breaking news
iftekar ahmad
-
Pak Vs SA: టీ20 వరల్డ్కప్లోనే అత్యంత భారీ సిక్సర్..!
టీ20 వరల్డ్కప్-2022లో అత్యంత భారీ సిక్సర్ నమోదైంది. సూపర్-12 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 3) జరిగిన మ్యాచ్లో పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ 106 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే అత్యంత భారీ సిక్సర్గా రికార్డ్ అయ్యింది. ఎంగిడి వేసిన 16వ ఓవర్ నాలుగో బంతిని ఇఫ్తికార్ అహ్మద్.. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని స్టాండ్స్లోకి సాగనంపాడు. ఇఫ్తికార్ ఈ షాట్ ఆడిన విధానాన్ని చూసి బౌలర్ ఎంగిడి అవాక్కయ్యాడు. ఈ షాట్ తర్వాత సిడ్నీ స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియలో వైరలవుతుంది. #PAKvSA #T20WorldCup Iftikhar Ahmed hits the BIGGEST 6️⃣ of T20 World Cup 2022 💥 pic.twitter.com/MRWhl43TkG — MK CHAUDHARY 03 (@LovelyKhateeb) November 3, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభంలోనే వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. టెంబా బవుమా (19 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్సర్), ఎయిడెన్ మార్క్రమ్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగానే ఆడినా ఒకే ఒవర్లో వీరిద్దరూ ఔట్ కావడంతో సఫారీల కష్టాలు అధికమయ్యాయి. ఈ దశలో ఒక్కసారిగా భారీ వర్షం కూడా మొదలుకావడంతో దక్షిణాఫ్రికా మ్యాచ్పై ఆశలు వదులుకుంది. వర్షం మొదలయ్యే సమయానికి ఆ జట్టు స్కోర్ 9 ఓవర్ల తర్వాత 69/4గా ఉంది. సఫారీలు గెలవాలంటే 66 బంతుల్లో 117 పరుగులు చేయాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్ (2), ట్రిస్టన్ స్టబ్స్ (2) క్రీజ్లో ఉన్నారు. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారమయితే దక్షిణాఫ్రికా ఇంకా 15 పరుగులు వెనకపడి ఉంది. ఒకవేళ మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం పాక్నే విజేతగా ప్రకటిస్తారు. వర్షం ఎడతెరిపినివ్వడంతో మళ్లీ మొదలైన మ్యాచ్.. సౌతాఫ్రికా టర్గెట్ ఎంతంటే..? వర్షం ఎడతెరిపినివ్వడంతో పాక్-సౌతాఫ్రికా మ్యాచ్ మళ్లీ మొదలైంది. అయితే మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించి 142 పరుగుల టార్గెట్ను నిర్ధేశించారు. ఇప్పటికే ఆ జట్టు 9 ఓవర్లు ఆడేయడంతో మరో 5 ఓవర్లలో 73 పరుగులు సాధించాల్సి ఉంది. -
ఐఐటీలో చదివి.. 420 కోట్లు దోచేశాడు!
ఐఐటీలో చదివి, ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లాంటి అగ్రగామి సంస్థ నుంచి పట్టభద్రుడై.. అమెరికాలో మంచి ఉద్యోగంలో చేరిన ఓ వ్యక్తి.. ఆ కంపెనీ నుంచి దాదాపు 420 కోట్ల రూపాయలు కొట్టేశాడట! చాలాకాలం పాటు అదే కంపెనీలో వెంచర్ క్యాపిటలిస్టుగా పనిచేసిన ఇఫ్తికార్ అహ్మద్ ఇప్పుడు భారతదేశంలో దాగున్నాడని అనుమానిస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలకు ముందు ఏదో ఒక సమయంలో అమెరికా నుంచి పారిపోయాడని, ఇప్పుడు ఎక్కడున్నదీ తెలియడంలేదని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసీ) వర్గాలు అంటున్నాయి. క్రిమినల్ ఇన్సైడర్ ట్రేడింగుకు పాల్పడిన అహ్మద్, జడ్జి ఉత్తర్వులను ఉల్లంఘించి పారిపోయాడని చెబుతున్నారు. ఓక్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్లో ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న అహ్మద్, తన క్లయింట్లను కోట్లాది డాలర్ల మేర మోసగించినట్లు ఆరోపణలున్నాయి. అతడి స్నేహితుడు అమిత్ కనోడియాతో కలిపి అహ్మద్ను ఏప్రిల్ నెలలో అరెస్టు చేశారు. అతడు దొరికి, నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది.