తింపు పొందిన 24 ఏళ్ల మొమోటా... తాజాగా స్వదేశంలోనూ సత్తా చాటుకున్నాడు. ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మొమోటా 21–14, 21–11తో ఖోసిత్ ఫెట్ప్రదాబ్ (థాయ్లాండ్)ను ఓడించాడు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఓపెన్లో జపాన్ క్రీడాకారుడికి టైటిల్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21–19, 17–21, 21–11తో మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్)పై గెలిచి టైటిల్ దక్కించుకుంది. -
బ్యాడ్మింటన్కు అరవింద్ భట్ వీడ్కోలు
న్యూఢిల్లీ: జాతీయ మాజీ చాంపియన్, 2014 జర్మన్ ఓపెన్ విజేత అరవింద్ భట్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. త్వరలో కోచ్గా మారేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 36 ఏళ్ల అరవింద్ తెలిపాడు. ‘ఇక బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడను. గత ఆరు నెలలపాటు ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. హైదరాబాద్లోని అకాడమీలో కోచ్గా బాధ్యతలు తీసుకునే ఆలోచన ఉంది’ అని 2008, 2011లో జాతీయ చాంపియన్గా నిలిచిన అరవింద్ పేర్కొన్నాడు. 2002లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అరవింద్ థామస్ కప్లో ఏడుసార్లు, 2010 ఆసియా క్రీడల్లో ఒకసారి, ప్రపంచ చాంపియన్షిప్లో నాలుగుసార్లు బరిలోకి దిగాడు. కోచ్గా మారాలని అనుకుంటున్న అరవింద్ ఇటీవల డచ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్తో కలిసి భారత జట్టుతో ఉన్నాడు.