breaking news
china vs india
-
భారత్-చైనా సరిహద్దు గస్తీపై చైనా అధ్యక్షుడు ఎంక్వైయిరీ
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆసక్తికర పరిణామానికి దారి తీశారు. తూర్పు లడఖ్లో భారత్-చైనా సరిహద్దులో ఉన్న చైనా సైనికులతో వీడియోకాల్లో ముచ్చటించారు. అక్కడ గస్తీ నిర్వహణపై ఎంక్వైయిరీ చేశారు. సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నాడు. అలాగే అక్కడ నిరంతరం మారుతున్న పరిస్థితులు గురించి ఆరా తీశారు జిన్పింగ్. ఈ మేరకు ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి జిన్పింగ్ ఖుంజెరాబ్లోని సరిహద్దు రక్షణ స్థితిపై అక్కడ సైనికులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. అలాగే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న సైనికులు తాము సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామంటూ అధ్యక్షుడి జిన్పింగ్కి బదులిచ్చారు. సైనికులు అక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకోవడమే గాక వారి క్షేమ సమాచారాలను కూడా జిన్పింగ్ తెలుసుకున్నారు. వారు ఉన్న ప్రదేశాల్లో తాజా కూరగాయాలు దొరుకుతున్నాయో లేదా అని కూడా అడిగారు. అంతేగాదు జిన్పింగ్ సరిహద్దులో పోరాడేందకు వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కూడా సైనికులకు భరోసా ఇచ్చారు. కాగా, ఇదే తూర్పు లడఖ్ ప్రాంతంలో 2020,మే5న పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ చెలరేగి భారత్ చైనాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అదీగాక తూర్ప లడఖ్ సరిహద్దు స్టాండ్ ఆఫ్పై భారత్, చైనా ఇరుపక్షాలు 17 రౌండ్ల ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి శాంతి, ప్రశాంతత అవసరమని భారత్ నొక్కి చెప్పింది. (చదవండి: పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు! జెలెన్స్కీ షాకింగ్ వ్యాఖ్యలు) -
భారత్ కంటే చైనా రక్షణ బడ్జెట్ మూడురెట్లు ఎక్కువ
గడిచిన కొన్ని దశాబ్దాలుగా చైనా తన రక్షణ బడ్జెట్ను గణనీయంగా పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం అది భారత రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ పెంటగాన్ తెలిపింది. చైనా ఇలా బడ్జెట్ పెంచుకుంటూ పోవడం అమెరికా భద్రతకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారికంగా చూసినా గత సంవత్సరపు చైనా రక్షణ బడ్జెట్ రూ. 8,683 లక్షల కోట్లు కాగా, భారత రక్షణ బడ్జెట్ మాత్రం రూ. 2,434 లక్షల కోట్లేనని పెంటగాన్ తన వార్షిక నివేదికలో తెలిపింది. రక్షణ బడ్జెట్ పెంచుకోవడమే కాదు.. ఆయుధాల ఎగుమతిలో కూడా చైనా ముందే ఉంది. ఆ దేశం నుంచి అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో పాకిస్థాన్ ముందుంది. సంప్రదాయ ఆయుధాల కొనుగోలుకు పాకిస్థాన్ ప్రధానంగా చైనామీదే ఆధారపడుతోందని పెంటగాన్ చెప్పింది. రాబోయే ఏళ్లలో చైనా ఆయుధ ఎగుమతులు మరింత పెరుగుతాయని, అక్కడి స్వదేశీ రక్షణ పరిశ్రమ రోజురోజుకూ ఎదుగుతోందని చెబుతున్నారు.