
'సాయంత్రంలోగా విధులకు హాజరు కావాలి'
జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కార్యాలయం పేర్కొంది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కార్యాలయం పేర్కొంది. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సాయంత్రంలోగా విధుల్లోకి హాజరుకావాలని వెల్లడించింది.
కాంట్రాక్టు కార్మికులు మొండిగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని గతంలోనే హామీ ఇచ్చినట్టుఏ సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొంతమంది కార్మిక సంఘాల నేతల ఉచ్చులో పడి సమ్మెకు దిగారని పేర్కొంది. రంజాన్, బోనాలు సమీపిస్తున్న సమయంలో కార్మికులు సమ్మెకు దిగడం సరికాదని తెలియజేసింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్మీని, పోలీసులను రంగంలోకి దింపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని సీఎం కార్యాలయం వెల్లడించింది.