-
Maharashtra Political Crisis: ముదురు పాకాన...
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి సారథి శివసేనలో ఇంటి పోరు మరింత ముదురుతోంది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో రాష్ట్రంలో మంగళవారం మొదలైన రాజకీయ సంక్షోభం నానా మలుపులు తిరుగుతోంది. షిండే సారథ్యంలో నాలుగు రోజులుగా అసోంలోని గౌహతిలో హోటల్లో మకాం చేసిన 40 మందికి పైగా సేన రెబల్ ఎమ్మెల్యేలు తమది శివసేన (బాలాసాహెబ్) వర్గమని ప్రకటించుకున్నారు. తామేమీ పార్టీని వీడటం లేదని, షిండే సూచించిన మేరకు తమ వర్గానికి ఓ పేరు మాత్రం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. సభలోనూ అదే పేరిట కొనసాగుతామనే సంకేతాలిచ్చారు. రెబల్స్ తరఫున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ శనివారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్ధవ్పై తమకేమీ వ్యతిరేకత లేదన్నారు. ‘‘కానీ 55 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో ఆయన వైపున్న వారి సంఖ్య 15 కంటే తక్కువకు పడిపోయింది. మూడింట రెండొంతుల మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో గళమెత్తుతున్నామంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఆయనే అర్థం చేసుకోవాలి. పార్టీని హైజాక్ చేసింది మేం కాదు, అధికార కూటమి భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్. వాటి బారినుంచి పార్టీని కాపాడుకోవడమే మా ఉద్దేశం’’ అన్నారు. ఉద్ధవ్ ఇప్పటికైనా ఆ పార్టీలకు గుడ్బై చెప్పి బీజేపీతో చేతులు కలపాలని డిమాండ్ చేశారు. పార్టీకి మద్దతు ఉపసంహరిస్తారా అని ప్రశ్నించగా తమదే అసలైన శివసేన అని చెప్పుకొచ్చారు. ‘‘ఈ ఒత్తిళ్లలో ముంబై తిరిగి రావడం క్షేమం కాదు. సరైన సమయంలో తిరిగొస్తాం’’ అని ప్రకటించారు. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండేను గుర్తించాలన్న తమ లేఖను డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని ఖండించారు. ‘‘ప్రభుత్వానే ఉద్ధవ్ నెలల తరబడి ఆన్లైన్ మీటింగులతో నడిపిస్తున్నారు. కనుక డిప్యూటీ స్పీకర్నూ ఆన్లైన్ మీటింగ్ పెట్టమనండి. మా బలం నిరూపించుకుంటాం’’ అని సవాలు చేశారు. జూన్ 30 దాకా వాళ్లు గౌహతి హోటల్లోనే ఉంటారని సమాచారం. సంకీర్ణ కొండచిలువ విషకౌగిలి నుంచి శివసైనికులను విముక్తులను చేసేందుకే పోరాడుతున్నానంటూ శనివారం రాత్రి పొద్దుపోయాక షిండే ట్వీట్ చేశారు. శివసేన కార్యకర్తలంతా దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఆయన శుక్రవారం రాత్రి గుజరాత్లోని వడోదర వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినట్టు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు అందులో పాల్గొన్నట్టు చెబుతున్నారు. ముంబైలో 144 సెక్షన్ మరోవైపు ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన జాతీయ కార్యవర్గ భేటీ జరిగింది. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారాన్ని సభ్యులంతా ఉద్ధవ్కు కట్టబెట్టారు. శివసేన, బాలాసాహెబ్ ఠాక్రే పేరు ఎవరూ వాడుకోవడానికి వీల్లేదంటూ తీర్మానం చేశారు. శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఉద్ధవ్కు సంఘీభావం ప్రకటించారు. శివ సైనికులను వీధుల్లోకి వదులుతామంటూ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటన చేశారు. దమ్ముంటే ముంబై వచ్చి పార్టీని ఎదుర్కోవాలని షిండేకు సవాలు విసిరారు. సత్యాసత్యాల మధ్య పోరాటంలో గెలుపు తమదేనని ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే అన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలువురు రెబల్ ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల వద్ద భారీ నిరసనలకు, దాడులకు దిగారు. పలువురి కార్యాలయాలను ధ్వంసం చేశారు. తనతో పాటున్న 38 మంది రెబల్ ఎమ్మెల్యేల కుటుంబాలకు పోలీసులు కావాలనే భద్రత ఉపసంహరించారని షిండే ఆరోపించారు. వీటిని హోంమంత్రి దిలీప్ వాస్లే పాటిల్ ఖండించారు. ఉద్రిక్తత నేపథ్యంలో ముంబైలో జూలై 10 దాకా 144 సెక్షన్ విధించారు. ఉద్ధవ్ ఫిర్యాదు మేరకు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు పంపారు. సోమవారం సాయంత్రంలోగా స్పందించాలని ఆదేశించారు. -
ఎన్సీపీకి కేసర్కర్ టాటా
సాక్షి ముంబై: సావంత్వాడి ఎన్సీపీ ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ అందరు ఊహించినట్టుగానే ఆదివారం ఎన్సీపీకి రాజీనామా చేశారు. వచ్చే నెల శివసేనలో చేరనున్నట్టు ప్రకటించారు. దీపక్ కేసర్కర్ ఎన్సీపీని వీడి శివసేనలో చేరనున్నట్టు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మీడియాలోనూ అనేక కథనాలు వచ్చాయి. కేసర్కర్ ఈ పుకార్లను కొట్టిపడేసినప్పటికీ ఆదివారం ఎన్సీపీకి రాజీనామా చేసి శివసేనలో చేరనున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరేతో భేటీ అయి, తన సమస్యలు, ఫిర్యాదులు వివరించారు. తట్కరే నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. మరో ఎనిమిది రోజుల్లో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడైన నారాయణ రాణే దాదాగిరికి వ్యతిరేకంగా దీపక్ ఇటీవల గళమెత్తిన సంగతి తెలిసింది. నీలేశ్ రాణేను ఓడించి, కొం కణ్లో గూండాయిజానికి తెరదించండి అంటూ మిత్రపక్షానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. రాణే కు ఎన్సీపీ మద్దతు ప్రకటించినప్పటికీ కేసర్కర్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించారు. అంతేగాక పార్టీ అధిష్టానంపై నిరసన వ్యక్తం చేశా రు. దీంతో ఆయన ఎన్సీపీని వీడనున్నట్టు వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. నారాయణ రాణేపై అనేక ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆయనకు పార్టీ మద్దతు ఇవ్వవద్దని చెప్పాను. కాంగ్రెస్కు వ్యతిరేకంగా తాము నిర్ణయం తీసుకోలేమని సునీల్ తట్కరే స్పష్టం చేస్తూ, నన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అందుకే నేను పార్టీని వీడాల్సివచ్చింది. కేవలం సిందుధుర్గ్ జిల్లాలో మళ్లి ప్రజాసామ్యాన్ని నిలబెట్టేందుకు పార్టీని వీడుతున్నాను. పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్పై ఇప్పటికి నాకు గౌర వం ఉంది. ఇక శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించాను. మా కార్యకర్తలతో చర్చించి తొందర్లనే శివసేనలో చేరుతాను’ అని కేసర్కర్ ప్రకటించారు. ఆయన నియామకంతో శివసేనకు కొంకణ్లో బల మైన నాయకుడు లభించినట్టయిందని చెప్పవచ్చు. కేసర్కర్ బాటలోనే పలువురు మాజీలు గతంలో సేనను వీడిన అనేక మంది తిరిగి శివసేన లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మా జీలకు ఆహ్వానం పలుకుతున్నామని ఠాక్రే సైతం ప్రకటించారు. త్వరగా శివసేనలో చేరాలని లేకుం టే, పార్టీ తలుపులు తొందర్లోనే మూసివేస్తామని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఛగన్ భుజ్బల్, నారాయణరాణే వంటి మాజీలు తిరిగి శివసేనలో చేరనున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను భుజ్బల్, రాణేలు ఖండించినప్పటికీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోపు రాష్ట్ర రాజకీయాల్లో పలుమార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీల్లో విజయం సాధించగల గల శివసేనకు సత్తా తమకు ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజాసామ్య కూటమి కూడా చీలిక దిశగా సాగుతోంది. అందుకే సేనలోకి ప్రవేశించాలనుకునేవారు త్వరగా రావాలని ఉద్ధవ్ ప్రకటనలు చేస్తున్నారు. అన్ని వివరాలను చూశాకే మాజీలను పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు. -
శివసేనలోకి ఎన్సీపీ ఎమ్మెల్యే!
సాక్షి, ముంబై: లోక్సభ ఎన్నికల్లో రత్నగిరి సింధుదుర్గా లోక్సభ నియోజకవర్గంలో ఎన్సీపీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ శివసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత శివసేన నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా దీపక్ కేసర్కర్ శివసేనలో చేరనున్నారనే వార్తలను బలపరిచేలా కనిపిస్తున్నాయి. రత్నగిరి-సింధుదుర్గాలో నారాయణ రాణే కుమారుడైన సిట్టింగ్ ఎంపీ నీలేష్ రాణేను వినాయక్ రావుత్ ఓడించారు. ఎన్నికలకు ముందు ఉద్ధవ్ఠాక్రే ప్రచారంలో కూడా కేసర్కర్పై పెద్దగా ఎన్నడూ విమర్శలు చేయలేదు. వినాయక్ రావుత్ విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసర్కర్ మహాకూటమి టికెట్పై పోటీ చేస్తే మంత్రి పదవి కూడా లభిస్తుందని చెప్పారు. దీన్నిబట్టి ఆయనను చేర్చుకునేందుకు శివసేన కూడా ఆసక్తిగా ఉందని, వినాయక్ రావుత్ విజయానికి ఆయన కూడా పరోక్షంగా లాభం చేకూర్చినట్టు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement