breaking news
Ensuring women
-
వీసీ సజ్జనార్.. డబుల్ భరోసా!
సాక్షి,సిటీబ్యూరో: అత్యాచార బాధితులతో పాటు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న చిన్నారులు, మహిళలు, విద్యార్థినులు, యువతులు.. ఇలా ఎవరైనా సరే వారికి అందించే ‘భరోసా’ సేవలను సైబరాబాద్ పోలీసులు రెట్టింపు చేయనున్నారు. మహిళా బాధితులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా వారికి వైద్య, న్యాయ సహాయంతో పాటు కేసు నమోదు నుంచి నిందితులకు శిక్ష పడే దాకా అన్ని రకాలుగా అండగా ఉంటారు. ఇందుకోసం ప్రస్తుతమున్న రెండు భరోసా కేంద్రాలకు అదనంగా మరో ఐదు కేంద్రాలను అందుబాటులోకి తేవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్నిర్ణయించారు. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో ఆయా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నివేదికను ఇప్పటికే కిందిస్థాయి అధికారులు సిద్ధం చేసి సీపీ సజ్జనార్కు సమర్పించి అందుకు తగిన పనులను వేగవంతం చేశారు. అంతా సజావుగా ఉంటే మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఈ భరోసా కేంద్రాలను అందుబాటులోకితీసుకొచ్చే అవకాశముందని పోలీసు వర్గాలుభావిస్తున్నాయి. ఎక్కడెక్కడ అంటే.. ప్రస్తుతం కొండాపూర్, అల్వాల్లో భరోసా కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా జీడిమెట్ల, పేట్బషీరాబాద్, శంషాబాద్, షాద్నగర్, రాజేంద్రనగర్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా అత్యాచారం, ఇతర లైంగిక వేధింపులు, గృహ హింస, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్స్(పోక్సో) సంబంధిత కేసులు ఈ కేంద్రాల్లో పర్యవేక్షిస్తారు. అందుకు తగిన సిబ్బందిని నియమించుకునే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. భరోసా కేంద్రానికి రాగానే చేసేది.. చిన్నారులు, మహిళలు, విద్యార్థినులు, యువతులు భరోసా కేంద్రానికి ఎవరొచ్చినా ముందు వారి నుంచి ఫిర్యాదు తీసుకుంటారు. తర్వాత వెంటనే కౌన్సెలర్ కేసు నమోదు చేసేందుకు అనుగుణంగా మార్చి ఫిర్యాదును కంప్యూటర్లో రికార్డు చేస్తారు. ఇలా కౌన్సెలర్ నుంచి వచ్చిన రికార్డు ఆధారంగా బాధితురాలిని పోలీసులు విచారిస్తారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రాథమిక విచారణ చేసి ఎఫ్ఐఆర్, ఎన్సీఆర్, డీఐఆర్ నమోదు చేస్తారు. కేసు పరిష్కారమయ్యే దాకా పర్యవేక్షిస్తారు. కోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి తీర్పు వచ్చేవరకు న్యాయ సేవలను ఉచితంగా అందించేందుకు న్యాయ నిపుణులు అందుబాటులో ఉంటారు. వీరు బాధితులతో మాట్లాడి విచారణ సందర్భంగా ఎలాంటి అంశాలు మాట్లాడాలి? ఎవరి వద్దకు వెళ్లాలని సూచిస్తారు. కేసు పూర్తయ్యే వరకు న్యాయ సహాయం అందిస్తారు. కోర్టుకు హాజరు కాలేని పక్షంలో.. అత్యాచార బాధితులు, తీవ్రమైన బాధలు ఎదుర్కొంటున్నవారు పోలీసు స్టేషన్లకు వెళ్లడం, కోర్టు విచారణకు హాజరైనప్పుడు సామాజిక వివక్షను ఎదుర్కొనే అవకాశాముంది. దీం తో పాటు న్యాయస్థానానికి వెళ్లినప్పుడు ప్రత్యర్థులు, నిందితులు బెదిరించే అవకాశాలెక్కువ. దీని దృష్ట్యా కోర్టులో హాజరు కాకుండా భరోసా కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధితులను విచారణ చేసే సౌకర్యం కల్పిస్తారు. ఆధారం లేనివారికి చేయూత కుటుంబ సభ్యుల నుంచి సహకారం లేని, ఎలాంటి ఆధారం లేని బాధితులు, మహిళలకు స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, దాతల సహాయంతో పునరాసం కల్పిస్తారు. బాధితులకు వచ్చిన విద్యతో పాటు వారికి జీవన నైపుణ్యాలు నేర్పించి విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ పేరుతో వారికి సహాయం అందిస్తారు. చిరు వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తి సహాయం చేస్తారు. అత్యాచార బాధితులు, చిత్రహింసలు ఎదుర్కొని పారిపోయి వచ్చిన వారికి వెంటనే వైద్య సేవలు అందించేందుకు బృందం సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ బాధితులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే ప్రాథమిక చికిత్స అందించి వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తారు. ఇందుకోసం భరోసా కేంద్రం వద్ద అంబులెన్స్ను ఉంచుతారు. -
మహిళకు ఆర్థిక సాధికారత అవసరం..
నేటి మహిళకు ఆర్థిక స్వతంత్రం, సాధికారిత అవసరం. ఆధునిక కాలంలో భవిష్యత్ ఆర్థిక భద్రత వైపు వారు దృష్టి సారించాలి. మొదటిజీతం అందిన రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాలి. మహిళలు చాలా మందిలో అద్భుత ప్రతిభా పాటవాలు ఉన్నాయి. అయితే ఆయా అంశాలను వారు తమ సొంత వ్యక్తిగత ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవడంలేదు. ఈ పరిస్థితి మారాలి. మొదటి మదుపు సిప్లో...! తమ కాళ్లపై తాము నిలబడుతూ, ఆర్థిక భరోసా పొందే క్రమంలో మహిళ మొదటిగా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే క్రమానుగత పెట్టుబడుల ప్రణాళికలపై (సిప్) దృష్టి పెడితే బాగుంటుంది. దీర్ఘకాలంలో మదుపు ప్రయోజనాన్ని భారీగా అందించడానికి దోహదపడే పథకాలివి. కొద్ది మొత్తాల్లో మదుపు దీర్ఘకాలంలో మంచి ఆర్థిక లబ్ధిని సిప్ స్కీమ్లు చేకూర్చుతాయి. మార్కెట్ భారీ ఒడిదుడుకుల ప్రభావం అంత భారీగా సిప్లపై ఉండదు. లక్ష్యాలు అవసరం ఆర్థిక భద్రత భరోసా పొందే క్రమంలో మహిళ తొలుత తన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరం. అది బిడ్డ చదువు విషయంలో భవిష్యత్ వ్యయానికి సంబంధించినది కావచ్చు. లేదా హాలిడే ట్రిప్కు ఉద్దేశించినది కావచ్చు. ఆయా అంశాలను, వ్యయాలను మదింపుచేసుకుని, అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోడానికి ముందునుంచే ఆలోచించాలి. విద్య వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించనదైతే ఈక్విటీ ఫండ్స్లో మదుపు బెస్ట్. ఇప్పటి నుంచీ రెండేళ్లలో ఏదైనా విహారయాత్రకు ప్రణాళిక వేసుకుంటే... స్వల్పకాలిక డెట్ ఫండ్స్ తగిన ప్రయోజనాన్ని చేకూర్చే వీలుంది. ఇలా ఎన్ని లక్ష్యాలున్నా.... సంపదలో కొంత మొత్తాలను వేర్వేరుగా ఆయా లక్ష్యాలకు కేటాయించడం సముచితం. సలహాలూ తీసుకోవాలి... ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి చక్కటి ప్రయోజనాలు పొందడానికి నిపుణుల సలహాలూ కీలకమే. సంపాదన మొత్తం, లక్ష్యాలు, జీవిత భద్రత, ఆర్థికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాధి అంశాలన్నింటినీ ఒక పేపర్మీద ఉంచుకుని తగిన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రణాళికల రూపకల్పన విషయంలో అవసరమైతే నిపుణుల సలహాలనూ మహిళలు తీసుకోవాలి. మదుపు అంశాల విషయంలో నిపుణుల సలహాలు కీలకం.