breaking news
Centre approval
-
రెండు జాతీయ రహదారుల విస్తరణకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు కీలక జాతీయ రహదారుల్లో వాహనాలు వేగంగా ముందుకు సాగే వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్న అడ్డంకులను అధిగమించేందుకు మార్గం సుగమమైంది. ఆ రోడ్లలో నాలుగు ప్రాంతాల్లో బైపాస్లను నిర్మించనున్నారు. ఎన్హెచ్–63 (నిజామాబాద్–జగదల్పూర్ రహదారి), ఎన్హెచ్–563 (జగిత్యాల–కరీంనగర్–వరంగల్–ఖమ్మం రహదారి)లను భారత్మాల పరియోజనలో భాగంగా నాలుగు లేన్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. కానీ, విస్తరణకు కావాల్సిన భూసేకరణ మొదలు ఇతర చాలా అంశాల్లో అడ్డంకులు నెలకొనటంతో పనులు ప్రారంభం కాకుండా జాప్యం జరుగుతూ వస్తోంది. తాజాగా ఆయా అడ్డంకులను అధిగమిస్తూ ఎన్హెచ్ఏఐ విస్తరణ పనులకు టెండర్లు తెరిచి నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.మొత్తం 271 కి.మీ. నిడివి గల విస్తరణ పనులకు రూ.10,034 కోట్ల మొత్తానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదముద్ర వేసింది. ఆర్మూర్–జగిత్యాల, జగిత్యాల–కరీంనగర్, జగిత్యాల–మంచిర్యాల మధ్య ఈ పనులు జరగనున్నాయి వచ్చే ఫిబ్రవరిలో పనులు మొదలయ్యే అవకాశముంది. ఎన్హెచ్–63లో (ఆర్మూర్–మంచిర్యాల సెక్షన్)ఆర్మూర్–జగిత్యాల మధ్య 64 కి.మీ. నిడివి నిర్మాణానికి రూ.2,338 కోట్లు వ్యయం చేయనున్నారు. తాజా లైన్ క్లియర్తో మూ డేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. ఇదే రోడ్డులో జగిత్యాల–మంచిర్యాల మధ్య 68కి.మీ. మేర మరో ప్యాకేజీ పనులు జరగనున్నాయి. ఇందుకు రూ.2,550 కోట్లు వ్యయం కానుంది. ఈపీసీ మోడల్లో టెండర్లు ఆమోదించారు. ఇప్పుడు ఎట్టకేలకు పనులు మొదలు కానున్నాయి. ఇక్కడి కోల్ బెల్ట్కు ఈ రోడ్డు విస్తరణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ⇒ ఎన్హెచ్–563 (జగిత్యాల–వరంగల్)లో భాగంగా జగిత్యాల–కరీంనగర్ మధ్య 59 కి.మీ. నిడివిని 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకు రూ.2,484 కోట్లు ఖర్చు చేస్తారు. రోడ్డు విస్తరణతోపాటు జంక్షన్లను కూడా విస్తరించనుండటంతో ట్రాఫిక్ చిక్కులు దూరం కానున్నా యి. సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పనులను హ్యామ్ పద్ధతిలో నిర్వహిస్తారు. దీని విస్తరణతో జగిత్యాల–వరంగల్ మధ్య ప్రయాణ సమయం గంటన్నర మేర తగ్గుతుంది. కరీంనగర్–వరంగల్ మధ్య 16 కి.మీ. మేర రూ.500 కోట్లతో రోడ్డును మెరుగుపరచనున్నారు. -
ఏపీ రహదారులకు మహర్దశ
-
తెలంగాణ రాష్ట్ర కేడర్కు ఆరుగురు ఐఏఎస్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేడర్కు ఆరుగురు 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. శ్రద్ధ శుక్ల (ఛత్తీస్గఢ్), కిరణ్మయి కోపిశెట్టి (తెలంగాణ), నారాయణ్ అమిత్ మాలెపాటి (తెలంగాణ), వికాస్ మహతో (ఝార్ఖండ్), ఉమాశంకర్ ప్రసాద్ (బిహార్), మాయంక్ సింగ్ (మధ్యప్రదేశ్) త్వరలో రాష్ట్ర కేడర్లో చేరనున్నారు. కేంద్ర సర్వీసులకు రజత్షైనీ రాష్ట్ర రెవెన్యూ శాఖ లో సీసీఎల్ఏ డైరెక్టర్గా పనిచేస్తున్న 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండస్ట్రీ ప్రమోషన్, ఇంటర్నల్ ట్రేడ్ విభాగానికి డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: రైతే జెండా.. ఎజెండా! బీఆర్ఎస్ కార్యచరణపై కేసీఆర్ కసరత్తు -
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
-
సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ
న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్-19 కట్టడికి వచ్చే నెల మొదట్లో దేశీయంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు ఫార్మా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీరమ్ నుంచి సుమారు 5 కోట్ల డోసేజీలను ప్రభుత్వం సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. (మెడ్ప్లస్పై వార్బర్గ్ పింకస్ కన్ను!) ఎంహెచ్ఆర్ఏ తదుపరి.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు యూకేకు చెందిన ఔషధాలు, ఆరోగ్యపరిరక్షణ ఉత్పత్తుల నియంత్రణ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తదుపరి రెండు, మూడు రోజుల్లో దేశీయంగానూ ప్రభుత్వం అనుమతించే వీలున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. వెరసి ప్రధాని మోడీ త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ఇప్పటికే తొలి దశలో వ్యాక్సిన్ను అందించవలసిన ప్రజల జాబితాను సిద్ధం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ అయినట్లు మీడియా తెలియజేసింది. కొత్త ఏడాదిలో కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ల తొలి డోసేజీలను జనవరిలో పంపిణీ చేసే వీలున్నట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. జనవరిలో ఏదొక వారంలో వ్యాక్సిన్ల తొలి డోసేజీ పంపిణీ ప్రారంభంకాలగలదని వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రానున్న 6-7 నెలల్లో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్లను అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కాగా.. దేశీయంగా అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతించమంటూ ఇప్పటికే డీసీజీఐకు సీరమ్ ఇన్స్టిట్యూట్తోపాటు.. ఫైజర్, భారత్ బయోటెక్లు దరఖాస్తు చేసినట్లు ఈ సందర్భంగా ఫార్మా నిపుణులు ప్రస్తావించారు. -
23 ఎఫ్డీఐ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సారథ్యంలో సోమవారం సమావేశమైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) 47 ప్రతిపాదనలను పరిశీలించింది. గ్రీన్సిగ్నల్ లభించిన వాటిలో మైలాన్ ల్యాబరేటరీస్, జీఎస్కే ఫార్మా, డెన్ నెట్వర్క్స్ మొదలైనవి ఉన్నాయి. మరోవైపు రిలయన్స్ గ్లోబల్కామ్, సిస్టెమా శ్యామ్ టెలీ ప్రతిపాదనలపై నిర్ణయాలను ఎఫ్ఐపీబీ వాయిదా వేసింది. 2013-14లో 24.29 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా .. 2014-15లో 27% పెరిగి 30.93 బిలియన్ డాలర్లకు చేరాయి.


