GHMC labours
-
'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కార్యాలయం పేర్కొంది. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సాయంత్రంలోగా విధుల్లోకి హాజరుకావాలని వెల్లడించింది. కాంట్రాక్టు కార్మికులు మొండిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని గతంలోనే హామీ ఇచ్చినట్టుఏ సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొంతమంది కార్మిక సంఘాల నేతల ఉచ్చులో పడి సమ్మెకు దిగారని పేర్కొంది. రంజాన్, బోనాలు సమీపిస్తున్న సమయంలో కార్మికులు సమ్మెకు దిగడం సరికాదని తెలియజేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్మీని, పోలీసులను రంగంలోకి దింపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సీఎం కార్యాలయం వెల్లడించింది. -
గ్రేటర్ కార్మికుల వేతనాలు పెంచుతాం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులకు త్వరలోనే వేతనాలు పెంచుతామని, రెగ్యులర్ ఉద్యోగులకు రాష్ట్ర విభజనకు ముందే పీఆర్సీ అమలు, హెల్త్కార్డులు జారీ చేస్తామని మున్సిపల్శాఖ మంత్రి ఎం.మహీధర్రెడ్డి హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ మంగళవారం మంత్రిని ఆయన చాంబర్లో కలిసి జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలను వివరించారు. వీటి పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని గోపాల్ తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల కంటే హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం ఎక్కువైనందున జీహెచ్ంఎసీ కార్మికులకు సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుందని, తద్వారా వేతనాలు పెరుగుతాయని మంత్రి చెప్పారన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరించాల్సిందిగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు.