-
జీఎస్టీతో చేనేతపై భారీ దెబ్బ
దశాబ్దాలుగా అస్తవ్యస్థ విధానాల వల్ల కునారిల్లిపోతూ వస్తున్న చేనేతరంగం తాజాగా జీఎస్టీ పన్నుల భారంతో కుదేలవుతోంది. ఒకవైపు మిల్లు రంగం ఉత్పత్తి ఖర్చు తగ్గి, వస్త్రా ల ధరలు తగ్గి చేనేత వస్త్రాల కొనుగోలు పడిపోతున్నది. మరోవైపు ఇన్ని ఏండ్లుగా చేనేత మీద లేని పన్ను భారం ఇప్పుడు జీఎస్టీ రూపంలో పడుతోంది. కత్తిమ నూలు ఉత్పత్తికి, పాలియెస్టర్ వస్త్ర పరిశ్రమకు జీఎస్టీ వల్ల పూర్తిగా ప్రయోజనం సాధ్యపడుతుండగా, సహజ నూలు మీద మాత్రం పన్నులు కట్టాల్సి వస్తుంది. క్లుప్తంగా, జీఎస్టీ వల్ల చేనేత మీద భారం పెరుగు తుంది. జీఎస్టీలో సహజ నూలుకు, చేనేత వస్త్రాలకు మినహాయింపు ఇవ్వకపోతే, చేనేత ఉపాధి పూర్తిగా తగ్గుతుంది. వస్త్ర దిగుమతులు పెరుగుతాయి. పర్యావరణ విధ్వంసం పెరుగుతుంది. దేశీయ జౌళి పరిశ్రమ ప్రమా దంలో పడుతుంది. జీఎస్టీ పైన విస్తత చర్చలు చెయ్యా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న, సన్నకారు రైతులు మరియు చేనేత కార్మిక కుటుంబాల సమస్యలు మరియు పరిష్కారాలు ఇందులో మిళితంచేసి ఒక సమగ్ర విధానం రూపకల్పన చెయ్యాలి. దేశీయ జౌళి రంగంలోని అన్ని ఉప రంగాల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీఎస్టీ వలన భారత జౌళి రంగం స్వరూపం మారిపోతున్నది. చిన్న ఉత్పత్తిదారులు కనుమరుగు అవుతున్నారు. రెండవ దశలో దిగుమతులు మరియు విదేశీ ఉత్పత్తులు పెరిగిపోతాయి. ఈ రెండు దశల క్రమంలో సహజ నూలు ఉత్పత్తులు 60 శాతం దేశ ప్రజలకు అందుబాటులో ఉండవు. ఒక చేనేత కుటుంబం నెలకు ఒక వార్పూ లేదా రెండు వార్పులు నేస్తారు. వీరు జీఎస్టీలో ప్రధానమైన ఇన్ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రారు. వీరు ముడి సరుకులకు (నూలు, రంగులు, రసాయనాలు తదితర) పన్ను కడతారు. వీరి దగ్గర నేసిన వస్త్రాలు తీసుకునే షావు కారు, కాని కమీషన్ ఏజెంట్ కాని, కూడా ఈ పరిధిలోకి రారు. అతి పెద్ద షావుకారు రావచ్చు. సాలీనా, రూ.20 లక్షల వ్యాపారం చేసేవాళ్ళే జీఎస్టీలో నమోదు చేసు కోవాలి. చేనేత కుటుంబాలు, చేనేత ఉత్పత్తిలో అనేక రకా ల ఇతర పనులు చేసేవాళ్ళు జీఎస్టీలోకి రారు. కానీ, పన్ను ల పరిధిలోకి వస్తారు. షావుకారు నమోదు కాని వారి దగ్గ ర కొంటున్నాడు కనుక తానే పన్ను ప్రభుత్వానికి కట్టాలి. వే బిల్లులు లేకుండా సరుకుల రవాణా జరుగకూడదు. వస్త్ర ప్రదర్శనకు తెచ్చిన అన్ని వస్త్రాలకు ‘జీఎస్టీ’ నిబంధనలు వర్తిస్తాయి. వీటన్నింటి వలన నమోదు కాలేని చేనేత కుటుంబాల ఉత్పత్తి తీసుకోవటానికి షావుకారు ఇబ్బంది పడుతున్నారు. ఒక చేనేత కుటుంబం 1 చీరె షావుకారు దగ్గరకు తీసుకుపోతే, దాని విలువ ఒక్కటి రూ.2,500 అనుకుంటే, షావుకారు మొత్తం రూ.2,500 మీద 5 శాతం పన్ను కట్టవలసిందే– ముడి సరుకుల మీద కట్టిన పన్ను తీసివేయలేదు కనుక. షావుకారు దగ్గర కొనుక్కునే హోల్ సేల్ వ్యాపారి సాధారణంగా ఉద్దరకు తీసుకుపోతారు. దీని వలన షావుకారు కట్టే పన్ను తిరిగి రావాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అప్పటివరకు, షావుకారు పెట్టుబడి ధనం ఆగిపోతుంది. ఆ విధంగా రెండు వైపులా పెట్టుబడి అవసరం పెరుగుతుంది. దీని వలన తన వ్యాపార సామర్థ్యం తగ్గిపోతుంది. పని ఇవ్వలేడు. ఇక జీఎస్టీ అధికారుల ఒత్తిడి ఉండనే ఉం టుంది. ఈ తల నొప్పి ఎందుకు అని, నమోదు కాని చేనేత కుటుంబం దగ్గర వస్త్రాలు తీసుకోకపోవటమే ఉత్తమమైన మార్గంగా కనిపిస్తున్నది. జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వలన చేనేత మీద తీవ్ర ప్రభావం కనపడుతున్నది. చేనేత ఉత్పత్తికి అత్యంత ఆవశ్యకమైన చిలపల నూలు ఒక కిలోకు 2016–17లో రూ.240.90 ఉండగా, 2017–18లో రూ.245.92కు పెరి గి, నవంబర్ 2018 నాటికి రూ.270.76 కు చేరుకుంది. ముడి ఉన్ని నూలు ఒక కిలోకు 2016–17లో రూ.750.40 ఉండగా, 2017–18లో రూ.807.72కు పెరిగి, నవంబర్ 2018 నాటికి రూ.1,165.09కు చేరుకుంది. చేనేత ఎగుమతుల మీద కూడా ఈ దుష్ప్రభావం కనపడు తున్నది. 2018–19లో గత ఏడాది తో పోలిస్తే చేనేత ఉత్ప త్తుల ఎగుమతులు 7 శాతం తగ్గాయి. ప్రత్యేకంగా.. ముడి సరుకుల ధరల పెరుగుదల కనిపిస్తున్నది. సహజ నూలు ధరలలో పెరుగుదల కనిపిస్తున్నది. ఉద్దర/అప్పుల మీద ఉత్పత్తి జరుగుతున్నది. జీఎస్టీ వలన 25 శాతం పెట్టుబడి ఆగిపోతుంది. పన్ను ‘అలవాటు’ లేకపోవటంతో కూడా తీవ్ర ఇబ్బందులూ ఏర్పడుతున్నాయి. చేనేత వస్త్రాల ధరల పెరుగుదల 7.7 నుంచి 100 శాతం పెరగడంతో కొనే వారు తగ్గిపోతున్నారు. మార్కెట్ డిమాండ్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. డిమాండులో 2.5 నుంచి 15 శాతం వరకు తగ్గుదల కనిపిస్తున్నది. సామాన్యులకు అందని స్థాయిలో నూలు, చేనేత వస్త్రాల ధరలు అయి నాయి. కొనుగోళ్ళు తగ్గిపోతున్నాయి. చేనేత రిజర్వేషన్ చట్టం అమలు పూర్తిగా ఆగి పోయింది. వస్త్ర ప్రదర్శనలో పాల్గొనడం కష్టంగా మా రింది. ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. జీఎస్టీలో ఉన్న సమ స్యల వల్ల పెట్టుబడి ధనం తగ్గిపోతున్నది. బ్యాంకులు ఎప్పటినుంచో అప్పులు ఇవ్వడం లేదు. జీఎస్టీ అమలుకోసం ఖర్చుల భారం పడుతోంది. ప్రతి నెల పన్ను కట్టడం, దానికోసం కంప్యూ టర్ రిటర్న్ చేయడం, దాని కోసం ఒక వ్యక్తిని నియ మించటం. ఇవన్నీ వెరసి ఖర్చులు పెరుగుతున్నాయి. రవాణాలో వే బిల్లులకు, నమోదు అయిన వాహనం మాత్రమే వాడవలసి రావటం కూడా సమస్యలను పెంచు తున్నాయి. వస్త్ర ప్రదర్శనలలో తీసుకు వచ్చిన మొత్తం సరుకుకు కూడా జీఎస్టీ ప్రామాణికంగా ఉండవలసి రావటం ఒక సమస్య. స్థూలంగా, వస్త్ర ఉత్పత్తిని, వినియోగాన్ని పూర్తి స్థాయిలో, సంపూర్ణంగా మార్చే నూతన ట్యాక్స్ పద్ధతి వల్ల ఉన్న ఉపాధి కోల్పోయి, వినియోగంలో స్వావలంబన కోల్పోయి, స్వతంత్ర జౌళి రంగం ఉనికి కోల్పోయి, విదేశీ ఉత్పత్తుల మీద ఆధారపడే దిశగా భారత వస్త్ర పరిశ్రమ పయనిస్తున్నది. అందుకే, చేనేతపై జీఎస్టి పన్ను గురించి ప్రభుత్వం పునరాలోచించి, విస్తృత చర్చలు జరిపి, అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక ఆమోదయోగ్యమైన విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: డి.నరసింహారెడ్డి, ఆర్థిక రంగ నిపుణులు 90102 05742 -
చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టం చేయండి
► నామమాత్రంగా చర్యలు చేపడితే ► ఆందోళన ఉధృతం చేస్తాం ► చేనేత నాయకుల హెచ్చరిక ధర్మవరం టౌన్ : చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టం చేయూలని చేనేత సంఘాల నాయకులు కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ కమిటీ బృందాన్ని డిమాండ్ చేశారు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ కమిటీ బృందం శుక్రవారం ధర్మవరంలో పర్యటించింది. ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సురేశ్చంద్ర, రీజినల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆదినారాయణ, ఆర్డీడీ కపిలేశ్వరరావు, ఏడీ జగన్నాథశెట్టిల బృందం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో చేనేత నాయకులతో సమావేశమైంది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పవర్లూమ్స్పై చర్యలు తీసుకొని 11రకాల చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి నాయకుల అభిప్రాయూలను తీసుకున్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు, గాంధీ చేనేత సంఘం అధ్యక్షుడు పిట్టా వెంకటస్వామి, ఇతర చేనేత నాయకులు కేంద్ర బృందంతో మాట్లాడారు. మరమగ్గాల వల్ల చేనేత రంగం నిర్వీర్యం అవుతోందన్నారు. 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరమగ్గాల యజమానులతో కుమ్మక్కయ్యూరన్నారు. ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సురేష్ చంద్రకు ఫిర్యాదు చేశారు. అంతేకాక రిజర్వేషన్ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి, కర్ణాటక, తమిళనాడు, జిల్లాలోని ముదిరెడ్డిపల్లి, గోరంట్ల ప్రాంతాలలో మరమగ్గాల్లో ప ట్టు ఉత్పత్తులు తయారు చేస్తున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీంతో అధికారులకు చేనేత నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ మరమగ్గాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ సురేశ్చంద్ర ‘సాక్షి’తో మాట్లాడుతూ మరమగ్గాల్లో పట్టు ఉత్పత్తుల తయారీని ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్లూమ్స్ ఏడీ పవన్కుమార్, డీవో సుబ్బానాయుడు పాల్గొన్నారు. -
చేనేత చట్టానికి సవరణ
ఉభయ రాష్ట్రాల మరమగ్గాల కార్మిక సంక్షేమ పోరాటకమిటీ డిమాండ్ రాష్ట్రపతి మొదలుకుని పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి పయనం దొడ్డబళ్లాపురం : చేనేత రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేయకపోతే కనీసం సవరణ చేసేలా పార్లమెంట్లో చర్చించాలని ఆంధ్ర, కర్ణాటక ప్రాంత మరమగ్గాల కార్మిక సంక్షేమ పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా రాష్ట్రపతి మొదలుకుని పలువురు కేంద్ర మంత్రులను భేటీ అయ్యేందుకు ఈ నెల 8న ఢిల్లీకి వెళ్లనున్నట్లు కమిటీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కె.ఎం.హనుమంతరాయప్ప స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ నేతలు మాట్లాడారు. 30 సంవత్సరాల క్రింత రూపొందించిన చేనేత రిజర్వేషన్ చట్టం ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం అనువైనది కాదని తేల్చి చెప్పారు. అప్పట్లో ఎటు చూసినా చేనేత మగా ్గలు విరివిగా ఉండేవని గుర్తు చేశారు. మారుతున్న కా లానుగుణంగా ప్రస్తుతం మరమగ్గాల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలిపారు. అయితే చేనేత రిజర్వేషన్ చట్టం ప్రకారం నేత వస్త్రాలను మరమగ్గాలపై తయారు చేయరాదన్న నిబంధన ఉందన్నారు. ఈ చట్టాన్ని అవకాశంగా తీసుకుని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు సాగిస్తూ మరమగ్గాల కార్మికులు, యాజమాన్యాల పొట్టగొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక చేనేత మగ్గాలు మూలనపడుతున్నాయని, ఇలాంటి తరుణంలో మరమగ్గాల నిర్వహణకు అనువైన చట్టాన్ని అమలు చేయాలంటూ రాష్ట్రపతితోపాటు, కేంద్ర మంత్రులు సంతోష్కుమార్ గంగ్వార్జీ, అరుణ్జైట్లీ, నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, అనంతకుమార్లను కలిసి విన్నవివంచనున్నట్లు తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో కమిటీ నేతలు సూర్యనారాయణ, సుబ్రహ్మణి, శ్రీనివాస్, ఎం.పి.నాగరాజు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement