breaking news
CACP recommendations
-
నేడు విశాఖలో సీఏసీపీ సమావేశం
సాక్షి, అమరావతి: రబీ 2024–25 మార్కెటింగ్ సీజన్కు కనీస మద్దతు ధరలు నిర్ణయించేందుకు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం విశాఖ పట్నంలో శుక్రవారం జరుగనుంది. సీఏసీపీ చైర్మన్ విజయ్పాల్ శర్మ అధ్యక్షతన విశాఖలోని పార్క్ హోటల్లో జరుగనున్న ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొననున్నారు. ఆయారాష్ట్రాల్లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరపైన ఖర్చులు, రాబడి వివరాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తారు. రాబోయే సీజన్కు కనీస మద్దతు ధరలను నిర్ణయించి ముసాయిదా నివేదికను కమిషన్ కేంద్రానికి సమర్పిస్తుంది. కేంద్రం వీటిని అధ్యయనం చేసి ప్రతీ ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనీస మద్దతు ధరలను నిర్ణయించి ప్రకటిస్తుంది. రబీ పంట కాలానికి సంబంధించి ఆహార ధాన్యాల కింద గోధుమ, బార్లీ పంటలకు, అపరాల కిందశనగ, మెంతులుæ పంటలు, నూనెగింజల కింద ఆవాలు, కుసుమ పంటల ఉత్పాదక ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలు ప్రతిపాదిస్తాయి. ఏపీలో అపరాల పంటలలో ఎక్కువగా సాగయ్యే శనగ పంటతో పాటు నూనెగింజలలో ఒకటైన ఆవాలకు కనీస మద్దతు ధరలకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా సీఏసీపీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రబీ–2022–23 మార్కెటింగ్ సీజన్లో శనగ పంటకు క్వింటాల్ రూ.5,230, ఆవాలకు రూ.5,050గా ప్రకటించారు. అయితే ప్రస్తుతం పెరిగిన పెట్టుబడి ఖర్చులు, రాబడిని దృష్టిలో పెట్టుకుని రబీ 2024–25 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి శనగ పంట ఉత్పత్తులకు క్వింటాల్కు రూ.7,983లుగా, ఆవాలు క్వింటాల్కు రూ.6,608 చొప్పున పెంచి కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కు నివేదిక సమర్పించనుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా తమకు కేటాయించిన పంట ఉత్పత్తులకు సంబంధించిన ప్రతిపాదనలను కమిషన్కు సమర్పించనున్నాయి. -
వరి మద్దతు రూ.50 పెంపు!
- రాగికి క్వింటాల్కు రూ.100, వేరుశనగకు రూ.30 పెంపు - కేంద్రానికి సీఏసీపీ సిఫార్సులు న్యూఢిల్లీ: వరి రైతులకు శుభవార్త. వరి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను క్వింటాల్కు రూ.50 పెంచాలని కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ ప్రతిపాదించింది. దీంతో వరి ఎంఎస్పీ రూ.1,410కి చేరనుంది. అలాగే రాగికి క్వింటాల్కు రూ.100 పెంచి రూ.1,650 చేయాలని, వేరుశనగకు రూ. 30 పెంచి రూ.4,030 చేయాలని వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ (సీఏసీపీ) కేంద్ర వ్యవసాయ శాఖకు సిఫార్సు చేసింది. కమిషన్ 2015-16 ఖరీఫ్ సీజన్కు పలు పంటల మద్దతు ధరలను ప్రతిపాదించింది. కమిషన్ ప్రతిపాదనలపై కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను, వివిధ విభాగాలను సంపద్రించి వారి అభిప్రాయాలను సేకరిస్తోందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. తదనంతరం తుది ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ అనుమతికి పంపుతారన్నారు. ప్రస్తుత 2014-15 (జూలై-జూన్)లో 103.04 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తవుతాయని అంచనా కాగా, గత ఏడాదిలో 106.65 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. కాగా, 2014-15లో వరికి క్వింటాల్కు రూ.50 పెంచారు. బీమా తీసుకున్న రైతులు 20 శాతమే.. భారత్లో పంట బీమా తీసుకున్న రైతులు 20 శాతానికి తక్కువగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 19 శాతం మంది రైతులు మాత్రమే వారు పండించే పంటకు బీమా తీసుకున్నట్లు అసోచామ్, స్కైమెట్ వెదర్ల సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం.. దాదాపు 81 శాతం మంది రైతులకు పంట బీమా తీసుకోలేదు. దేశవ్యాప్తంగా పంట బీమా తీసుకున్న వారి సంఖ్య 3.2 కోట్లు. రైతులు పంట బీమా తీసుకోకపోవడానికి క్లెయిమ్ సెటిల్మెంట్ జాప్యాలే కారణం.