breaking news
indies
-
ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో 'తెలుగు ఇండీ' సినిమా 'ముత్తయ్య'..
Telugu Indie Film Muthayya To Premiere In UK Asian Film Festival: 'పుష్ప: ది రైజ్', 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ తెలుగు చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా పలు ఇండీ-స్పిరిటెడ్ తెలుగు సినిమాలు సైతం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటున్నాయనేది. ప్రస్తుతం అంతర్జాతీయ సర్క్యూట్లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్న కొత్త 'తెలుగు ఇండీ' చిత్రం 'ముత్తయ్య'. ఈ మూవీ 'యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్'లో ప్రదర్శించేందుకు తాజాగా ఎంపికైంది. మే 9న లండన్లోని రిచ్ మిక్స్లో ప్రీమియర్గా 'ముత్తయ్య' ప్రదర్శించబడనుంది. యూరప్లో సుధీర్ఘకాలం ప్రదర్శించబడుతున్న దక్షిణాసియా చలనచిత్రోత్సవాల్లో 'యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్' ఒకటి. 'ముత్తయ్య' సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను చందమామ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేసింది. ఈ పోస్టర్లో థియేటర్లో వెండితెరను చూస్తూ ఒక పెద్దాయన నిలుచొని ఉండటం మనం చూడొచ్చు. ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో 'కొత్త పోరడు' వెబ్ సిరీస్ ఫేమ్ కె సుధాకర్ రెడ్డి నటించారు. ఆయనతోపాటు అరుణ్ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర వంటి కొత్తవారు కూడా కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ మూవీకి కొత్త డైరెక్టర్ భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్గా దివాకర్ మణి పనిచేశారు. ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్పై బృందా ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా, హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవైట్ లిమిటెడ్కు చెందిన కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పిస్తున్నారు. చదవండి: హాలీవుడ్ మూవీలో ధనుష్ ఫస్ట్ లుక్ ఇదే.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే ? నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. తేలిగ్గా విడిచిపెట్టనంటూ లైవ్లో వార్నింగ్ IT’S NEVER TOO LATE TO DREAM BIG. AND HERE’S ONE SUCH HEARTWARMING STORY. PRESENTING THE FIRST LOOK OF #MUTHAYYA. CONGRATULATIONS TO THE TEAM FOR GETTING SELECTED AT UK ASIAN FILM FESTIVAL. #DREAMBIG @vrindaprasad #BHASKHARMAURYA #DIVAKARMANI @crhemanth @FictionaryEnt pic.twitter.com/VUMHE8dH9L — Kajal Aggarwal (@MsKajalAggarwal) April 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆకట్టుకున్న ‘ఇండీస్ డాగ్ షో’
-
వెస్టిండీస్ క్రికెట్ జట్టు పేరు మారింది..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ క్రికెట్ జట్టు పేరు మారింది. ఇన్నాళ్లూ వెస్టిండీస్కు పర్యాయపదంగా రాసుకున్న ‘విండీస్’ అనే పేరే ఇప్పుడు అధికారికంగా మారింది. అలాగే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఇక నుంచి ‘క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ)’గా వ్యవహరించనున్నారు. తమ 91వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మార్పులు జరిగాయి. సరికొత్త మార్పులతో కొత్త అధ్యాయం లిఖిస్తామని బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా విండీస్ బోర్డు సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్ల రెమ్యునరేషన్ గొడవ జట్టు ఎంపికపై ప్రభావం చూపుతోంది. దీంతో వన్డేల్లో ఆటతీరు నానాటికీ క్షీణించి చివరకు చాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది.