breaking news
Envy
-
గింజనే చూస్తే.... గింజవయిపోతావు
‘వాగురయని తెలియక మగ గణములు వచ్చి తగులురీతియున్నది..’’ వాగుర అంటే వల. వల వేసేవాడు వల ఒక్కటే వేయడు. కింద గింజలు వేసి వలేస్తాడు. ఆకలిమీద ఉన్న ప్రాణి కిందున్న గింజలనే చూస్తుంది. రివ్వున వచ్చి వలలో చిక్కుకుని తినేవాడికి అదే గింజయి పోతుంది. తన ఆహారం కోసం వెళ్ళి వేరొకడికి ఆహారమయి పోతుంది. తాను ఏది పొందడానికి వచ్చాడో అది పొందకపోగా వేరొక దానిచేత దానిని పొందబడుతున్నాడు. కారణం – మత్సరం. అప్పటికి నా అంతటి వాడు లేడు.. అని అహంకరించడం. మరొకడిని తక్కువ చేయడం, హేళనచేస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకోవడంలో ఒక చిన్న సంతోషం ఉంది. కానీ నిజానికి అది పతనం చేసే సంతోషం. మృగ గణములు వచ్చి తగులుకున్న రీతిగా నాకు హెచ్చరిక అందట్లేదు. అదే నాకు అప్పటికి సుఖకారణమనిపించి వలకు చిక్కినట్టు నన్ను కట్టిపడేస్తున్నదంటున్నాడు త్యాగయ్య. ఒకసారి పక్షులన్నీ వలలో చిక్కుకుపోయి ఉంటే... అటునుంచి ఒక రుషి వెళ్ళిపోతున్నాడు. రక్షించమని అవి వేడుకున్నాయి. విడిపిస్తాగానీ నేనొక మాట చెబుతా వింటారా...అనడిగితే సరే అన్నాయి. ‘‘గింజలు కనబడగానే వాల రాదు’’. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు మళ్లీ ఇలాటి ఆపద రాదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరో పది రోజుల తరువాత ఆయన మళ్ళీ అటుగా వస్తుంటే...మళ్ళీ అవే పక్షులు వలలో చిక్కుకుని ‘రక్షించమని వేడుకున్నాయి. నా మాట మీరెందుకు వినలేదని ఆయన అడిగాడు. వినకపోవడమేమిటి... మీరు చెప్పినట్లే కదా చేసాం... అన్నాయి...అంటూ ‘గింజలు కనబడగానే వాలరాదు’ అందుకే వెంటేనే వాలలేదు కదా... అన్నాయి... అలాగే వాగ్గేయకారుల కీర్తనలు ఎన్నిసార్లు పాడుకున్నాం, ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చదివాం ... అని కాదు. అది అర్థం కావాలి. అర్థమయితే సుఖం. ఎంత బాగా పాడావు అన్నదానికన్నా... దానిలోని తత్త్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావన్నది కదా ముఖ్యం. తత్త్వం అర్థమయితే అరిషడ్వర్గాలు గురువుగారి అనుగ్రహం వల్ల వెంటనే పోయినట్టే కదా! అప్పుడు ఆయన సద్గురువు. అందుకే కీర్తన చివరన మదమత్సరమను తెరదీయగరాదా... అన్నాడు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ మదం కూడా ఉంటుంది. అది నాకు కదా దక్కాలి... అన్నప్పుడు కామం ఉంది. వాడికే ఎందుకు దక్కాలి ... అన్నప్పుడు క్రోధం ఉంది. నాకు ఉండాలన్నప్పుడు లోభం ఉంది. దీనికంతా కారణ అజ్ఞానం అన్నప్పుడు మోహం ఉంది. అరిషడ్వర్గాలు అక్కడ పుట్టాయి. అందువల్ల తెర అంత దట్టంగా ఉంది.‘నీలో మత్సరమను తెర ఉంది. అది తొలగించుకో’ అని ఆయన అనలేదు. తన మీద పెట్టుకున్నాడు. శంకరభగవత్పాదులు రాసిన శ్లోకాల్లో నాకు అంటూంటారు. అంటే ఆయనకు కాదు. ఆ శ్లోకం ఎవరు చదువుతుంటే వాళ్ళకు–అని. వాళ్ళకు దైవానుగ్రహం కలగాలి. అలాగే త్యాగరాజస్వామి తనకు అన్వయం చేసుకుని చెప్పారు. మత్సరం ... మద మత్సరం... అసూయ వినాశ హేతువు. ఆ తెర తీయమంటున్నాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అసూయోధనులు
మనుషులు నిజంగా పిచ్చి మాలోకాలు. ప్రేమ గుడ్డిదని గుడ్డిగా నమ్మేస్తారు. నిజానికి ప్రేమ కాదు గుడ్డిది, అసూయే అసలు గుడ్డిది. ప్రేమ మైకం కమ్మినవాళ్లకు లోకంమసకమసకగానైనా కనిపిస్తుంది. అదే, అసూయ కమ్మితేనా..? లోకంలో మరేదీ కనిపించదు. అసూయాగ్రస్తులకు లోలోపలే కనిపించని చితిమంట తెగ రగులుతూ ఉంటుంది.వాడుక లేని ఇనుమును తుప్పు కొరికేస్తున్నట్లుగానే, అసూయ మనిషి అంతరాత్మను కొరికేస్తుంది. అసూయకు ఆహారంగా మారిన మనిషి ఇంకేం మిగులుతాడు..? తనకు తానే సర్వ నాశనమవుతాడు. పురాణ పురుషుల్లో సుయోధనుడిని అసూయకు ప్రతీకగా చెప్పుకుంటారు. ఆధునిక సమాజంలోనూ ‘అసుయో’ధనుల సంఖ్య తక్కువేమీ కాదు. సమాజంలో నేరాలూ, ఘోరాలూ ఊరకే జరగవు. మనుషుల్లో అసూయ శ్రుతిమించిన సందర్భాల్లోనే అలాంటివి జరుగుతాయి. అసూయను అదుపులో ఉంచుకుంటే సమాజం ఇంత నేరపూరితంగా మారేది కాదు. సమాజం ఇంత దారుణంగా కలుషితం, నేరపూరితం కాకూడదనే తపనతోనే చాలామంది మహానుభావులు అసూయను విడనాడండర్రా.. అంటూ శక్తివంచన లేకుండా లోకానికి హితబోధలు చేశారు. మహనీయుల మాటలను అంత తేలికగా విని బాగుపడిపోతే, మనం ఆధునిక మానవులం ఎలా అవుతాం..? భర్తృహరిలాంటి మహానుభావుడు ఈర్ష్యాళువులను కాపురుషుల (దుర్మార్గులు) జాబితాలో చేర్చాడంటే, ఇతరుల బాగును చూసి ఓర్వలేని అసూయాపరులు ఎంతటి అనర్థకారులో గుర్తించవచ్చు. ఆత్మవిధ్వంసక లక్షణం.. అసూయ.. ఇతరులను ఇబ్బందిపెట్టే లక్షణం మాత్రమే కాదు, ఆత్మవిధ్వంసక లక్షణం కూడా. అసూయను ఆత్మకు సోకిన పచ్చకామెర్లతో పోలుస్తారు. అసూయ కమ్మిన వాడి కళ్లకు నిజానిజాలు కనిపించవు. అసూయకు అభిజాత్యం కూడా తోడైతేనా.. అలాంటి మనిషికీ, తోక తొక్కిన తాచుకు పెద్దగా తేడా ఉండదు. మహాభారతంలో దుర్యోధనుడు అలాంటి వాడే! పాండవులంటే మొదటి నుంచి అతడికి అసూయ. పాండవుల్లో బలశాలి అయిన భీముడంటే దుర్యోధనుడికి మరీ మంట. పాండవులు పచ్చగా ఉంటే కళ్లలో కారం పోసుకొనేవాడు. భీముడిని అడ్డు తొలగించుకుంటే, తనకు లోకంలో ఎదురే ఉండదనే భ్రమతో అతడిని అంతం చేయడానికి విఫల యత్నాలన్నీ చేస్తాడు. పాండవుల ఐకమత్యం అతడికి అస్సలు నచ్చేది కాదు. అందుకే, వాళ్లందరినీ మూకుమ్మడిగా పరలోకానికి పంపడానికి లక్క ఇంటిని దహనం చేయిస్తాడు. అసూయతో అసలే కన్నూ మిన్నూ కానని దుర్యోధనుడిని అడుగడుగునా రెచ్చగొట్టడానికి శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు తయారవుతారు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు వైభోగాన్ని చూసి దుర్యోధనుడు మరింత రగిలిపోతాడు. మయసభలో తన పాట్లు చూసి నవ్విన ద్రౌపదిపై కక్ష పెంచుకుంటాడు. శకుని పన్నాగం మేరకు మాయజూదంలో ఓడించి, పాండవులను అడవులకు పంపుతాడు. నిండుసభలో ద్రౌపదిని అవమానిస్తాడు. అజ్ఞాతవాసంలో పాండవుల గుట్టు రట్టు చేయాలనుకుని, ఉత్తరగోగ్రహణం తలపెట్టి, అర్జునుడి చేతిలో భంగపడతాడు. శ్రీకృష్ణుడి సంధి రాయబారాన్ని తోసిపుచ్చి, పాండవులకు సూదిమొన మోపినంత నేలనైనా ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామం దుర్యోధనుడి అసూయకు పర్యవసానమే! అసూయతో అడుగడుగునా రగిలిపోయిన దుర్యోధనుడు, అతడి తొంభైతొమ్మిది మంది సోదరులు, అతడికి అండగా వచ్చిన రాజులు, వారి సైన్యాలు యుద్ధంలో దుంపనాశనమవుతాయి. పాండవులపై పెంచుకున్న అసూయ వల్ల తాను నాశనం కావడం తప్ప దుర్యోధనుడు బావుకున్నదేమీ లేదు. ప్రేమ.. పిచ్చి.. జెలసీ.. ‘ప్రేమా.. పిచ్చీ.. ఒకటే..’ అని భానుమతి పాడిన పాట చాలామందికి తెలిసిందే. ప్రేమకు, పిచ్చికి అట్టే తేడాలేదంటారు విజ్ఞులు. ప్రేమ గుడ్డిదని అంటారు. ప్రేమ ముదిరితే పిచ్చి తలకెక్కుతుందని కూడా కొందరు అనుభవజ్ఞులు చెబుతుంటారు. అయితే, ప్రేమ కాదు, అసూయే గుడ్డిది అని నుడివాడు లారెన్స్ డ్యూరెల్ అనే మహానుభావుడు. అసూయ చెందని వాడు ప్రేమించనట్లే లెక్క అని కూడా కొందరు ప్రేమ గురువుల ప్రవచనం. అంటే, ప్రేమకు అసూయకు అవినాభావ సంబంధం ఉందని, ప్రేమ ముదిరితే అసూయగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే, ఇది అర్ధసత్యం. అంటే, కొంత వరకు మాత్రమే నిజం. తోబుట్టువులు పుట్టిన కొత్తలో పసిపిల్లలు వారిపై అసూయ పెంచుకుంటారు. కొత్తగా పుట్టిన వాళ్లపైనే తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపడాన్ని వాళ్లు తట్టుకోలేరు. తల్లిదండ్రులు నెమ్మదిగా నచ్చజెబితే, పరిస్థితిని అర్థం చేసుకుని, తమ ధోరణిని మార్చుకుంటారు. ప్రియుడు లేదా ప్రేయసి మరొకరితో సన్నిహితంగా ఉంటే ప్రేమికులు సహించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ వల్ల జనించిన అభద్రతాభావం అసూయగా పరిణమిస్తుంది. అయితే, ప్రేమ మాత్రమే అసూయకు ఏకైక కారణం కాదు. పొరుగు వారు పచ్చగా ఉంటే కొందరు అనవసరంగా అసూయ పెంచుకుంటారు. ఇలాంటి అసూయకు ప్రేమ ఎంతమాత్రం కారణం కాదు. చదువుల్లో, ఉద్యోగాల్లో తమ తోటివారి విజయాలను జీర్ణించుకోలేక అసూయ పెంచుకునే వారు ఉంటారు. అసూయతో లోలోపలే రగిలిపోయేవాళ్లలో చాలామంది ఏమాత్రం బయటపడరు. వారిలో కొందరు అశాంతి పెంచుకుంటారే తప్ప పెద్దగా విధ్వంసక చర్యలకు దిగరు. అసూయ మోతాదుకు మించి తలకెక్కిన వారు మాత్రం ఊరకే ఉండలేరు. తమ అసూయకు కారణమైన వారికి హాని తలపెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇలాంటి ప్రయత్నాలే ఒక్కోసారి తీవ్రమైన నేరాలకు దారితీస్తాయి. కేవలం అసూయ వల్ల భయంకరమైన నేరాలకు, దారుణమైన ఘోరాలకు పాల్పడిన వారు సుఖప్రదంగా శేషజీవితాన్ని గడిపిన దాఖలాలేవీ చరిత్రలో లేవు. అయితే, అలాంటి నేరాలకు అమాయకులు బలైపోయిన సంఘటనలు మాత్రం కొల్లలుగా కనిపిస్తాయి. - పన్యాల జగన్నాథదాసు అసూయపై అభిమతాలు అసూయ గురించి కొందరు మహానుభావులు అనుభవపూర్వకంగా చెప్పిన సూక్తులను పరిశీలిస్తే, ఈ దుర్గుణానికి గల స్వరూప స్వభావాలు మనకు అవగతం అవుతాయి. అలాంటి సూక్తులు మచ్చుకు కొన్ని: క్యాన్సర్ వ్యాధితో కంటె అసూయ అనే వ్యాధితో మరణించేవారు ఎక్కువ. - జోసెఫ్ పి. కెన్నడీ అసూయాపరులతో ఇతరులకు ఇబ్బంది కలుగడమే కాకుండా, వారిని వారు దగ్ధం చేసుకుంటారు. - విలియం పెన్ {పేమను మించిన గొప్ప ఖ్యాతి లేదు. అసూయను మించిన శిక్ష లేదు. - లోప డి వెగా అసూయా పరులలో పైశాచికత్వం, విచక్షణా రాహిత్యం ఒకేసారి చేరతాయి. - జోహాన్ క్యాస్పర్ ఇవేటర్ ఇనుమును తుప్పు తినేసినట్టుగానే, మనిషిలోని మానవత్వాన్ని అసూయ తినేస్తుంది. - యాంటిస్థిన్స్ దొంగలను ఆకర్షించే కుక్క అరుపు లాంటిది అసూయ. - కార్ల్ క్రాస్ అసూయాపరులు ఇతరులను ప్రేమించలేరు. - సెయింట్ అగస్టిన్ {పేమ కాదు గుడ్డిది, అసూయ అసలైన గుడ్డిది. - లారెన్స్ డ్యూరెల్ అసూయ అనేది మనిషిలోని మంచికి ముడి మీద ముడి వేస్తూనే ఉంటుంది. - హెలెన్ రౌలాండ్ వ్యామోహం శరవేగంగా... అసూయగా, ఒక్కోసారి ద్వేషంగా పరిణమిస్తుంది. - అర్థర్ గోల్డెన్ {పేమ, అసూయ అక్కచెల్లెళ్లు. - రష్యన్ సామెత -
అసూయతో రగిలిపోతా!
‘‘అసూయ, ద్వేషం లాంటివేవీ మాకు లేవని కొంతమంది అంటుంటారు. కానీ, అవి ఉంటేనే మనం పరిపూర్ణమైన మనుషులమవుతాం అని నా అభిప్రాయం. ఇతర తారల్లో ఎవరైనా మంచి ఫిజిక్ మెయిన్టైన్ చేసినా, బాగా నటించినా నాకు అసూయ కలుగుతుంది. ఆ తారల కన్నా నా శరీరాకృతి బాగుండాలనీ, నటనపరంగా విజృంభించాలనీ అనుకుంటాను. అసూయతో రగిలిపోతాను. అదే నన్ను హార్డ్ వర్క్ చేసేలా చేస్తోంది. నా అసూయ వృత్తిపరమైనదే. అంతేగానీ, నాకు వ్యక్తిగతంగా ఎవరి పైనా అసూయా ద్వేషాలు ఉండవు. ఇప్పుడు హిందీ రంగంలో సినిమాకో కొత్త నాయిక పరిచయమవుతున్నారు. దాంతో, పోటీ బలంగా ఉంది. ఇలాంటి బలమైన పోటీని తట్టుకుని నటిగా నిలబడాలంటే అసూయను ఆయుధంగా చేసుకోవాలి. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి సుమా. నా మాటలతో ఎవరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం నేను చెప్పాను. అంతే.’’ అలియా భట్ -
తనకంటే అందంగా ఉందన్న అసూయతో..!