breaking news
Department Electrical
-
‘ఈఎంసీ’లకు రూ. 340 కోట్ల కేంద్ర సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)లో కామన్ ఫెసిలిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీవర్క్స్లో ఏర్పాటు చేసే క్లస్టర్కయ్యే వ్యయం రూ. 104.63 కోట్లుకాగా అందులో రూ. 75 కోట్లను గ్రాంట్–ఇన్–ఎయిడ్గా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ క్లస్టర్కు ఈ నెల 4న కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అలాగే మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రం త్వరలో అనుమతిస్తుందని... క్లస్టర్ మంజూరు చేయాలని తాము సిఫారసు చేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రధాన సమాచార ప్రతినిధి స్పష్టం చేశారు. ఐటీఐఆర్, ఎల్రక్టానిక్ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందనగా కేంద్రం ఈ వివరాలు ఇచ్చింది. దివిటిపల్లిలో రూ. 568.9 కోట్లతో ప్రతిపాదించిన ఈఎంసీకి రూ. 264.6 కోట్లను గ్రాంటుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ రెండింటిని ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ 2.0 కింద మంజూరు చేసినట్లు పేర్కొంది. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రతిపాదనలు పంపలేదు.. ఏపీ విభజన హామీగా తెలంగాణకు ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ఏర్పాటు హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే ఐటీఐఆర్పై 2016లో సమావేశం జరిగిందని... ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం మరిన్ని వివరాలు ఇవ్వలేదని ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో కేంద్రం స్పష్టం చేసింది. 2013 నవంబర్ 13న ఐటీఐఆర్ క్లస్టర్ను నోటిఫై చేశారని, ఈ క్లస్టర్లో రైల్వే, ఉపరితల రవాణా, కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివర నివేదిక ఇవ్వాల్సి ఉందని, కానీ తదుపరి డీపీఆర్లు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఐటీఐఆర్పై 2016లో ఒకసారి, 2017లో మరోసారి సమావేశం జరిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి తదుపరి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో తాము ఆమోదించలేకపోయామని ఆ సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది. 2017లో ఐటీఐఆర్ పాలసీ, కేంద్ర పారిశ్రామిక అభివృద్ధి పాలసీపై సమీక్షించగా ఐటీఐఆర్లో ఉన్నవే కేంద్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఉన్నందున ఐటీఐఆర్లను పక్కనపెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఐటీఐఆర్ ఇవ్వకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోరుతూ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి నుంచి 2021 జనవరి 7న లేఖ అందిందని, అప్పటికే హైదరాబాద్, మహేశ్వరంలో ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లకు అనుమతిచ్చామని తెలియజేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఐటీఐఆర్తో సంబంధం లేకుండా ఈఎంసీ 2.0 కింద తాజాగా రెండు క్లస్టర్లను మంజూరు చేశామని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందిస్తూ బదులిచ్చింది. -
విద్యుత్ శాఖకు హెలెన్ షాక్
సాక్షి, రాజమండ్రి :హెలెన్ తుపాను కోనసీమలో విద్యుత్ వ్యవస్థను కకావికలం చేసింది. గత నెలలో భారీ వర్షాలు జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.1.13 కోట్ల మేర నష్టాన్ని కలుగజేయగా, ప్రస్తుతం హెలెన్ మరో రూ.కోటి మేర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో ఎక్కువగా కోనసీమలో నష్టం వాటిల్లింది. గ్రామాల్లో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వందల కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు కుప్పకూలిన చెట్లలో చిక్కుకున్నాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించినా.. మరో 48 గంటలు దాటితే మినహా కోనసీమ పల్లెల్లో కరెంటు దీపాలు వెలిగే అవకాశం కనిపించడం లేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి అంధకారం అలుముకుంది. శుక్రవారం నాటికి నగరాలు, పట్టణాలకు అధికార యంత్రాంగం విద్యుత్ సరఫరా చేసింది. శనివారం ఉదయం నాటికి వీటిలో సుమారు రెండు లక్షల సర్వీసులకు కరెంటు సమస్య కొనసాగింది. సాయంత్రం వరకూ లక్ష వరకు సర్వీసులను పునరుద్ధరించగలిగారు. కాగా కోనసీమలో 250 గ్రామాల్లో ఇంకా లక్ష సర్వీసులకు విద్యుత్ సరఫరా లేదు. వీటి పునరుద్ధరణకు మరో 48 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నష్టం తీరు ఇలా.. జిల్లాలో 19 సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 33/11 కేవీ స్తంభాలు 11 నేలకూలాయి. శనివారం సాయంత్రానికి 90 శా తం చక్కదిద్దారు. 15.47 కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ విద్యుత్ పంపిణీ చేసే 559 స్తంభాలు నేలకూలాయి. వీటిని పునరుద్ధరించే చర్యలు వేగవంతం చేశామని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ వైఎల్ఎన్ ప్రసాద్ తెలిపారు. 200 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఎల్టీ సరఫరా స్తంభాలు కూలిపోగా, వాటిని సరిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముం దుగా 11 కేవీ లైన్లు పునరుద్ధరణ పూర్తయితే కానీ గృహ వినియోగ పంపిణీని సరిచేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు తదితర పరికరాలకు వాటిల్లిన నష్టం రూ.88 లక్షలు కాగా, మరో రూ.12 లక్షల మేరకు పంపిణీ పరికరాలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.