-
సెప్టెంబర్లో ఉమ్మడి అర్హత పరీక్ష!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్)ను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శనివారం వెల్లడించారు. ఈ పరీక్షను నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) నిర్వహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకొనే యువతకు మంచి అవకాశమన్నారు. గ్రూప్–బి, గ్రూప్–సి(నాన్ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి ‘సెట్’ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం ఉంటుందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతకు ఇది ఉపయోగకరమని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు పరీక్ష కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతోనే ఈ ఏడాది నుంచి ‘సెట్’ అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. ఇదొక గొప్ప సంస్కరణ అని అభివర్ణించారు. ‘సెట్’ ఉన్నప్పటికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వంటి సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీలు కొనసాగుతాయని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. -
జాతీయ నియామక సంస్థ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) గ్రూప్ బి, గ్రూప్ సి (నాన్–టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్ఆర్ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్కు చెందిన ప్రతినిధులు ఉంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ (ఐబీపీఎస్) సంస్థలు ఇక వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండా.. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించి స్కోరు కేటాయిస్తుంది. కేంద్రం ఈ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) కోసం రూ.1,517.57 కోట్లు ఖర్చు చేయనుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షాకేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తారు. ఇవీ ప్రయోజనాలు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షలు అభ్యర్థులపై, అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి. సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకే సారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను చేరువ చేస్తుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్ష రాయడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుంది. పరీక్ష ఫీజుతో పాటు, అభ్యర్థులు ప్రయాణం, బోర్డింగ్, బస వంటి వాటి కోసం అదనపు ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఒకే పరీక్ష అభ్యర్థులపై ఆర్థిక భారాన్ని పెద్ద ఎత్తున తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా అభ్యర్థులు రవాణా, బస లభ్యతలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు సహాయకులను వెంట తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ అవస్థలు కూడా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) ద్వారా తగ్గనున్నాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ముఖ్యాంశాలు.. ► ఎన్ఆర్ఏ కింద ఒక పరీక్షలో హాజరు కావడం ద్వారా అభ్యర్థులు అనేక పోస్టులకు పోటీపడే అవకాశం లభిస్తుంది. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ (మొదటి–స్థాయి / టైర్ 1) పరీక్షను నిర్వహిస్తుంది, ఇది అనేక ఇతర ఎంపికలకు మెట్టుగా మారుతుంది. ► కామన్ ఎలిజిబిలిటీ టెస్టును ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. ► ఫలితం ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల కాలానికి అభ్యర్థి యొక్క సీఈటీ స్కోరు చెల్లుతుంది. స్కోరు మెరుగుపర్చుకోవడం కోసం పరీక్ష మళ్లీ రాసుకోవచ్చు. ఉన్న స్కోర్లలో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ► గరిçష్ట వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు గరిష్ట వయోపరిమితి ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు లోబడి ఉంటుంది. ► ప్రిలిమినరీ టెస్ట్లో వచ్చే స్కోరు అధారంగా ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ సంస్థలు తమ నియామకాల కోసం అవసరమైన సందర్భాల్లో తదుపరి దశల్లో పరీక్ష నిర్వహిస్తాయి. ► కంప్యూటర్ ఆధారిత సీఈటీని మూడు కేటగిరీల్లో నిర్వహిస్తారు. పట్టభద్రులు, 12వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులకు వేర్వేరు కేటగిరీలుగా ఈ పరీక్ష ఉంటుంది. ► పరీక్షలకు ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ► మల్టిపుల్ చాయిస్ ఆబెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ► అభ్యర్థులు ఒక పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని సెంటర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు, మార్కులు, మెరిట్ లిస్టు... అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. ► విభిన్న భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ► సీఈటీ స్కోరు ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ ఏజెన్సీలకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ఏజెన్సీలు కూడా ఈ సీఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుని రిక్రూట్మెంట్ చేసుకుంటాయని కేంద్రం ఆశిస్తోంది. ► సెట్ ఆధారంగా జరిగి ప్రాథమిక వడపోతతో అనేక నియామక ప్రక్రియలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. యువతకు ప్రయోజనకరం: ప్రధాని జాతీయ నియామక సంస్థ ఏర్పాటు దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రయోజనకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బహుళ పరీక్షలను తొలగించి, విలువైన సమయాన్ని, వనరులను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. దీని మూలంగా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఎంతో డబ్బును, సమయాన్ని ఆదా చేసే కామన్ ఎలిజిబిలిటీ టెస్టును ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. -
ఇకపై ఏయూకి ఏపీ సెట్ బాధ్యతలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సబ్జెక్టుల వారీగా నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్టు (సెట్)ను వచ్చే ఏడాదినుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి (ఏయూ) అప్పగించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ ఈ సెట్ను నిర్వహిస్తోంది. అయితే ఏపీ విద్యార్థులతో కలిపి సెట్ను నిర్వహించరాదని రెండు రాష్ట్రాలకు వేర్వేరుగానే సెట్లు నిర్వహించాలని తెలంగాణ ప్రాంత విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. రెండింటికీ కలిపి ఒకే సెట్ను నిర్వహిస్తే తమకు అన్యాయం జరుగుతుందని వారు వాదిస్తున్నారు. అయితే ఉన్నత విద్యామండలి అధికారికంగా విభజన కాకపోవడం, యూజీసీ అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు వేర్వేరుగా సెట్లు నిర్వహించేందుకు వీలుకాదని మండలి స్పష్టం చేసి ఒకే సెట్కు నిర్ణయించింది. యూజీసీని కూడా సంప్రదించి గతంలో ఉమ్మడిగా ఉన్నసమయంలో నిర్ణయించిన మేరకు ఆ సంస్థ సూచనలతో ఉస్మానియా వర్సిటీకి బాధ్యతలు అప్పగించింది. సెట్ నిర్వహణకు సంబంధించి యూజీసీ నుంచి అనుమతులు రావడానికి చాలా సమయం పడుతుంది కనుక ఈ ఏడాదికి రెండు రాష్ట్రాలకు కలిపి సెట్ను ఉస్మానియా వర్సిటీనే సెట్ను నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 4న జరిగే సెట్కు ఈనెల 10వ తేదీ నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. రెండు రాష్ట్రాలకు కలిపి ఒకేమాదిరి ప్రశ్నపత్రాలతో ఈ పరీక్షలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల అభ్యర్థులకు కలిపి ఉమ్మడి మెరిట్ జాబితాను రూపొందించనున్నారు. ఈసెట్ను ఇలా పూర్తిచేసినా తాజా వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా టీఎస్ సెట్, ఏపీ సెట్లను నిర్వహించడం మంచిదని ఉన్నత విద్యామండలి వర్గాలంటున్నాయి. ఏపీ సెట్ బాధ్యతను ఏయూకు అప్పగించాలని భావిస్తున్నాయి. దీనిపై కసరత్తు ప్రారంభిస్తే వచ్చే ఏడాది సెట్కు యూజీసీ అనుమతులు వస్తాయని అంచనా వేస్తున్నాయి.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement