-
ఒకేరోజు 75వేల మందికి ఉద్యోగాలు.. ప్రధాని మోదీ దీపావళి గిఫ్ట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దివాళీకి రెండు రోజుల ముందు శనివారం వారితో వర్చువల్గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు(అపాయింట్మెంట్ లెటర్స్) అందించనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని స్పెషల్ గిఫ్ట్ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి కేంద్ర మంత్రులు సైతం ఈ వర్చువల్ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ ఒడిశా నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా గుజరాత్ నుంచి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్ నుంచి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్ర నుంచి హాజరుకానున్నారు. అలాగే.. ఎంపీలందరూ వారి వారి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు -
‘కేంద్ర’ ఉద్యోగాల భర్తీపై స్పష్టత: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అధికారుల ప్రాథమిక గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 15 లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్టు తెలిసిందన్నారు. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖల్లో 8.72 లక్షలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో మరో 6.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాస్తవ ఖాళీల సం ఖ్యను బహిర్గతం చేసి వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమ ర్శించారు. ప్రస్తుత ఖాళీలను పక్కాగా ప్రక టించి వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తే నిరుద్యోగులకు లాభం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల వారికి అవకాశాలు దక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రధాని మోదీకి ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. -
జాతీయ నియామక సంస్థ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) గ్రూప్ బి, గ్రూప్ సి (నాన్–టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్ఆర్ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్కు చెందిన ప్రతినిధులు ఉంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ (ఐబీపీఎస్) సంస్థలు ఇక వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండా.. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించి స్కోరు కేటాయిస్తుంది. కేంద్రం ఈ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) కోసం రూ.1,517.57 కోట్లు ఖర్చు చేయనుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షాకేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తారు. ఇవీ ప్రయోజనాలు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షలు అభ్యర్థులపై, అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి. సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకే సారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను చేరువ చేస్తుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్ష రాయడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుంది. పరీక్ష ఫీజుతో పాటు, అభ్యర్థులు ప్రయాణం, బోర్డింగ్, బస వంటి వాటి కోసం అదనపు ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఒకే పరీక్ష అభ్యర్థులపై ఆర్థిక భారాన్ని పెద్ద ఎత్తున తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా అభ్యర్థులు రవాణా, బస లభ్యతలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు సహాయకులను వెంట తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ అవస్థలు కూడా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) ద్వారా తగ్గనున్నాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ముఖ్యాంశాలు.. ► ఎన్ఆర్ఏ కింద ఒక పరీక్షలో హాజరు కావడం ద్వారా అభ్యర్థులు అనేక పోస్టులకు పోటీపడే అవకాశం లభిస్తుంది. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ (మొదటి–స్థాయి / టైర్ 1) పరీక్షను నిర్వహిస్తుంది, ఇది అనేక ఇతర ఎంపికలకు మెట్టుగా మారుతుంది. ► కామన్ ఎలిజిబిలిటీ టెస్టును ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. ► ఫలితం ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల కాలానికి అభ్యర్థి యొక్క సీఈటీ స్కోరు చెల్లుతుంది. స్కోరు మెరుగుపర్చుకోవడం కోసం పరీక్ష మళ్లీ రాసుకోవచ్చు. ఉన్న స్కోర్లలో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ► గరిçష్ట వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు గరిష్ట వయోపరిమితి ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు లోబడి ఉంటుంది. ► ప్రిలిమినరీ టెస్ట్లో వచ్చే స్కోరు అధారంగా ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ సంస్థలు తమ నియామకాల కోసం అవసరమైన సందర్భాల్లో తదుపరి దశల్లో పరీక్ష నిర్వహిస్తాయి. ► కంప్యూటర్ ఆధారిత సీఈటీని మూడు కేటగిరీల్లో నిర్వహిస్తారు. పట్టభద్రులు, 12వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులకు వేర్వేరు కేటగిరీలుగా ఈ పరీక్ష ఉంటుంది. ► పరీక్షలకు ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ► మల్టిపుల్ చాయిస్ ఆబెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ► అభ్యర్థులు ఒక పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని సెంటర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు, మార్కులు, మెరిట్ లిస్టు... అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. ► విభిన్న భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ► సీఈటీ స్కోరు ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ ఏజెన్సీలకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ఏజెన్సీలు కూడా ఈ సీఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుని రిక్రూట్మెంట్ చేసుకుంటాయని కేంద్రం ఆశిస్తోంది. ► సెట్ ఆధారంగా జరిగి ప్రాథమిక వడపోతతో అనేక నియామక ప్రక్రియలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. యువతకు ప్రయోజనకరం: ప్రధాని జాతీయ నియామక సంస్థ ఏర్పాటు దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రయోజనకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బహుళ పరీక్షలను తొలగించి, విలువైన సమయాన్ని, వనరులను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. దీని మూలంగా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఎంతో డబ్బును, సమయాన్ని ఆదా చేసే కామన్ ఎలిజిబిలిటీ టెస్టును ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. -
ఉద్యోగ ఖాళీలకు ప్రాచుర్యం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని స్థానిక ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్లు, ఉద్యోగ సమాచార పత్రికల్లో ప్రచురించాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. 2017 కల్లా వివిధ విభాగాల్లో 2 లక్షల ఉద్యోగాల కల్పన యోచన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, మంత్రిత్వ శాఖలు రోజువారీ కూలీల నియామకాలను ఆపకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని డీపీఓటీ హెచ్చరించింది.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement