breaking news
Elimination of the disease
-
హెచ్ఐవీ ఇక పరారే, కొత్త టెక్నాలజీ..!
ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV). తాజాగా ఈ మహమ్మారి నివారణ విషయంలో గుడ్ న్యూస్ అందింది. ఇకపై హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని హైఐవీ వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు. డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో ఈ పరిశోధనను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతంఉపయోగించే మందులు వైరస్ దాడిని ఆపగలవు కానీ పూర్తిగా నివారించలేవు దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. బీబీసీ నివేదిక ప్రకారం ఆమ్స్టర్డ్యామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం, నోబెల్ బహుమతి పొందిన క్రిస్పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్ఐవీని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు. మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవీ సోకిన కణాల డీఎన్ఏను తొలగింగచలిగారు. తొలుత ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి "చెడు" భాగాన్ని తొలగిస్తుంది. ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఈ CRISPR సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని నాటింగ్హామ్ విశ్వ విద్యాలయంలో స్టెమ్ సెల్, జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ డిక్సన్ తెలిపారు. క్రిస్పర్-ఆధారిత చికిత్సలో చాలా సవాళ్లు ఉన్నాయనీ, ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు అన్నారు లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లోని వైరస్ నిపుణుడు డా. జోనాథన్ స్టోయ్, హెచ్ఐవికి చికిత్స చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది రెట్రోవైరస్. ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటు వ్యాధి. జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుంది. ఈ మందులను నిలిపి వేస్తే డీఎన్ఏలో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది. ప్రాణాంతకం కూడా. -
ధనుర్వాతాన్ని తరిమేశాం
‘గ్లోబల్ కాల్ టు యాక్షన్’ సదస్సులో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: దేశం నుంచి ధనుర్వాతాన్ని పూర్తిగా నిర్మూలించామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న గడువు ఈ ఏడాది 2015 కాగా, అంతకుముందుగానే భారత్ లక్ష్యాన్ని చేరుకుందని ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో ఆరోగ్య రంగంలో మరిన్ని లక్ష్యాలు సాధిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో వెనుకబడిన 184 జిల్లాలను గుర్తించామని, ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గురువారమిక్కడ జరిగిన ‘గ్లోబల్ కాల్ టు యాక్షన్’ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. 24 దేశాల నుంచి సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రసవ సమయంలో చిన్నారులకు, తల్లులకు వచ్చే ధనుర్వాతాన్ని పూర్తిగా నిర్మూలించాం. ప్రపంచ దేశాలు విధించుకున్న గడువుకు ముందే ఈ లక్ష్యాన్ని చేరుకున్నాం.’ అని మోదీ చెప్పారు. ఆరోగ్యం విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో కాస్త వెనుకబడిన 184 జిల్లాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక పథకాలతో పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వ్యాక్సిన్తో నిరోధించగల వ్యాధితో దేశంలో ఒక్క చిన్నారి కూడా చనిపోకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని స్పష్టంచేశారు.