breaking news
heart dieseas
-
ప్రతీ హృదయ స్పందనను కాపాడుకుందాం!
ప్రపంచ హృదయ దినోత్సవం (world heart day 2025) సందర్భంగా ఆలివ్ హాస్పటల్ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చింది. WHO ప్రపంచ హృదయ నివేదిక 2023 ప్రకారం 2021లో గుండె సంబంధిత వ్యాధులతో ప్రపంచ వ్యాప్తంగా 20.5 మిలియన్ల మంది మరణాలకు కారణమైందనీ, ఇది మొ త్తంమరణాలలో మూడో వంతుగా ఉందని వెల్లడించింది.ప్రతి హృదయ స్పందనను కాపాడుకోండి. వరల్డ్ హార్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు (CVDలు) 2021లో ప్రపంచవ్యాప్తంగా 20.5 మిలియన్ల మరణాలకు కారణమయ్యాయని అంచనా వేయబడింది, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలలో దాదాపు మూడింట ఒక వంతు. గుండె వ్యాధులు, గుండె పోటు ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొంది .“హృదయాన్ని ఉపయోగించు, హృదయాన్ని తెలుసుకో” అనే బ్యానర్ కింద, ఆలివ్ హాస్పిటల్ వ్యక్తులు, సంఘాలు, ప్రభుత్వ వాటాదారులను నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరుతోంది. గుండె సంబంధిత వ్యాధులపై పోరాటం, పరిస్థితి ముదరకముందే ప్రారంభం కావాలని పిలుపునిచ్చింది.కేవలం గణాంకాలు మాత్ర మే కాదనీ జాగ్రత్త పరిచే హెచ్చరికలనీ ఆలివ్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జహీదుల్లా ఖాన్ తెలిపారు . ఈ వ్యాధి ఎక్కడో ఉండని, మన జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి, సంరక్షణకు అందుబాటులో లేకపోవడం రూపంలోనే ఉంటాయన్నారు. ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా “Use Heart, Know Heart”అనే నినాదంతో, ఆసుపత్రులు, పౌర సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యంతో తక్షణ చర్యలు తీ సుకోవాలని కోరింది . "ఈ డేటా కేవలం సంఖ్యలు మాత్రమే కాదు - ఇది ఒక మేల్కొలుపు పిలుపు. ప్రతి జీవిత దశలో నివారణ మరియు ముందస్తు గుర్తింపును సమగ్రపరచడానికి ఇది మనల్ని ప్రోత్సహించాలి." అని తెలిపింది.ఆలివ్ హాస్పిటల్ గుండె సంబంధిత ఆరోగ్య సంరక్షణకు తగిన కార్యక్రమాలను చేపట్టనుందని ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు , అవగాహన కార్యక్రమాలు, మొబౖల్ యూనిట్లు, స్థానిక క్లినిక్లతో భాగస్వామ్యం లాంటి వంటి కార్యకలాపాలను ప్రకటించింది . ప్రజారోగ్య సంస్థలు ప్రాథమిక హృదయ సంరక్షణ కార్యకలాపాలను విస్తరించాలని, అందరికీ సులభంగా, చవకగా స్క్రీనింగ్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది . గుండెవ్యాధుల భారాన్ని భారాన్ని తగ్గిండచంలో నియంత్రణ చర్యలు, ఆరోగ్యకరమెన జీవనశైలి ప్రారంభ దశలో గుర్తింపు కీలకమని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. జీవనశైలి-మార్పు మద్దతు (పోషకాహారం, వ్యాయామం, ధూమపాన విరమణ) కొనసాగింపును నిర్ధారించాలని ఆసుపత్రి ప్రజారోగ్య అధికారులను కోరుతోంది. -
యంగ్ ఇండియా! ఒక్క బీట్ మిస్ అయినా.. బీ(ట్) కేర్ఫుల్
ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అందునా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తన విశృంఖల ప్రతాపం చూపాక గుండెజబ్బుల కేసులు మరింత ఎక్కువయ్యాయి. అందుకే ప్రతి ఏడాదీ సెప్టెంబరు 29న నిర్వహించే వరల్డ్ హార్ట్ డే తాలూకు థీమ్ ఏమిటంటే... ‘‘ఒక్క స్పందననూ మిస్ కావద్దు’’ (డోంట్ మిస్ ఏ బీట్). దీని అర్థం ఏమిటంటే... ఒక్క గుండె కూడా తన స్పందనలను కోల్పోయే పరిస్థితి రాకూడదనే. గతంలో కనీసం 50, 40లలో కనిపించే ఈ గుండెజబ్బులు ఇప్పుడు ఎందుకిలా యుక్త వయసు లోనే వచ్చేస్తున్నాయో చెప్పే కారణాలూ, వాటిని నివారిస్తూ మన యువతను గుండెజబ్బుల నుంచి రక్షించుకునేందుకు తగిన అవగాహనను కల్పించేందుకే ఈ కథనం.గుండెజబ్బుల తీవ్రతనూ, విస్తృతినీ తెలిపే కొన్ని గణాంకాలను చూద్దాం. ఢీల్లీ, ముంబై, హైదరాబాద్లలోని కొన్ని పెద్ద హాస్పిటల్స్ తాలూకు ఎమర్జెన్సీ కేసులను పరిశీలిస్తే సగానికిపైగా కేసులు... అంటే 50% కేసుల్లో బాధితులు కేవలం 40 ఏళ్లలోపు వాళ్లే. మానసిక ఒత్తిడి, ఎటూ కదలకుండా (శారీరక శ్రమ లేకుండా) ఉండే వృత్తులూ పెరగడంతో గుండె జబ్బులతో బాధపడే యువత కూడా పెరుగుతోంది. అందుకే ఇటీవల కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 ఏళ్ల లోపే అక్యూట్ కరోనరీ సిండ్రోమ్తో బాధపడేవారిపై పరిశోధనల కోసం ఓ అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవలి పరిశీలనల ప్రకారం ప్రతి ఐదు గుండె΄ోటు కేసులను పరిశీలిస్తే అందులో ఒకరు తప్పనిసరిగా 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. గుండెజబ్బుల పరంగా ప్రపంచవ్యాప్తంగా 20 – 30 ఏళ్ల యువతలో ఏడాదికి 2% పెరుగుదల ఉండగా... మన దేశంలో సైతం గుండెజబ్బులకు లోనైన వాళ్లలో 40 ఏళ్ల లోపు వారు కనీసం 25% వరకు ఉండటం మరింతగా బెంబేలెత్తిస్తున్న అంశం. హైబీపీ, హైకొలెస్ట్రాల్ వంటివి యువతలో పెరుగుతుండటమే దీనికి కారణం. దాంతో క్రమంగా, నిశ్శబ్దంగా చాపకింద నీరులా గుండెజబ్బుల కేసులు భారత్లోనూ పెరుగుతున్నాయి.లక్షణాలు... సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండె పోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిపిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పిని గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణంగా భావిస్తుంటారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది.గుండె జబ్బుల పెరుగుదలకు కారణాలు...వయసు పెరుగుతుండటం: ఇది నివారించలేని అంశం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్ అంటారు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 20 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది.కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లాక్’గా వ్యవహరి స్తుంటారు. ఈ ప్లాక్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు/రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లాక్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు) గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.ఆహారపు అలవాట్లు: హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వంటి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు చిన్న వయసులోనే గుండెజబ్బులు / గుండెపోటుకు దారితీసే ముప్పును పెంచుతున్నాయి. మన దేశంలో దిగువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే దేశాల్లో పెరుగుతున్న పట్టణీకరణ / నగరీకరణ కారణంగా అన్ని పోషకాలు ఉండే మంచి ఆహారంతో పోలిస్తే అధిక క్యాలరీలు ఉండే ఆహారం చవగ్గా దొరుకుతుండటంతో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది.తగినంత వ్యాయామం లేకపోవడం : కుదురుగా కూర్చుని చేసే వృత్తులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశమే అయినప్పటికీ... మన దేశ యువతలో కూడా వ్యాయామం లేక΄ోవడమూ, పైగా మన దేశ సాంస్కృతిక, సామాజిక నేపథ్యం కారణంగా మహిళలు, అమ్మాయిల్లో వ్యాయామ సంస్కృతి తక్కువగా ఉండటం కూడా గుండెజబ్బులు / గుండెపోటు ముప్పునకు కారణమవుతోంది.పొగతాగడం : ఇటీవల భారత్, రష్యా, కొన్ని మధ్య ఆసియా దేశాల్లో పొగాకు వినియోగం బాగా పెరుగుతుండటం అథెరోస్కిర్లోసిస్కూ, గుండెపోటుకు మరో ప్రధాన కారణం. 60 ఏళ్ల వ్యక్తులతో పోలిస్తే 40 ఏళ్లలోపు వారికి పొగ దుష్ప్రభావం మరింత ఎక్కువ. అయితే ఏ వయసులోనైనా పొగతాగడం అంతే ప్రమాదకరం అని గుర్తించాలి. స్థూలకాయం కారణంగా : మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. మన జీవనశైలి (లైఫ్ స్టైల్) కారణంగా ఇలా స్థూలకాయం రావడం, పొట్ట దగ్గర కొవ్వు పెరగడం కూడా గుండెజబ్బుల ముప్పును మరింత పెరిగేలా చేస్తోంది. హైబీపీ, డయాబెటిస్ : లైఫ్స్టైల్ జబ్బులైన హైబీపీ, డయాబెటిస్ వంటి అనారోగ్యాల విషయంలో అవగాహన అంతగా లేని మనలాంటి దేశాలలో నియంత్రణలో లేని హైబీపీ, మధుమేహం వంటివి గుండెపోటుకు కారణమవు తున్నాయి.జెండర్ అంశం : ఒక వయసు వరకు మహిళలతో పోలిస్తే గుండెప్లాక్టు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగి΄ోయే వరకు మహిళల్లోని ఈస్ట్రోజెన్ వారికి ఒక రక్షణ కవచంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగాక మహిళలతో పాటు... ఏ జెండర్ వారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు: పై అంశాలకు తోడుగా ఒక సమాజం లోని విద్య, ఆదాయ వనరులు, ఆరోగ్య సంరక్షణకు గల అవకాశాలు, సాంస్కృతిక నేపథ్యాల వంటి అంశాలు కూడా గుండెజబ్బుల కేసులను ప్రభావితం చేస్తుంటాయి. ఫ్యామిలీ హిస్టరీ : మిగతావారితో పోలిస్తే గుండెజబ్బులు / గుండెపోటు లాంటివి వచ్చిన వారి కుటుంబాల తాలూకు కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా గుండెజబ్బుల ముప్పునకు ఒక ప్రధాన కారణం. మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుంపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీనే కీలకాంశ మవుతుంది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్లబ్... డబ్...లయ తప్పొద్దు!నివారణ ఇలా... కార్డియో వాస్క్యులార్ హెల్త్ స్కోరుకు దగ్గరగా ఉండే జీవనశైలి: సాధారణంగా పాశ్చాత్యదేశాల్లో... మరీ ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్దేశించిన కొన్ని జీవనశైలి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటినే ‘లైఫ్ ఎసెన్షియల్స్ 8 (ఎల్ఈ 8); లైఫ్ ఎసెన్షియల్స్ 7 (ఎల్ఈ 7) గా వ్యవహరిస్తుంటారు. అంటే... ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అనుసరించే మార్గదర్శకాలైన... రక్త΄ోటును (హైబీపీని) అదుపులో ఉంచుకోవడం; రక్తంలో చక్కెరమోతాదులనూ, కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడం; ఆరోగ్యకరమైన ఆహారాన్ని,పోషకాహారాన్ని తీసుకోవడం; తగినంత వ్యాయామం చేయడం; ఎత్తుకు తగినంత బరువు ఉండేలా బాడీ మాస్ ఇండెక్స్– (బీఎమ్ఐ)ను మెయింటెయిన్ చేయడంస్మోకింగ్ / నికోటిన్కు దూరంగా ఉండటం; కంటినిండా నిద్రపోవడం... అలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఈ లైఫ్ ఎసెన్షియల్ స్కోరును