breaking news
gas cylinder rate
-
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు!
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు, 5 కిలోల ఎఫ్టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ల రేటుకట్ చేస్తున్నట్లు తెలిపాయి. సవరించిన ధరల ప్రకారం చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.30.50 తగ్గించాయి. దిల్లీలోని ధరల శ్రేణి ప్రకారం కొత్త ధర 1764.50గా నిర్ణయించారు. ముంబయిలో రూ.1719గా ధర ఉంటుంది. చెన్నైలో రూ.1930, కోల్కతాలో రూ.1881గా ఉండనుంది. 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ ధరను రూ.7.50కు కట్ చేశారు. అయితే ఈ ధరలను క్రూడ్కంపెనీలు మార్చిలో పెంచిన విషయం తెలిసిందే. మారుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ లభ్యత వంటి పరిస్థితుల కారణంగా తాజాగా రేట్లను కట్ చేస్తున్నట్లు కంపెనీలు తెలిపాయి. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను యథాతథంగానే 14.2 కేజీకు రూ.855గానే ఉంచినట్లు తెలిసింది. ఇటీవలే ఈ ధరను రూ.955 నుంచి రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్కాల్ -
ఏటీఎఫ్ ధర 5 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 4.6 శాతం తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 5,189 తగ్గి రూ. 1,06,156కి దిగి వచ్చింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ (19 కేజీల) ధర రూ. 21 తగ్గి రూ. 1,749కి పరిమితమైంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర యధాప్రకారం రూ. 903 (14.2 కేజీల సిలిండర్)గానే కొనసాగనుంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఈ మేరకు సవరించిన ధరలను శుక్రవారం ప్రకటించాయి. ఏటీఎఫ్ను తగ్గించడం నెలరోజుల్లో ఇది రెండోసారి. నవంబర్ 1న దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ. 6,854) తగ్గింది. అంతకు ముందు జులై 1 నుంచి నాలుగు నెలల వ్యవధిలో రేటు రూ. 29,391 మేర పెరిగింది. తాజాగా రెండు విడతల తగ్గింపుతో అందులో సుమారు మూడో వంతు భారం తగ్గినట్లయింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్దే ఉంటుంది. దీన్ని తగ్గించడంతో ఎయిర్లైన్స్పై భారమూ తగ్గుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. ఇందుకోసం క్రితం నెల అంతర్జాతీయంగా ఉన్న సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించాల్సి ఉన్నప్పటికీ 2022 ఏప్రిల్ 6 నుంచి రికార్డు స్థాయిలో 21 నెలలుగా మార్చడం లేదు. మే 22న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఇందుకు మినహాయింపు. -
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ నవ్వులపాలు!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఘోరంగా తడబడ్డారు. వరంగల్ కేంద్రంలో శుక్రవారం జరిగిన భేటీలో గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంపై విమర్శలు గుప్పించే క్రమంలో.. తప్పు తప్పుగా మాట్లాడారు. దీంతో సొంత నేతల మధ్య నవ్వులపాలయ్యారు. తొలుత.. కాంగ్రెస్ అధికారంలోకి ఏం ఏం చేస్తుందనేది చెబుతూ పోయారాయన. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తే రూ. 5 వేలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆపై నేతలు అప్రమత్తం చేయడంతో.. రూ.500కేనంటూ మాట్లాడారు. ఇక బీజేపీ ప్రభుత్వం రూ. 12, 000 గ్యాస్ సిలిండర్ ఇస్తోందని అనడం.. వెనక నుంచి సరిదిద్దే యత్నం చేశారు. ఒకవైపు కార్యకర్తల గోల మధ్య ప్రసంగం కొనసాగిస్తున్న ఆయన.. అలా తడబడినట్లు అర్థమవుతోంది. కానిస్టేబుల్ అయిన బలరాం నాయక్.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి ఎన్నికయ్యారాయన. మన్మోహన్సింగ్ కేబినెట్లో కేంద్రమంత్రి(సహాయ) గా పని చేశారు కూడా. ఇదీ చదవండి: వరద సాయం.. ఇట్లనేనా ఉండేది రిపోర్ట్? -
సామాన్యుడికి ధరాఘాతం
ఏడాదిలో పదిసార్లు పెరిగిన పెట్రోలు ధరలు.. 14 సార్లు పెరిగిన డీజిల్ ధరల మోతలతో మధ్యతరగతి జీవి విలవిల్లాడిపోయాడు. సన్న బియ్యం రేట్లు చుక్కలు చూపించాయి. వంట నూనెల ధరలు సలసలా కాగి పేదోడి కుంపట్లో నిప్పులు రాజేశాయి. ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 700శాతం పెరిగిన ఎరువుల ధరలు రైతులను కోలుకోలేని విధంగా అప్పుల పాల్జేశాయి. ఏ వస్తువు కొందామన్నా.. షాక్ కొట్టే విధంగా ఉన్న ధరల్ని చూసి ఈ ఏడాది సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా సమ్మె కాలంలో నిత్యావసరాలు చుక్కలు చూపాయి. ధరల నియంత్రణకు నడుం బిగించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై ఏ మాత్రం కనికరం చూపలేదు. చేసేదేమీ లేక చేష్టలుడిగిన ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జిల్లావాసులు మోయలేని భారం మోశారు. ఆర్టీసీ కస్సు ‘బుస్సు’ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రయాణీకులపై చార్జీల రూపంలో అదనపు భారం వేసిన ఆర్టీసీ.. జూన్ నెలలో టోల్ ట్యాక్స్ బాదుడుతో బెంబేలెత్తించింది. ఏడాదికి రూ.75 లక్షల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో భాగంగా ప్రయాణీకులపై మరింత భారాన్ని మోపింది. సమైక్యాంధ్ర ఉద్యమం ముగిశాక, మరోసారి చార్జీలు పెంచి పెరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేసింది. కిలో మీటరుకు 30 నుంచి 50 పైసల వరకు చార్జీలను పెంచి సగటున నెలకు రూ.12 లక్షల అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు రీజియన్ అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. రైతన్నకు ఎరువుల ధరాఘాతం కనీవినీ రీతిలో ఎరువుల ధరలు రైతన్న వెన్ను విరిచాయి. దీంతో పాటు సమైక్య సమ్మె ప్రభావంతో ధరలు ఆకాశాన్నంటాయి. 50 కిలోల యూరియా బస్తా రూ.284కు అమ్మాల్సి ఉంటే, రూ.350 చొప్పున అమ్ముకున్నారు. మిగిలిన ఎరువులు రూ.50 నుంచి రూ.70 వరకు అధిక ధరలకు విక్రయించారు. సుమారు 700 శాతం మేర ఎరువుల ధరలు పెరిగి అన్నదాతలకు అప్పులు మిగిల్చాయి. నియంత్రించాల్సిన అధికార గణం పట్టనట్లు వ్యవహరించడంతో వ్యాపారులు చెప్పిందే రేటు.. అన్నట్లు సాగింది. దీనికి తోడు వరుస తుఫాన్లు చుట్టుముట్టి పెట్టిన పెట్టుబడికి తోడు ఎకరాకు రూ.20 వేల అప్పు మిగిలింది. కరెంటు నిల్లు... బిల్లు ఫుల్లు... గతంలో ఎన్నడూ లేని విధంగా కరెంటు కోతలు చుక్కలు చూపించాయి. లేని కరెంటుకు మూడింతలు కరెంటు బిల్లులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కరెంటు చార్జీలు 60 శాతానికి పైగా పెరిగాయి. జిల్లావాసులపై పెరిగిన కరెంటు బిల్లుల భారమే నెలకు రూ.101.69 కోట్లకు పైగా ఉంది. సర్దుబాటు చార్జీల పేరిట గడిచిన రెండేళ్లకు వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేశారు. నెలకు సర్దుబాటు చార్జీల భారం రూ.30 కోట్లకు పైగా ఉంది. పరిశ్రమలకు మూడురోజుల పాటు పవర్ హాలిడే అమలు చేయడంతో జిల్లాలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పలు రకాల ఉత్పత్తులు నిలిచిపోయాయి. నిత్యావసరాలు ప్రియం.. ఈ ఏడాది సన్న బియ్యం, వంట నూనెలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరిగాయి. సన్న బియ్యం మరింత ప్రియం అయ్యింది. ఏడాది ప్రారంభంలో కేజీ రూ.35-రూ.40 వరకు ఉన్న సన్న బియ్యం సమ్మెకు ముందు రూ.50 కి చేరింది. సమ్మె కాలంలో రూ.60 వరకు పలికింది. వంట నూనెల్లో పామాయిల్ మంటలు మండింది. రూ.75వరకు ధర పలికింది. వేరుశనగ మొన్నటివరకు రూ.110కి చేరింది. నిత్యం అవసరమైన కూరగాయలు, ఆకు కూరలు మధ్యతరగతి వర్గాలకు దడ పుట్టించాయి. టొమాటో మొదట్లో కేజీ రూ.5 ఉన్న ధర ఏకంగా కేజీ రూ.40కి చేరింది. అల్లం అల్లాడించగా, బీన్స్ ధరలు పెరిగాయి. క్యారట్ రూ.12 ఉన్న ధర రూ.26 వరకు పలికింది. రూపాయి ములక్కాయ ధర రూ.పదికి చేరింది. కార్తీక మాసంలో కూర‘గాయాలు’ చేశాయి. గ్యాస్ ‘బండ’ పడింది.. గ్యాస్ సిలిండర్ ధర వినియోగదారుడిని గందరగోళానికి గురి చేసింది. ఆధార్ లింకుతో గ్యాస్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. రాయితీ సిలిండర్ ధర రూ.412 నుంచి రూ.600కి చేరింది. నెలకు వినియోగదారులపై సుమారు రూ.20 కోట్ల భారం పడింది. వంట గ్యాస్కు ఆధార్ లింకేజీతో సిలిండర్కు వినియోగదారులు రూ.1,017 చెల్లించారు. బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన డబ్బు జమ కాకపోవడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. పెట్రో వాత.. డీజిల్ మోత.. పదిసార్లు పెట్రోలు చార్జీలు పెంచి పథ్నాలుగు సార్లు డీజీల్ మోత మోగించిన కేంద్ర ప్రభుత్వ తీరుకు వినియోగదారుడి జీవిత చక్రానికి బ్రేకులు పడ్డాయి. జిల్లాలో 220 పెట్రోలు బంకు ఔట్లెట్లు ఉన్నాయి. రోజుకు డీజిల్ 27 లక్షల లీటర్ల వినియోగం జరుగుతుండగా, పెట్రోలు 9 లక్షల లీటర్ల వినియోగం జరుగుతున్నట్లు అంచనా. పెట్రోలు జనవరిలో రూ.73.20 ఉంటే, ప్రస్తుతం రూ.77.40 వరకు ఉంది. అంటే లీటరుకు రూ.4.20 వరకు పెరిగింది. రోజుకు పెట్రోలు భారం రూ.3.78 లక్షలు పెరిగింది. డీజిల్ జనవరిలో రూ.52.60 ఉంటే ప్రస్తుతం రూ.58.40 ఉంది. లీటరుకు రూ.5.80 వరకు పెరిగింది. రోజుకు జిల్లాలో డీజిల్ భారం రూ.15.66 లక్షల వరకు ఉంది. ఉల్లి లొల్లితో కంట కన్నీరు.. ఉల్లి ధరలతో ప్రభుత్వాలనే గడగడలాడించింది. ఈ ఏడాది అక్టోబరులో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. మహారాష్ట్ర, నాందేడ్, కర్ణాటకలలో పంట తుడిచిపెట్టుకుపోవడం, స్థానికంగా తుపాన్లుతో పంట దెబ్బతినడంతో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు కేజీ రూ.వందకు చేరాయి. సమ్మెకాలంలో రూ.120కి చేరుతుందని ప్రచారం జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా ధర లేక రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పుడు కేజీ రూ.8కి కొంటామని వ్యాపారులు రైతుల వద్ద బేరాలు చేస్తుండటంతో ఉల్లి రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.