hevvy rains
-
రెయిన్ అలెర్ట్.. ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి,విశాఖ: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దక్షిణ కొంకణ్, గోవా ఆనుకుని ఈస్ట్ అరేబియా సముద్రంపై అల్పపిడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించింది. దాని ప్రభావంతో దాని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పడే ప్రాంతంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా..ఇవాళ, రేపు ఈ రెండు రోజుల పాటు వాతవరణ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.గడచిన 24 గంటల్లో.. అమరావతి 9, పొదిలి 7, మాచర్ల 6, విశాఖ, మచిలీపట్నం, జంగ మహేశ్వరపురం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆల్ట్రో స్ట్రా టస్ మేఘాల వల్లే భారీ వర్షాలు
హైదరాబాద్: ఆల్ట్రోస్ట్రాటస్ పేరుగల దట్టమైన మేఘాలు ఏర్పడటం వల్లే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఏప్రిల్లో భారీ వర్షాలు కురవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వేసవిలో ఉరుములు, వడగళ్ల వాన కురవడం సాధారణమైనా ఎడతెరిపి లేకుండా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవడం అసాధారణమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు ఒక అల్పపీడన ద్రోణి, లక్ష్యదీప్ నుంచి గుజరాత్ వరకు కర్ణాటక మీదుగా మరో అల్పపీడన ద్రోణి రాష్ట్రాన్ని కమ్ముకున్నాయని అన్నారు. ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాల వల్లనే ఇన్ని రోజులు నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయని... క్యుములోనింబస్ మేఘాల వల్ల కేవలం వర్షం వస్తూ పోతూ మళ్లీ ఎండలు కాస్తూ ఉంటాయని ఆ రెండింటికీ ఇదే తేడా అని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు సాక్షికి చెప్పారు.