-
సీమవాసుల గోడు వినరా?
ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటుకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతుండటంతో ఇక రాయలసీమకు న్యాయం జరగదా అనే అనుమానం సీమవాసుల్లో నెలకొంటున్నది. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని రాయలసీమ ప్రత్యేక ఉద్యమం మాటా తరచుగా వినిపిస్తోంది. ఉన్న తెలుగు జాతి ఐక్యంగా సాగేందుకు అనువైన పరిస్థితులను, నమ్మకాన్ని కేవలం ప్రభుత్వమే కాక కొన్ని జిల్లాల కోస్తాంధ్ర సోదరులూ కలిగించాలి. ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సమగ్రంగా, వెనుకబడిన ప్రాంతానికి ప్రయోజనాలు కలిగే విధంగా కొత్త వికేంద్రీకరణ బిల్లును తక్షణమే అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి. వాటితోపాటు ఇతర రాయలసీమ అభివృద్ధి అంశాలపై కూడా అసెంబ్లీ సాక్షిగా విధాన నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ఉప ప్రాంతాలలో మూడు పాలనా వ్యవస్థలు (శాసనసభ, సచివాలయం, న్యాయస్థానం) ఉండేలా తక్షణమే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. ఒక ప్రాంతంలో ఒక ప్రధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తే అనుబంధంగా ఇతర వ్యవస్థలుండాలి. రాయలసీమలో రాజధాని కావాలనే ప్రజల ఆకాంక్షలను కాదని హైకోర్టు ఏర్పాటే అంతిమ ఉద్దేశం అయితే... కర్నూలులో హైకోర్టుతో పాటు సీమలోని వివిధ కేంద్రాలలో ఒక మినీ సెక్రటేరియట్, ఒక సెక్షన్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేలా కొత్త వికేంద్రీకరణ చట్టంలో పేర్కొనాలి. కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో అనుమతించిన ప్రాజెక్టులుగా విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ తదితర కరువుపీడిత ప్రాంత ప్రాజెక్టులతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్దాపురం ప్రాజెక్టులను చేర్చాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్ సెషన్లో నిధులు కేటాయించాలి. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి. తుంగభద్ర సమాంతర కాలువ, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్ట్లు, సిద్దేశ్వరం అలుగు, రాయలసీమ ఎత్తి పోతల పథకం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీని కోరాపుట్–బుందేల్ ఖండ్ తరహాలో రూ. 30 వేల కోట్లతో అమలు చేయాలి. గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలోని ఎయిమ్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీలను రాయలసీమలో నెలకొల్పాలి. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలోని కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పటికే శ్రీశైలంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయ చరిత్ర, పురావస్తుశాఖ క్యాంపస్కే యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్నీ మార్చాలి. రాయలసీమ సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య, కళారంగాల అభివృద్ధికీ, అధ్యయనానికీ ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి. పరిశ్రమల స్థాపనలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలి. రాయలసీమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అదనంగా కర్నూలు జిల్లాలో ఆదోని జిల్లా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాలు ఏర్పాటు చేయాలి. (క్లిక్: ఈ వర్గపు ఆగడాలకు అంతం లేదా?) శ్రీ బాగ్ ఒప్పందం, శ్రీ కృష్ణ కమిటీ, శివరామన్ కమిటీ, జీయన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ తదితర నివేదికలు వికేంద్రీకరణ విషయమై చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకొని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధికి తోడ్పడాలి. (క్లిక్: బాబు బ్రాండ్ రాజకీయాలు) - డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత -
ప్రేమించాలంటూ వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: ప్రేమించమని యువతిని వేధిస్తున్న వ్యక్తిని షీ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా నేరెడుచెర్లకు చెందిన ఓ యువతి (25) ఎల్బీనగర్, మన్సూరాబాద్ రాక్టౌన్కాలనీలో నివాసం ఉంటోంది. ఆ యువతి దిల్సుఖ్నగర్లోని ఓ సంస్థలో మల్టీమీడియాలో శిక్షణ తీసుకుంటోంది. రాక్టౌన్కాలనీకి చెందిన హరినాధ్రెడ్డి (33)కి గతంలోనే వివాహమైంది. శిక్షణ తరగతి క్లాసులకు హాజరవుతున్న యువతిని గత కొన్ని రోజుల నుంచి ప్రేమించమంటూ హరినాధ్రెడ్డి వేధిస్తున్నాడు. దీంతో అతడి వేధింపులు భరించలేని యువతి ఈ విషయాన్ని షీ టీమ్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు షీ టీమ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బుధవారం హరినాధ్రెడ్డిని అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
హోదాకు చంద్రబాబే అడ్డు
అనంతపురం అర్బన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథ్రెడ్డి ధ్వజమెత్తారు. స్వచ్ఛందంగా మంగళవారం జరిగిన బంద్ని కక్షగట్టి మరీ విఫలం చేసేందుకు యత్నించడం ద్వారా చంద్రబాబు తన నైజం, ఉద్దేశం బయటపడిందన్నారు. బుధవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వప్రయోజనాల కోసం ప్రధాని మోదీ ముందు మోకరిల్లి రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఉంచలేదని ఒకసారి, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదని మరోసారి వెంకయ్య నాయుడు చెబుతున్నారని విమర్శించారు. -
సీనియర్ ప్యానెల్ కౌన్సిల్గా హరినాథ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తరఫున ఉమ్మడి హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్ ప్యానెల్ కౌన్సిల్గా ఎన్.హరినాథ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. అలాగే హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా బి.జితేందర్, ఎ.సుమంత్, ఆర్.శ్రీధర్, ఎస్.జనార్దన్గౌడ్లను నియమించారు. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా డి.శోభారాణి, సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో అదనపు ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా కె.హరీశ్రెడ్డి నియమితులయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement