breaking news
financial crisis
-
వొడాఫోన్ ఐడియాకి ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పాత ఏజీఆర్ బాకీలను వచ్చే ఆరేళ్ల పాటు ఏటా రూ. 124 కోట్లు చెల్లించేలా వెసులుబాటునిచి్చంది. 2032 మార్చి–2035 మార్చి వరకు ఏటా రూ. 100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పదేళ్లలో రూ. 1,144 కోట్లు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు, 2031–32 నుంచి 2040–41 మధ్య కాలంలో మిగతా బాకీలను కట్టాల్సి ఉంటుంది. ఈ పాత బకాయిని రూ. 87,695 కోట్లకు ఫ్రీజ్ చేసి, చెల్లింపులపై పాక్షికంగా మారటోరియం ఇస్తూ డిసెంబర్ 31న కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
పాక్లో నెక్ట్స్ జరిగేది ఇదేనా?
పాకిస్తాన్ దేశం పైపైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎన్నో సమస్యలు.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశంలో నిరుద్యోగిత రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగిత అధికంగా ఉండటం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాలు లభించక, అనేక మంది యువకులు లేబర్గా, దినసరి కూలీలుగా మారుతున్నారు.పాకిస్తాన్లో జనాభా వేగంగా పెరుగుతుండగా.. దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. పరిశ్రమలు మందగించడం, పెట్టుబడులు తగ్గడం, రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి ఆగిపోయింది. మరోవైపు విద్యా వ్యవస్థ కూడా ఉపాధి అవసరాలకు అనుగుణంగా లేకపోవడం కూడా నిరుద్యోగితకు ప్రధాన కారణంగా మారింది.చదువుకున్న యువత కూడా నైపుణ్య లోపంతో ప్రైవేట్ రంగంలో అవకాశాలు పొందలేకపోతోంది. ఫలితంగా ఆ యువత నిర్మాణ రంగం, వ్యవసాయం, చిన్నచిన్న పనుల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సిన దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థతి వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, వారి జీవన ప్రమాణాన్ని కూడా దిగజారుస్తోంది. ఓవరాల్గా చూస్తే.. పాకిస్తాన్లో పెరుగుతున్న నిరుద్యోగిత యువతను లేబర్గా మారుస్తోంది. ఇది వ్యక్తిగత సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా మారింది. యువతకు సరైన ఉపాధి కల్పించకపోతే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. యువత శక్తిని సద్వినియోగం చేసుకోకుంటే పాకిస్తాన్కు భవిష్యత్తు ప్రశ్నార్థకమే.పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం కేవలం 7 శాతం మాత్రమే యువత నిరుద్యోగులని తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు సుమారు 18 నుంచి 20 శాతం వరకు ఉందని వివిధ ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువతలో నిరుద్యోగిత రేటు 30 శాతం కంటే ఎక్కువగా ఉందని అంచనా. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మందికి పైగా యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నా, అందుకు సరిపడే ఉద్యోగాలు లేవు.అయితే, ఆ దేశ జనాభాలో 64 శాతం యువత ఉండటం ఒకవైపు అవకాశంగా కనిపించినా, ఉపాధి కల్పన లేకపోవడంతో అదే జనాభా భారం గా మారుతోంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక యువత నగరాల వైపు వలసలు వెళ్తున్నారు. ద్రవ్యోల్బణం 25–30 శాతం వరకు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ రుణాల భారం పెరగడం వంటి కారణాలు అక్కడి పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా అనేక కర్మాగారాలు మూతపడగా, ఉద్యోగాల కోత జరిగింది. పరిశ్రమల రంగం జిడిపిలో సుమారు 20 శాతం మాత్రమే వాటా కలిగి ఉండటం, సేవా రంగం కూడా మందగించడం వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు.ఉద్యోగాలు లభించక యువత పెద్ద సంఖ్యలో దినసరి కూలీలు, అసంఘటిత రంగం కార్మికులుగా మారుతున్నారు. ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత ఏదీ ఉండదు. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, అసురక్షిత పరిస్థితుల్లో పని చేయడం.. యువత ఆరోగ్యం.. వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, దేశ భవిష్యత్తునూ అంధకారంలోకి నెడుతోంది.ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు, డిప్లొమాలు పొందుతున్నా, వారిలో చాలామందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవు. సాంకేతిక, వృత్తి విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల చదువుకున్న యువత కూడా చివరకు కూలీ పనులు, డ్రైవింగ్, డెలివరీ, నిర్మాణ రంగం వైపు వెళ్లాల్సి వస్తోంది. దాంతో ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నిరుద్యోగ యువతలో నిరాశ, అసంతృప్తి పెరుగుతోంది. కొందరు యువకులు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది వారి కుటుంబాలపై, సమాజంపై.. చివరకు ఆ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే అక్కడి ప్రభుత్వం తొలుత దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను అమలు చేయాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టప్లకు మద్దతు వంటి చర్యలు అవసరం. అప్పుడే యువత.. వారి విద్యకు తగిన ఉద్యోగాలు పొందగలుగుతారు. -
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ LTCM: లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి. 2025లో, చిరకాల స్నేహితుడు జిమ్ రికార్డ్స్, సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని అడుగుతున్నాడు?, అని రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సంక్షోభానికి మాజీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి సంక్షోభం పెద్దదిగా మారుతుంది, ఎందుకంటే అవి సమస్యను ఎప్పటికీ పరిష్కరించవు. 971లో నిక్సన్ యూఎస్ డాలర్ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు ప్రారంభమైన సమస్య.. 1.6 ట్రిలియన్ డాలర్ల స్టూడెంట్ లోన్ ద్వారా ప్రేరేపితమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..నేను (రాబర్ట్ కియోసాకి) 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా.. ''ధనవంతులు డబ్బు కోసం పని చేయరు'', ''పొదుపు చేసేవారు ఓడిపోతారు''. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం డబ్బును ఆదా చేయడం కాదు. రాబోయే సంక్షోభం నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం.. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం మాత్రమే. ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు.2012లో రిచ్ డాడ్స్ ప్రాఫసీలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రాబోయే సంక్షోభం నుంచి కాపాడుకోండని రాబర్ట్ కియోసాకి తన సుదీర్ఘ ట్వీట్ ముగించారు.In 1998 Wall Street got together and bailed out a hedge fund LTCM: Long Term Capital Management.In 2008 the Cental Banks got together to bail out Wall Street.In 2025, long time friend, Jim Rickards is asking who is going to bail out the Central Banks?In other words each…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 18, 2025 -
అమెరికన్లకు కొత్త కష్టాలు.. లిప్ స్టిక్ ముద్దు.. చెడ్డీలు వద్దు!
దేశంలో .. కాదు కాదు.. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఏం బాలేదు. పెద్ద పెద్ద సంస్థలే వేలల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఉన్న వాళ్ళతో సర్దుకోండి కొత్త స్టాఫ్ను ఇచ్చేది లేదంటున్నాయి. హైక్స్ .. ఇంక్రిమెంట్స్ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు. ఉన్న ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోండి.. అదే పదివేలు అంటూ సూచనలు చేస్తున్నాయి. అమెరికా ఐటీలో వచ్చిన పెనుమార్పు ఆయా రంగాల్లోని పనిచేస్తున్న వాళ్ల జీవితాలనే కాదు మొత్తం అమెరికా జీవితాల్లో పెనుమార్పులు తెచ్చిందట. అసలు పొదుపు.. ప్లానింగ్. డబ్బంటేనే లెక్కలేకుండా జీవించే అమెరికన్లు ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ముందే ఊహించి.. కుటుంబ ఖర్చులను భారీగా తగ్గిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.ఖరీదైన ఆహారం తినడం తగ్గించారట. అంటే లంచ్ టైములో స్టాఫ్తో పాటు అలా వెళ్లి రెస్టారెంట్లో తినే అలవాటున్న వాళ్ళు సైతం ఇప్పుడు ఆ పద్ధతి మానుకుని పద్ధతిగా ఇంటి నుంచి డబ్బా తీసుకువెళ్తున్నారట. బుద్ధిగా ఇంటి భోజనం చేస్తూ.. దిసీజ్ హెల్దీ యూ నో అంటున్నారట. దీంతోబాటు జెంట్స్ కూడా సెలూన్లలో ఖర్చు తక్కువ.. అంటే చావకరకం మసాజులు.. క్రాఫ్ స్టైల్స్ వంటివి కోరుతున్నారు తప్ప అప్పట్లా ఖరీదైన సేవలకు నో అంటున్నారట. అంటే ఓ నాలుగువేల ఖరీదుండే మసాజ్ ఎందుకులే గురూ ఓ. వెయ్యితో ముగించు.. అసలే రోజులు బాలేవు అంటున్నారట. దీంతోబాటు గోళ్ళ సంరక్షణ కు ఎక్కువ ఖర్చు చేయడం ఎందుకని ఏకంగా కృత్రిమ గోళ్లు రకరకాల డిజైన్లలో రెడీమేడ్ కొనుక్కుని పెట్టుకుంటున్నారట. పెడిక్యూర్.. మానిక్యూర్ వంటివి చేయించాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద ఖర్చుతో టూర్లు తగ్గిస్తున్నారు.లిప్ స్టిక్ కొందాం.. చెడ్డీలు వద్దులే ఇదంతా ఒకెత్తు అయితే .. ఆర్థిక మాంద్యం ప్రభావమో.. భయం కారణంగానో కానీ రెండు అంశాల్లో మాత్రం చిత్రమైన తేడా కనిపిస్తోంది. దేశంలో లిప్ స్టిక్ కొనుగోళ్లు భారీగా పెరిగాయట. ఇదే తరుణంలో పురుషుల లో దుస్తులు.. ముఖ్యంగా డ్రాయర్లు కొనుగోళ్లు తగ్గినాయి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖరీదైన సౌందర్య సాధనాలు.. క్రీములు కొనడానికి మహిళలు వెనుకాడుతున్నారు. వేలకువేలు పెట్టి పార్లర్లకు వెళ్ళడానికి ఇష్టపడని మహిళలు.. పోనీ మంచి లిప్ స్టిక్ అయినా కొనుక్కుందాం అని నిర్ణయించుకుని వాటితో సర్దుకుంటున్నారట. అందంగా ఉండాలంటే పార్లర్ కు మాత్రమే వెళ్లాలా ఏంటి వదినా.. ఇదిగో ఈ లిప్ స్టిక్ వేసుకున్నాక నేను చాలా అందంగా ఉన్నానని మీ అన్నయ్యగారు మెచ్చుకున్నారు అంటూ ఒకరికోరు చెప్పుకుంటున్నారట.దీంతో మహిళలు జస్ట్ లిప్ స్టిక్ కొనుక్కుంటో సంతృప్తి చెందుతూ ఖర్చులు తగ్గిస్తున్నారట. అందుకే లిప్ స్టిక్ అమ్మకాలు పదిశాతం పెరిగాయట. మరోవైపు పురుషులు కూడా ప్యాంట్ షర్ట్. వంటివి బావుంటే చాలు లోపల వేసుకునే చెడ్డీలకు అంత ఖర్చు ఎందుకు ఉన్నవాటినే ఏదోలా సర్దుబాటు చేసుకుందాం.. వాటికోసం మళ్ళీ డాలర్లు ఎందుకు తగలెయ్యాలి.. లోపల వేసేది ఎవరు చూస్తారు అంటున్నారట. మొత్తానికి మాంద్యం ప్రభావం చెడ్డీల మీద కూడా పడింది. -సిమ్మాదిరప్పన్న. -
తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భోపాల్లో విషాదం చోటుచేసుకుంది. ఏష్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక యువకుడు తండ్రి తన ఫోన్ రిపేర్ చేయించలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలోని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫోన్ రిపేర్ చేయించలేననని, అలాగే కొత్త ఫోను కొనివ్వలేనని తండ్రి చెప్పాడంతో కుమారుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతితో ఆ తండ్రి కుమిలిపోతున్నాడు.ఏష్బాగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్ ఖాన్(18) బాగ్ ఫర్హత్ అఫజ్ పరిధిలోని ఓకాఫ్ కాలనీలో ఉంటున్నాడు. 12వ తరగతి పాసయిన సయీద్ ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలేజీలో చేరలేదు. నాలుగు రోజులుగా అతని ఫోను చార్జింగ్ కావడంలేదు. దీంతో ఆ ఫోనును రిపేర్ చేయించేందుకు మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అతను ఫోను రిపేరు(Phone repair)కు చాలా ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని అతను తండ్రికి చెప్పాడు. అయితే తండ్రి తన దగ్గర డబ్బులు లేవని, ఆ ఫోనుకు రిపేర్ చేయించలేనని, కొత్తది కొనివ్వలేనని చెప్పడంతో సయీద్ కలత చెందాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సయీద్ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య -
ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు.. స్పందించిన భారత్
మాల్దీవులు భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా ఉండబోతోంది. మాల్దీవులలో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నామని భారత్ తెలిపింది. రుణ సంక్షోభం కారణంగా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాల్దీవులలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ దేశంలో నెలకొన్న పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కూడా జైస్వాల్ ప్రస్తావించారు. మాల్దీవుల ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత్కు ఆదాయ నష్టం జరుగుతున్నదని, ఇది ఆందోళన కలిగించే అంశమని జైస్వాల్ పేర్కొన్నారు.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)మధ్య జరగనున్న చర్చల గురించి జైస్వాల్ మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో కూడిన ఈ ఒప్పందాలను గౌరవించాలని భారత్ భావిస్తున్నదన్నారు. ఫిబ్రవరి 17 నుండి 20 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్- బీజేబీ మధ్య డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇవి సరిహద్దు భద్రతా దళాల మధ్య సయోధ్య పరిస్థితులకు సహకరిస్తాయి. భద్రత, వాణిజ్య మౌలిక సదుపాయాల కల్పనను సులభతరం చేయనున్నాయి.ఇది కూడా చదవండి: నాడు నెలకు 10 వేలు.. నేడు లక్షలు.. సందీప్ జీవితం మారిందిలా..