ఎంతగా పెంచుకుంటే గుండెజబ్బులను అంతగా నివారించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ద్వారా : చాలామందిలో గుండెజబ్బులుగానీ లేదా గుండెపోటుగానీ ఆకస్మికంగా రాకముందే కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ఉదాహరణకు ఛాతీలో ఇబ్బందిగా ఉండటం, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, గుండెదడ (పాల్పిటేషన్) వంటివి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయంలో గుర్తించి డాక్టర్లను సంప్రదించడం వల్ల. స్క్రీనింగ్ పరీక్షలతో : హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మధుమేహంతో బాదపడేవారు తగిన పరీక్షలు చేయించు కోవడం, ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనరీ సీటీ యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెజబ్బులు నివారించవచ్చు. ఇదీ చదవండి:Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లి-డాక్టర్ అంజని,ద్వారంపూడి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
నిశ్శబ్దంగా మృత్యువుకు కారణమయ్యే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్!
డాక్టర్లు చెప్పిన మందులు చెప్పినట్లు వేసుకునేవారు మనదేశంలో తక్కువే ఉంటారు. అమెరికాలో కూడా ఇంతే. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వృద్ధుల్లో దాదాపు 40 శాతం మంది వైద్యులు సూచించిన మందులు వేసుకోరని ‘పాప్యులేషన్ మెడిసిన్’ జర్నల్ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ‘లో డెన్సిటీ లిపో ప్రోటీన్’ క్లుప్తంగా ఎల్డీఎల్ అని పిలిచే ఈ రకమైన కొవ్వు గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. మందులు సక్రమంగా వేసుకోకపోతే ఈ రకమైన కొవ్వులు ఎక్కువవుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో గార పేరుకుపోవడం కూడా పెరిగి పోతుంది. ఇది కాస్తా గుండెజబ్బు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుంది. మందులు సక్రమంగా వేసుకోకపోయేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఒకటైతే.. ‘‘ఆ..ఏమవుతుంది లే’’ అన్న నిర్లక్ష్యం రెండోది. మందులేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న ఆందోళన మూడోది. కానీ... ఎల్డీఎల్ మోతాదులు ఆరోగ్యకరంగా ఉండాలంటే దీర్ఘకాలిక విధానం ఒకటి అవసరమవుతుంది. మందులు నిలిపివేయడం వల్ల కొలెస్ట్రాల్ మళ్లీ పెరిగిపోతుంది. కాబట్టి లక్షణాలు ఉన్నా లేకపోయినా వైద్యులు సూచించినట్లుగా మందులు వేసుకోవడం అవసరం.ఎల్డీఎల్ మోతాదులను నియంత్రించుకోవాల్సిన అవసరం గురించి హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్ క్యాథ్ ల్యాబ్ సీనియర్ కన్సలెట్టంట్, కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి మాట్లాడుతూ "LDLC, లేదా "చెడు" కొలెస్ట్రాల్ నియంత్రణ జీవితాంతం కొనసాగాల్సిన ప్రయత్నం. చాలామంది మేము సురక్షితంగానే ఉన్నామని అనుకుంటారు కానీ.. అలా భావించి మందులు అశ్రద్ధ చేయడం వల్ల గుండెపోటుకు గురైన వారూ ఉన్నారు. కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది రక్తనాళాల్లోపలి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. లక్షణాలు కనిపించవు కానీ నెమ్మదిగా తీవ్రమవుతుంది. అందుకే తరచుగా డాక్టర్ చెకప్లు చేయించుకోవడం అవసరం. దీనివల్ల ఏదైనా మార్పులు ఉంటే ముందుగానే గుర్తించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే వైద్యులు చెప్పినట్లు మందులు కచ్చితంగా సమయానికి తీసుకోవాలి.”హెల్తియన్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక పోల్ ప్రకారం భారతదేశంలో 31 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉన్నారు. హైదరాబాదు జనాభాలో ఈ మోతాదు 27.4% కావడం గమనార్హం. ఇది అథెరోస్కెలరోటిక్ కార్డియో వాస్కులర్ డిసీజ్ (ASCVD) పెరుగుదలను సూచిస్తుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు లక్షణాలేవీ కనిపించవని ముందుగానే చెప్పుకున్నాం. అందుకే దీన్ని నిశ్శబ్ధ కిల్లర్ అని పిలుస్తూంటారు. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే ధమనులకు హాని జరుగుతుంది. క్రమంగా మూసుకుపోతాయి. పరిస్థితి తీవ్రమయ్యే వరకూ ఎవరూ గుర్తించలేరు. ఒకసారి మందులు తీసుకోవడం ఆపివేసినా సూచించిన విధంగా తీసుకోకపోయినా ఎల్డీఎల్ స్థాయులు మళ్లీ పెరగవచ్చు.కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవడానికి జీవనశైలి మార్పులు, సూచించిన మందులు సక్రమంగా తీసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. -
వైద్యం అందించి ఆదుకోండయ్యా..!
నెల్లూరు, కావలి: అనారోగ్యంతో గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఓ పేదవాడికి తనకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని వైద్యులు చెప్పడంతో ఏంచెయ్యాలో దిక్కుతోచలేదు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే రమణయ్య వైద్యం చేయించుకునేందుకు అవసరమైన నగదు లేక అవస్థలు పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు ఆర్థికసాయం చేయగా కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరాడు. అయితే రేషన్కార్డు లేనందున ఆరోగ్యశ్రీ వర్తించదని సదరు ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో అధికారులు ఆదుకోవాలని బాధితుడు వేడుకొంటున్నాడు. వివరాలు.. కావలి నియోజకవర్గంలోని దగదర్తి అరుంధతీయవాడకు చెందిన మందా రమణయ్య అనారోగ్యంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి అతను గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని నిర్ధారించారు. రమణయ్య పరిస్థితిని తెలుసుకొన్న వైఎస్సార్సీపీ దగదర్తి మండల కన్వీనర్ తాళ్లూరు ప్రసాద్నాయుడు నెల్లూరులోని బొల్లినేని హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ రూ.70,000 ఖర్చు కాగా, దానికి సంబంధించిన బిల్లులు ప్రసాద్నాయుడు చెల్లించారు. గుండెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో ఆరోగ్యశ్రీ కింద చేయాలని రమణయ్య కుటుంబసభ్యులు కోరారు. అయితే వారికి రేషన్కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించేందుకు కుదరదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో రమణయ్య కుటుంబసభ్యులు నిరుపేదలమైన తమకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందించాలని కోరారు. కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే తమ ఇంటి పెద్దదిక్కు అయిన రమణయ్యకు వైద్యం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అతని భార్య జయమ్మ, పిల్లలు అధికారులను వేడుకొంటున్నారు. -
వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుంది?
మా అమ్మ వయసు 57 ఏళ్లు. ఈమధ్య పొడిదగ్గు, పడుకుంటే ఆయాసంతో నిద్రలేవడం, గుండె దడ వంటివి వస్తుంటే డాక్టర్ను సంప్రదించాం. హార్ట్వాల్వ్లలో ఏదో సమస్య ఉందని డాక్టర్ గారు అన్నారు. అసలు ఈ వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుందో వివరించి, లక్షణాలు, చికిత్సల వంటి వివరాలను దయచేసి తెలియజేయండి. – యశస్విని, విశాఖపట్నం మీరు చెప్పిన లక్షణాల బట్టి మీ అమ్మగారికి గుండె కవాటాలలో సమస్య (హార్ట్ వాల్వ్ డిసీజ్) ఉందని తెలుస్తోంది. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి... 1) ట్రైకస్పిడ్ వాల్వ్ 2) పల్మనరీ వాల్వ్ 3) మైట్రల్ వాల్వ్ 4)అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు కవాటాలలలో రెండు రకాలు సమస్యలు రావచ్చు. అవి... వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్)తో పాటు వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్). వాల్వ్ సమస్యలకు కారణాలు: కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల, మరికొందరికి ఇవి పుట్టుకతోనే (కంజెనిటల్గా) రావచ్చు. కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజనరేటివ్గా) కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. వాల్వ్ సమస్యతో కనిపించే లక్షణాలు:హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం, పొడి దగ్గు, పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం, గుండె దడ (పాల్పిటేషన్)గా ఈ లక్షణాలు కనిపిస్తాయి. నిస్సత్తువతోనూ ఒక్కోసారి గుండెనొప్పి రావచ్చు. ఈ సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ∙ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీ–గర్జిటేషన్) సమస్యతో కాళ్ల వాపు ∙మైట్రల్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) రక్తపు వాంతులు ∙అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) స్పృహ తప్పవచ్చు. ఇప్పుడు ‘ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్’ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్ను మార్చవచ్చు. వాల్వ్ సమస్యలకు చికిత్స: వీటికి కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మైట్రల్ వాల్వ్ సన్నగా మారడం (స్టెనోసిస్) జరిగితే... రోగులకు బెలూన్ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా గుండె కవాటాలు సన్నగా మారినా లేదా లీక్ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.వాల్వ్స్ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్ను ఉపయోగించవచ్చు. అవి... 1) మెకానికల్ వాల్వ్స్ 2) టిష్యూ వాల్వ్స్.మెకానికల్ వాల్వ్స్ విషయంలో ఒక ప్రతికూలత ఉంది. ఈ రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ వాడాల్సి ఉంటుంది. ’ టిష్యూ వాల్వ్స్ అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్స్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది.ప్రస్తుతం వాల్వ్స్ మార్చడం కన్నా ఉన్న వాల్స్ ఎప్పుడూ మెరుగైనవి కావడంతో గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్స్ రిపేర్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా వాల్వ్స్ను రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలుచబార్చే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. బైపాస్అయింది..జాగ్రత్తలు? ఇటీవలే మా అమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్. శ్రీనాథ్, ఖమ్మం అన్ని కండరాలకు అవసరమైనట్లే గుండెకండరానికి కూడా రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందాలి. కానీ గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడిన వాళ్ల గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దాంతో క్రమంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండెలో అడ్డంకులు పెరిగి గుండెకు తగినంత రక్తం అందే పరిస్థితి లేనప్పుడు, గుండెకండరం చచ్చుపడే ప్రమాదాన్ని నివారిస్తారు. గుండెకు తగినంత రక్తం అందేలా చేయడం కోసం చేసే ఈ శస్త్రచికిత్సలో కాలినుంచి రక్తనాళాన్ని ముందుగా తీసుకుంటారు. దీన్ని ద్వారా గుండెకండరానికి రక్తం అందేలా బైపాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఈ సర్జరీ వాళ్లు మొదటి ఆరు వారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలివి. డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు... పదినిమిషాల పాటు చేయాలి ∙ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు ∙మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవద్దు ∙నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి ∙శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి. ∙భారమైన పనులు చేయకండి ∙డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా