breaking news
Indian Institute of Technology-Guwahati
-
బంకమట్టి రేణువులతో కరోనా పరీక్ష
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిందో లేదో గుర్తించడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–గౌహతి పరిశోధకులు చౌకైన, తేలికైన విధానాన్ని అభివృద్ధి చేశారు. వైరస్ నిర్ధారణకు ఇదొక ప్రత్యామ్నాయం అవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం వారు బంకమట్టి రేణువులు ఉపయోగించారు. కరోనా వైరస్ కలిగిన ఉప్పునీటి ద్రావకంలో ఈ రేణువులు వేగంగా మార్పులకు గురవుతున్నట్లు తేల్చారు. రేణువుల్లోని క్లే–ఎలక్ట్రోలైట్ సిస్టమ్ అవక్షేపణ రేటు మారుతున్నట్లు గుర్తించారు. ఈ మార్పులను బట్టి వైరస్ సోకిందో లేదో సులభంగా గుర్తుపట్టవచ్చని పేర్కొన్నారు. మార్పులేవీ లేకపోతే వైరస్ సోకనట్లే. బాధితుల నుంచి నమూనాలు సేకరించి, ఈ పరీక్ష నిర్వహిస్తే ఫలితంగా త్వరగా తేలిపోతుంది. సార్స్–కోవ్–2ను గుర్తించడానికి ప్రస్తుతం పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) టెస్టు చేస్తున్నారు. దీనికి చాలా సమయం పడుతోంది. అంతేకుండా భారీ యంత్ర పరికరాలు అవసరం. యాంటిజెన్ టెస్టు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ పరీక్షలో కచ్చితత్వం తక్కువే. యాంటీబాడీ టెస్టింగ్కు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని ఐఐటీ–గౌహతి ప్రొఫెసర్ టి.వి.భరత్ చెప్పారు. ప్రయోగశాలలు, నిపుణులు, వనరులు లేనిచోట ఇలాంటి పరీక్షలు చేయలేం కాబట్టి బంకమట్టి రేణువులతో వైరస్ను గుర్తించడం చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని పేర్కొన్నారు. దీంతో కచ్చితమైన ఫలితం లభిస్తుందని వెల్లడించారు. ఈ పరీక్ష కోసం పరిశోధకులు బెంటోనైట్ అనే బంకమట్టి ఉపయోగించారు. ఇందులో విశిష్టమైన రసాయన నిర్మాణం ఉంటుంది. కాలుష్య కారకాలు, భారీ లోహాలను సైతం సులభంగా పీల్చుకోగలదు. బంకమట్టి రేణువులు వైరస్లను గ్రహిస్తాయి. అందుకే వైరస్ల ఉనికిని గుర్తించడానికి బంకమట్టి ఉపయోగించే విధానాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. -
అడ్మిషన్స, జాబ్స్ అలర్ట్స
జామ్ - 2015 ఐఐటీలు, ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, జాయింట్ ఎంఎస్సీ- పీహెచ్డీ తదితర ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ-2015కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతి దరఖాస్తులను కోరుతోంది. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ(జామ్)-2015 కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఎంఎస్సీ(ఐఐఎస్సీ-బెంగళూరు), జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ, ఎంఎస్సీ- పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ. అర్హతలు: 55 శాతం మార్కులతో బయలాజికల్/ అగ్రికల్చరల్/ కెమికల్/ఫిజికల్/లైఫ్ సెన్సైస్/ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 9 వెబ్సైట్: http://www.iitg.ernet.in/jam2015/ ఏఆర్ఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెట్ - 2014 అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2014కు అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు దరఖాస్తులను కోరుతోంది. దీనిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏఆర్ఎస్ మెయిన్స్ ఎగ్జామినేషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు. ఏఆర్ఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెట్ - 2014 అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేది: సెప్టెంబర్ 8 వెబ్సైట్ : www.asrb.org.in పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ హైదరాబాద్లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్’ కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2014 స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31 వెబ్సైట్: www.manage.gov.in భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) కాంట్రాక్టు పద్ధతిలో ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. కాంట్రాక్ట్ ఇంజనీర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అర్హతలు: ప్రథమ శ్రేణిలో ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభా గంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 25 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా చివరి తేది: ఆగస్టు 30 వెబ్సైట్: www.bel-india.com