చేయండి. శస్త్రచికిత్స అయిన ఆరు వారాల తర్వాత: దీర్ఘకాలంలో గుండెపై కలిగే దుష్ప్రభాలను నివారించడానికి కూడా ఈ జాగ్రత్తలు తోడ్పడతాయి. అవి... ∙కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకు తగినట్లుగా డాక్టర్ల సూచన మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించండి. ∙రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి. ∙రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు ∙సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేయవచ్చు. పైగా ఆ పొగ గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా తగదు ∙మద్యంకూడా గుండెకు హానిచేసేదే ∙ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి ∙ఒకేచోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి. తరచూగుండెదడ...ప్రమాదమా? నా వయసు 45 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపా దడపా ఇలా జరుగుతోంది. దీనివల్ల గుండెకు ఏమైనా ప్రమాదమా? దయచేసి తగిన సలహా ఇవ్వండి.– ఎమ్. అప్పారావు, విజయనగరం సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గుర్తించం. కానీ ఒకవేళ వాటిని స్పష్టంగా గుర్తించడమూ, గ్రహించే స్థితి ఏర్పడితే దాన్ని గుండె దడ అంటారు. గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. భయాందోళనలకు గురైనప్పుడు, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు గుండె అదనపు వేగంతోనూ, శక్తితోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎవరి గుండె స్పందన వాళ్లకు తెలుస్తుంది. ఇలాంటి తాత్కాలికంగా కనిపించి దానంతట అదే సద్దుమణుగుతుంది.అయితే ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంఇంచిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలియక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు.సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కినిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటపుపడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. కొన్ని సాధారణ కారణాలు: గుండె కవాటాలు వ్యాధిగ్రస్తం కావడం, గుండె కండరాలు క్రియాహీనంకావడం జరిగితే గుండెదడ ఉంటుంది. ఛాతీలో వచ్చే నొప్పి, ఆయాసాన్ని నిర్లక్షం చేయకూడదు. శ్వాస అందని సమయాల్లోనూ, కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించినప్పుడు, కళ్లుబైర్లుగమ్మినట్లు అనిపించినప్పుడు ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. సూచనలు: ’ గుండెగడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. కషాయం, చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం, తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు. ∙మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు ∙కాఫీ, టీ, కూల్డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీ మరింత ప్రమాదకరం ∙పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి ∙మానసికంగా నిలకడగా, నిశ్చింతగా ఉండాలి ∙బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది ∙నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి ∙మరీ దడ ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది. డాక్టర్ హేమంత్ కౌకుంట్లకార్డియోథొరాసిక్ సర్జన్ అండ్డైరెక్టర్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ, సెంచరీ హాస్పిటల్,రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గుండెజబ్బుల ముప్పులో శిశువులు
విజయవాడ (లబ్బీపేట) : భారత్లో పుట్టుకతో గుండెలోపాలతో పుడుతున్న చిన్నారులు రోజు రోజుకు పెరుగుతున్నారని ఇంగ్లండ్లో పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుముల అన్నారు. ఆంధ్రా హాస్పటల్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఏపీ, కృష్ణాజిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పిల్లల్లో గుండెలోపాలను గుర్తించడం ఎలా అనే అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఇ) ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సీఎంఈకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 200ల మందికిపైగా పిల్లల వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సదస్సును తొలుత ఏపీ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ పిల్లల్లో గుండెలోపాలు, వాటిని ఎలా గుర్తించాలనే అంశంపై విశ్లేషణాత్మకంగా వివరించారు. ఇంటర్వెన్షనల్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ మిర్జన వెట్కోవిక్ , డాక్టర్ నయన్ షెట్టీ, డాక్టర్ ప్రేమ్సుందర్ వేణుగోపాల్, డాక్టర్ పీవీ రామారావు, డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియో డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


